23/09/2021
ఛత్రపతి శివాజీ మున్సిపల్ స్కూల్లో బాలల గ్రంథాలయం ప్రారంభం. 3 years లో 100 libraries target. పుస్తకాలు విజ్ఞాన సముపార్జనకు సోపానాలు అని అనంతపురము నగరపాలక సంస్థ కమీషనర్ పి.వి.వి.ఎస్.మూర్తి తెలిపారు.
తెల్సా వారి సౌజన్యంతో ఏజిఎస్ రెడ్డి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని స్థానిక ఛత్రపతి శివాజీ మున్సిపల్ స్కూల్ నందు బాలల గ్రంథాలయాన్ని మున్సిపల్ కమీషనర్ పి.వి.వి.ఎస్.మూర్తి, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘునాథ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమీషనర్ పి.వి.వి.ఎస్.మూర్తి, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, దాతలు ఏజీ ప్రమీలమ్మ, ఏజీ అనిల్కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమీషనర్ పి.వి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ, ఏజి శ్రీనివాసరెడ్డి స్ఫూర్తితో ఆయన సతీమణి ఏజీ ప్రమీలమ్మ, ఆయన తనయుడు ఏజీ అనిల్కుమార్ విస్తృత స్థాయిలో సేవాకార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. విద్యార్థుల్లో మానసిక వ్యక్తిత్వ వికాసం పెంపొందించే దిశగా బాలల గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు.
డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ, అత్యున్నత స్థాయికి ఎదిగిన ఎందరో మహనీయులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే అని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తోందని తెలిపారు.
ఏజిఎస్ రెడ్డి ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఏజీ ప్రమీలమ్మ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్న తపనతో తాము విద్యాసామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు.
దశాబ్దకాలంలో దాదాపు 1,10,000 పుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వంద గ్రంథాలయాల ఏర్పాటు లక్ష్యంగా నేడు మొదటి గ్రంథాలయాన్ని ప్రారంభించినట్లుతెలిపారు