20/08/2026
లైఫ్ స్కిల్స్ మరియు చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం-కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి
ఆంటీ ర్యాగింగ్ మరియు ఆంటీ డ్రగ్స్ క్యాంపస్ గా కాకతీయ విశ్వవిద్యాలయం ఉండాలి అది ప్రతి ఒక్కరూ బాద్యత గా తీసుకోవాలి
ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయం కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల లో ప్రిన్సిపాల్ రమణ గారి ఆధ్వర్యంలో లైఫ్ స్కిల్స్, పాజిటివ్ ధింకింగ్ , చట్టాలు, ఆన్టీ రాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు అనురాగ్ సొసైటీ చైర్మన్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ అనితా రెడ్డి పాల్గొన్నారు, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరములో చేరిన పిల్లలకు స్నేహపూరిత వాతావరణం లో తమకు ఈ కళాశాల విద్యా నైపుణ్యం ఏ కాక జీవితపు విలువలు నేర్పించుతుందన్న భరోసా కల్పించాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, ఈ సందర్భంగా లైఫ్ స్కిల్స్, పలు చట్టాలపై , పాజిటివ్ ధింకింగ్ మరియు పలు అంశాలపై విద్యార్థులకు అర్థం అయ్యేలా అవగాహన కల్పించారు, విద్యార్థులు తమ సమస్యలను తాము పరిష్కరించుకునే స్ధాయి కి చేరాలని, విద్యార్ధులు చదువుతోపాటు మంచి నడవడిక కలిగి ఉండాలని, ఒక లక్ష్యము పెట్టుకుని చదువు కోవాలని, తోటి విద్యార్థులతో చక్కని స్నేహభావం కలిగి ఉండాలని, ఏదైనా సమస్యలు ఎదురైతే ఎదుర్కొనే మానసిక స్ధర్యం కలిగి ఉండడమే నైపుణ్యం అని, ప్రతి చిన్న విషయాలకి భయపడి ఆత్మహత్యల వైపు మల్ల కూడదని అన్నారు అలాగే విద్యార్థులు తోటి విద్యార్దులపై రాగింగ్ కి పాల్పడితే చట్ట పరమైన శిక్షలు తప్పవని, రాగింగ్ మానసిక, శారీరక, ఎమోషనల్ గా లేదా ఇంకేరకంగా ఇతరులను ఇబ్బంది పెట్టినా రాగింగ్ కిందకే వస్తుందని, ప్రేమ పేరిట ఎంతో మంది తమ జీవితాలను నాశనము చేసుకుంటున్నారని వాటి బారిన పడవద్దని, ప్రతి కాలేజీ లో ఆంటీ రాగింగ్ కమిటీ, పోష్ ఇంటర్నల్ కమిటీలను ఏర్పాటు చేయాలని పిల్లలు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులకి సమాచారం ఫిర్యాదు చేయాలని లేదా తనకైనా చేయవచ్చు అని డాక్టర్ అనితా రెడ్డి తెలిపారు, ఆంటీ ర్యాగింగ్, ఆంటీ డ్రగ్ క్యాంపస్ గా కాకతీయ విశ్వవిద్యాలయం ఉండాలని దానికి ప్రతి ఒక్కరూ బాద్యత తీసుకోవాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ రమణ,కల్పన ప్రొఫెసర్లు, పిల్లలు పాల్గొన్నారు