Jana Vignana Vedika - AP

Jana Vignana Vedika - AP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jana Vignana Vedika - AP, Nonprofit Organization, 3rd floor, Balotsav Bhavan, Aakulavari Street, Governorpet, Vijayavada.

జన విజ్ఞాన వేదిక ఒక సైన్సు ప్రచార సంస్థ. భారత ప్రభుత్వం 2005వ సంవత్సరంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రజాదరణ వైపు చేసిన కృషికి గాను జాతీయ బహుమతి లభించింది.

👉బేతంచెర్లలో చెకుముకి సైన్స్ సంబరాల ప్రచారంనంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో చెకుముకి స...
24/08/2026

👉బేతంచెర్లలో చెకుముకి సైన్స్ సంబరాల ప్రచారం

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, మూఢనమ్మకాలను తొలగించడం, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేయడం, విజ్ఞానశాస్త్రంపై ఆసక్తిని కలిగించడం లక్ష్యంగా జెవివి నాయకులు వివిధ పాఠశాలలను సందర్శిస్తున్నారు. చెకుముకి పరీక్షలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తూ St. Anne's High School, Betamcherla, AP Model School, ZPHS Betamcherla, Read English Medium School తదితర పాఠశాలల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో చెకుముకి పరీక్షల్లో పాల్గొని, శాస్త్రీయ అంశాలపై తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జెవివి ప్రతినిధులు సూచించారు. ఈ సందర్భంగా బేతంచెర్ల మండల MEO గారి చేత చెకుముకి పోస్టర్‌ను విడుదల చేయించారు. పాఠశాలల్లో చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సహకారం అవసరమని జెవివి నాయకులు వివరించారు.
అలాగే మరియాదాసు సార్‌తో జెవివి బృందం సుదీర్ఘంగా చర్చిస్తూ, పాఠశాలల్లో శాస్త్రీయ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడం, విద్యార్థులను ప్రశ్నించేలా ప్రోత్సహించడం, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే విధంగా కార్యక్రమాలను రూపొందించడం వంటి అంశాలపై ఆలోచనలు పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో జెవివి నాయకులు మాణిక్యం శెట్టి, చెన్నయ్య, అనిల్, మనోహర్ తదితరులు పాల్గొని వివిధ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడారు. చెకుముకి సంబరాల ఉద్దేశ్యం, పరీక్షల ప్రాధాన్యత, విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించాల్సిన అవసరం గురించి వారు వివరించారు.

👉జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని పలు పాఠశాలల్లో చెకుముకి సైన్స్ సంబరాలు–పరీక్ష ప్రచార కార్య...
24/08/2026

👉జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని పలు పాఠశాలల్లో చెకుముకి సైన్స్ సంబరాలు–పరీక్ష ప్రచార కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, విజ్ఞానంపై ఆసక్తిని కలిగించడం, ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. పోలూరు ZPHS పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాల పరీక్షకు సంబంధించిన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అలాగే HGN హైస్కూల్, దుర్వేసి, ZPHS బిలకలగూడూరు పాఠశాలల్లోనూ విద్యార్థులకు చెకుముకి సైన్స్ సంబరాల ఉద్దేశ్యం, పరీక్ష విధానం, పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గడివేములలోని ZPHS పాఠశాలలో చెకుముకి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి, విద్యార్థుల్లో కార్యక్రమంపై ఆసక్తిని పెంచారు. అదేవిధంగా రాజరాజేశ్వరి E/M హైస్కూల్, శ్రీ రవీంద్ర భారతి హైస్కూల్, KGBV గడివేముల, St. Paul English Medium High School, AP Model School, గడివేముల పాఠశాలల్లో కూడా చెకుముకి వాల్ పోస్టర్లను విడుదల చేసి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు విద్యార్థులతో మాట్లాడుతూ సైన్స్‌ను కేవలం పాఠ్యపుస్తకాల్లోని విషయంగా కాకుండా, నిత్యజీవితాన్ని అర్థం చేసుకునే సాధనంగా చూడాలని సూచించారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉండి, ప్రతి విషయాన్ని పరిశీలన, ప్రయోగం, ఆధారాలు మరియు తార్కిక ఆలోచనతో అర్థం చేసుకోవాలని తెలిపారు.
చెకుముకి సైన్స్ సంబరాల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, ప్రశ్నించే స్వభావం పెంపొందించడమే కాకుండా, సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని విస్తరించేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం. పాఠశాలల నుంచి ప్రారంభమయ్యే ఇటువంటి విజ్ఞాన ప్రచార కార్యక్రమాలు భవిష్యత్ తరాలను మరింత శాస్త్రీయంగా, తార్కికంగా ఆలోచించే పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

🇮🇳🌼🌺భారత స్వాతంత్ర సమర యోధుడు, విప్లవ కారుడు, భగత్ సింగ్ సహచరుడు రాజ్ గురు జయంతి సందర్భంగా... ఆగస్ట్24     శివరాం హరి రా...
24/08/2026

🇮🇳🌼🌺భారత స్వాతంత్ర సమర యోధుడు, విప్లవ కారుడు, భగత్ సింగ్ సహచరుడు రాజ్ గురు జయంతి సందర్భంగా... ఆగస్ట్24

శివరాం హరి రాజ్ గురు(Shivaram Hari Rajguru) (1908 ఆగస్టు 24 - 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ కారుడు. ఇతను విప్లవ వీరులు భగత్ సింగ్, సుఖ్ దేవ్ ల సహచరునిగా గుర్తింపు పొందాడు. 1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందుకు గాను 1931 మార్చి 23 న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ లతో పాటు ఉరితీసారు.

💐బాల్య జీవితం

రాజ్‌గురు మహారాష్ట్రలోని ఖేద్ లో 1908 ఆగస్టు 24 న పార్వతి దేవి, హరినారాయణ రాజ్‌గురు దంపతులకు జన్మించాడు. ఖేద్ పూనా (ప్రస్తుత పూణే) సమీపంలో భీమా నది ఒడ్డున ఉంది. అతనికి ఆరేళ్ల వయసులో అతని తండ్రి మరణించాడు. కుటుంబ బాధ్యత అతని అన్నయ్య దిన్‌కర్ మీద పడింది. అతను ఖేద్ వద్ద ప్రాథమిక విద్యను పూర్తిచేసి, తరువాత పూనాలోని న్యూ ఇంగ్లీష్ హైస్కూల్లో చదువుకున్నాడు.

💐విప్లవాత్మక కార్యకలాపాలు

అతను హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు. అతను బ్రిటిష్ పాలన నుండి భారతదేశం ఏ విధంగానైనా విముక్తి పొందాలని కోరుకున్నాడు. రాజ్‌గురు, భగత్ సింగ్, సుఖ్‌దేవ్‌లు ఉద్యమంలో సహచరులయ్యారు. 1928 లో లాహోర్‌లో బ్రిటిష్ పోలీసు అధికారి జె పి సాండర్స్ హత్యలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్‌ను నిరసిస్తూ కవాతు చేస్తున్న ఉద్యమకారులపై పోలీసుల చర్యకు దెబ్బతిన్న లాలాలజపతిరాయ్ పక్షం రోజులలో మరణించినందున ప్రతీకారం తీర్చుకోవడాఅనికి వారు ఈ హత్యలో పాల్గొన్నారు. రాయ్ మరణం పోలీసుల చర్యల వల్ల సంభవించిందనే భావన వారికి ఉంది.

భగత్ సింగ్,రాజ్ గురు,సుఖదేవ్ లతో పాటు 21 మంది ఇతర సహ-కుట్రదారులను 1930 లో ప్రత్యేక నిబంధనల ప్రకారం విచారించారు. ఈ ముగ్గురిపై అభియోగాలు మోపారు.

💐ఉరిశిక్షలు

మార్చి 24 న ఉరి తీయడానికి సిద్ధం చేయబడిన ఆ ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులను 23 మార్చి 1931 న ఉరితీశారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద దహనం చేశారు.

💐జాతీయ అమరవీరుల స్మారక చిహ్నం

భారతదేశంలోని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనివాలా వద్ద నేషనల్ మెమోరియల్ ఉంది. లాహోర్ జైలులో ఉరిశిక్ష తరువాత, శివరామ్ రాజ్‌గురు, భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్ మృతదేహాలను రహస్యంగా ఇక్కడికి తీసుకువచ్చారు. వాటిని అధికారులు ఇక్కడ దహనం చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 23 న, అమరవీరుల దినోత్సవం (షాహీద్ దివాస్)నాడు ముగ్గురు విప్లవకారులను జ్ఞాపకం చేసుకుంటారు.

📡🔬📽️జీవకణ నిర్మాణం,పని విధానం పై విశేష కృషి చేసిన వైద్యుడు, జీవ కణ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత Albert Claude జయంతి సందర్...
24/08/2026

📡🔬📽️జీవకణ నిర్మాణం,పని విధానం పై విశేష కృషి చేసిన వైద్యుడు, జీవ కణ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత Albert Claude జయంతి సందర్భంగా... ఆగస్ట్24

ఆల్బర్ట్ క్లాడ్ ( Albert Claude ) ( 24 ఆగష్టు 1899 - 22 మే 1983 ) ఒక బెల్జియన్ - అమెరికన్ కణ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు. ఆయన 1974 సంవత్సరానికి గాను ఫిజియాలజీ / మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. జీవ కణంలోని వివిధ కణాంగాలను వేరుచేసి, విశ్లేషించే పద్ధతులను అభివృద్ధి చేశాడు. ఆయన కృషి ఆధునిక కణ శాస్త్రానికి ( cell biology ) కి ఆధారం.

మన శరీరం అనేక జీవ కణాలతో నిర్మితమై ఉంటుంది. జీవ కణాలలో అనేక కణాంగాలు ( organelles ) ఉంటాయి. ఆల్బర్ట్ క్లాడ్ వివిధ పద్ధతులను ఉపయోగించి ఈ కణాంగాలను అధ్యయనం చేశాడు. 1930 లో క్లాడ్ 'సెల్ ఫ్రాక్షనేషన్ బై డిఫరెన్షియల్ సెంట్రోఫ్యుగేషన్' అనే టెక్నిక్ ను కనుగొన్నాడు. దానిని ఉపయోగించి ఆయన రౌస్ సార్కోమా వ్యాధి కారకాన్ని, జీవ కణాంగాలైన మైటోకాండ్రియాన్, క్లోరోప్లాస్ట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్జి ఆపరేటస్, రైబోసోమ్, లైసోసోమ్ వంటి కణ భాగాలను కనుగొన్నాడు. క్లాడ్ సెల్ ఫ్రాక్షనేషన్ బై డిఫరెన్షియల్ సెంట్రోఫ్యుగేషన్ యొక్క బేసిక్ సూత్రాలను 1946 లో రెండు పత్రాల్లో క్రోడీకరించాడు.

ఆల్బర్ట్ క్లాడ్ 1942 ప్రాంతంలో అప్పటి వరకు జీవ శాస్త్ర పరిశోధనలో వినియోగించని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ను ఉపయోగించి కణ నిర్మాణాలను మామూలు మైక్రోస్కోప్ కన్నా ఎక్కువ రిజల్యూషన్ తో అధ్యయనం చేయగలిగాడు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో తీసిన తొలి కణ చిత్రాలను, కణాంగాల చిత్రాలను 1945 లో ప్రచురించాడు.

1945లో ఆయన జీవ కణం యొక్క మొదటి వివరణాత్మక నిర్మాణాన్ని ప్రచురించాడు. ఈయన పరిశోధనలు కణాల / కణాంగాల ధర్మాలను, విధులను తెలుసుకోవటానికి ఉపయోగపడ్డాయి.

🏆అవార్డులు

👉1970 లూయిసా గ్రాస్ హార్విట్జ్ ప్రైజ్
👉1971 పాల్ ఎర్లిచ్ మరియు లుడ్విగ్ డార్మ్‌స్టెడ్టర్ ప్రైజ్
👉1974 ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో నోబెల్ బహుమతి

Albert Claude (24 August 1899 – 22 May 1983) was a Belgian-American medical doctor and cell biologist and a Nobel laureate.

In 1929 he found an opportunity to join the Rockefeller Institute in New York. At Rockefeller University he made his most groundbreaking achievements in cell biology.

In 1930 he developed the technique of cell fractionation, by which he discovered the agent of the Rous sarcoma, components of cell organelles such as mitochondrion, chloroplast, endoplasmic reticulum, Golgi apparatus, ribosome and lysosome. He was the first to employ the electron microscope in the field of biology. In 1945 he published the first detailed structure of cell. His collective works established the complex functional and structural properties of cells.

Albert Claude also developed methods for separating the various parts of pulverized cells with a centrifuge so they could be better studied.This became a breakthrough for cell biology.

🚁Nobel prize

The Nobel Prize in Physiology or Medicine 1974 was awarded jointly to Albert Claude, Christian de Duve and George E. Palade "for their discoveries concerning the structural and functional organization of the cell."

📡📸🔬ప్రముఖ భారతీయ అణు శాస్త్రవేత్త,పద్మ విభూషణ్ గ్రహీత హోమీ సేత్నా జయంతి సందర్భంగా...ఆగస్ట్24      డాక్టర్ హెచ్. ఎన్. సేత...
24/08/2026

📡📸🔬ప్రముఖ భారతీయ అణు శాస్త్రవేత్త,పద్మ విభూషణ్ గ్రహీత హోమీ సేత్నా జయంతి సందర్భంగా...ఆగస్ట్24

డాక్టర్ హెచ్. ఎన్. సేత్నా (Homi Nusserwanji Sethna) (ఆగష్టు 24, 1923 - సెప్టెంబర్ 5, 2010) సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు.న్యూక్లియర్ సైంటిస్టు; కెమికల్ ఇంజినీర్.

ఈయన 1923 ఆగష్టు 24 న బొంబాయి నగరంలో జన్మించారు. 1944 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్‌సి. చేశారు. తర్వాత మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.ఇ. చేశారు.

1974లో భారతదేశం తన తొలి అణు పరీక్షను రాజస్థాన్ పోఖ్రాన్ లో నిర్వహించినప్పుడు భారత అణుశక్తి సంఘానికి చైర్మన్ గా ఉన్నారు.భారత పౌర అణు కార్యక్రమానికి ఆద్యుడు.భారత దేశంలో అణుశక్తి కర్మాగారాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.

కేరళ ఆల్వాయిలో థోరియం సంగ్రహణ కేంద్ర నిర్మాణానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు.
ట్రాంబేలో ప్లూటోనియం కర్మాగార నిర్మాణానికి ప్రాజెక్టు మేనేజర్ గా వ్యవహరించారు.జాదూగూడాలోని యురేనియం కర్మాగారాన్ని కూడా ఈయన మార్గదర్శకత్వంలోనే నిర్మించారు.

🚁అవార్డులు

1959 : పద్మశ్రీ పురస్కారం
1960 : భట్నాగర్ పురస్కారం
1966 : పద్మభూషణ్ పురస్కారం
1975 : పద్మ విభూషణ్ పురస్కారం

🚀 జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ... ఆగస్ట్23        భారతదేశం అంతరిక్ష పరిశోధన రంగంలో సాధించిన చారిత్రాత్మక విజయాలను...
23/08/2026

🚀 జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ... ఆగస్ట్23

భారతదేశం అంతరిక్ష పరిశోధన రంగంలో సాధించిన చారిత్రాత్మక విజయాలను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని (National Space Day) నిర్వహిస్తున్నారు. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్–3 మిషన్‌లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం భారత అంతరిక్ష చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు.

చంద్రయాన్–3 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభ, సాంకేతిక సామర్థ్యం, పట్టుదల, స్వదేశీ పరిశోధనలకు గొప్ప నిదర్శనం. ఈ మిషన్‌లో విక్రమ్ ల్యాండర్‌తో పాటు ప్రజ్ఞాన్ రోవర్ చంద్ర ఉపరితలంపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించాయి. చంద్రుడి ఉపరితలంలోని ఉష్ణోగ్రత, ప్లాస్మా, మూలకాలు తదితర అంశాలపై సమాచారాన్ని సేకరించడం ద్వారా చంద్రుడి గురించి మన అవగాహనను మరింత విస్తరించాయి. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో విజయవంతంగా దిగిన తొలి దేశంగా భారత్ ప్రత్యేక చరిత్రను సృష్టించింది.

2026 జాతీయ అంతరిక్ష దినోత్సవం థీమ్ – “Towards Viksit Bharat – Innovating, Collaborating and Aspiring to Global Space Leadership”. అంటే “వికసిత్ భారత్ వైపు – ఆవిష్కరణలు, సహకారం మరియు ప్రపంచ అంతరిక్ష నాయకత్వం వైపు ఆకాంక్ష” అని అర్థం. ఈ థీమ్ భారతదేశం అంతరిక్ష రంగంలో భవిష్యత్తు లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం, స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడం, దేశీయ–అంతర్జాతీయ సంస్థలతో సహకరించడం, ప్రపంచ స్థాయి అంతరిక్ష శక్తిగా ఎదగడం దీని ప్రధాన లక్ష్యాలు.

అంతరిక్ష పరిశోధన అనేది కేవలం చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల అధ్యయనానికి మాత్రమే పరిమితం కాదు. ఉపగ్రహ సాంకేతికతలు వాతావరణ అంచనాలు, వ్యవసాయం, కమ్యూనికేషన్, నావిగేషన్, విపత్తుల నిర్వహణ, భూవనరుల పరిశీలన, మత్స్యరంగం, పర్యావరణ పరిరక్షణ, పట్టణ ప్రణాళిక వంటి అనేక రంగాల్లో ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతున్నాయి. అందువల్ల అంతరిక్ష విజ్ఞానం దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
భారతదేశం చంద్రయాన్–3తో పాటు ఆదిత్య-L1, XPoSat, SpaDeX, NISAR వంటి అనేక ముఖ్యమైన అంతరిక్ష కార్యక్రమాల ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపిస్తోంది. సూర్యుడి అధ్యయనం, ఎక్స్‌రే ఖగోళ పరిశోధనలు, అంతరిక్షంలో ఉపగ్రహాల docking సాంకేతికత, భూమి పరిశీలన వంటి విభిన్న రంగాల్లో భారత శాస్త్రవేత్తలు ముందడుగు వేస్తున్నారు. భవిష్యత్తులో మానవ అంతరిక్ష యాత్రలు, చంద్ర పరిశోధనలు, మరింత లోతైన అంతరిక్ష అన్వేషణ వంటి లక్ష్యాల వైపు భారత్ అడుగులు వేస్తోంది.

జాతీయ అంతరిక్ష దినోత్సవం విద్యార్థులు, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది. అంతరిక్షం పట్ల ఆసక్తి ఉన్న పిల్లలు భౌతిక శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి రంగాల్లో పరిశోధనలు చేయడానికి ఇది ప్రేరణనిస్తుంది. పాఠశాలలు, కళాశాలల్లో అంతరిక్ష విజ్ఞాన ప్రదర్శనలు, క్విజ్‌లు, మోడల్ తయారీ, ఉపన్యాసాలు, పరిశీలనా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో పరిశోధనా దృక్పథాన్ని పెంచవచ్చు.

అంతరిక్ష రంగంలో భారతదేశం సాధిస్తున్న విజయాలు “విజ్ఞానం దేశ అభివృద్ధికి ప్రధాన శక్తి” అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆవిష్కరణలు, శాస్త్రీయ ఆలోచన, సహకారం, స్వావలంబనతో ముందుకు సాగుతూ అంతరిక్ష సాంకేతికతను సమాజ సంక్షేమానికి ఉపయోగించడమే భవిష్యత్తు లక్ష్యంగా ఉండాలి. అందుకే జాతీయ అంతరిక్ష దినోత్సవం ఒక విజయాన్ని స్మరించుకునే రోజు మాత్రమే కాకుండా, విజ్ఞాన ఆధారిత, స్వావలంబనతో కూడిన, ప్రపంచ స్థాయి “వికసిత్ భారత్” నిర్మాణానికి సంకల్పం తీసుకునే రోజు కూడా. 🚀🇮🇳

🌌🗺️🧑‍🔬ఈరోజు నోబెల్ గ్రహీత C.V. రామన్ వద్ద పనిచేసిన ప్రముఖ భారతీయ మహిళా భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త, కె. ఆర్...
23/08/2026

🌌🗺️🧑‍🔬ఈరోజు నోబెల్ గ్రహీత C.V. రామన్ వద్ద పనిచేసిన ప్రముఖ భారతీయ మహిళా భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త, కె. ఆర్. రామనాధన్ మెమోరియల్ మెడల్ గ్రహీత అన్నా మణి జయంతి సందర్భంగా... ఆగస్ట్23

అన్నా మణి ( Anna Modayil Mani ) ( 23 ఆగస్టు 1918 - 16 ఆగస్టు 2001 ) ప్రముఖ భారతీయ మహిళా భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. ఈమె భారత వాతావరణ శాఖ, పూణెలో డిప్యూటీ డైరక్టర్ జనరల్ ( 1953-76) గా పనిచేశారు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఎమెరిటస్ ప్రొఫెసరుగా పనిచేశారు. ఈమె వాతావరణ పరికరాలపై విశేష కృషిచేశారు. ఈమె సౌరశక్తి, పవన శక్తి కొలతలు మరియు ఓజోన్ పొరపై అనేక పరిశోధనలు నిర్వహించి అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

🌐జీవితం, విద్య

అన్నా మణి కేరళ, ట్రావెన్కోర్ లో గల పీరుమేడులో జన్మించారు. ఆమె తండ్రి ఒక సివిల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఆయన అజ్ఞేయవాది. ఈమె తన కుటుంబంలో గల ఎనిమిది మంది సహోదరీ సహోదరులలో ఏడవవారు. ఆమె బాల్యంలో జ్ఞాన తృష్ణ కలిగి ఉండేవారు. పుస్తకాలు బాగా చదివేవారు. "వైకోం సత్యాగ్రహం" నిర్వహించే సమయంలో మహాత్మా గాంధీ చేపట్టిన కార్యక్రమాలు ఆమెను ఆకట్టుకున్నాయి. జాతీయోద్యమంలో గాంధీజీచే ప్రభావితురాలయ్యారు. ఫలితంగా ఆమె ఖాదీ దుస్తులు ధరించారు.

మణి కుటుంబం అప్పర్ క్లాస్ కుటుంబం. పురుషులకే ఉన్నత స్థాయి ఉద్యోగాలు, చదువులు‌ అని భావించే వారు. అయినా ఆమె చదువుపై శ్రద్ధ పెట్టింది. ఆమె ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చే సరికి తమ ఇంటి లైబ్రరీలో ఉన్న అన్ని మళయాళ పుస్తకాలు చదివేశారు. పన్నిండేళ్ల కల్లా అన్ని ఇంగ్లీషు పుస్తకాలు పూర్తి చేశారు. ఆమె తన ఎనిమిదవ పుట్టినరోజున డైమండ్ చెవి దుద్దులు బదులు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా సెట్ ను కోరుకున్నారు.

ఆమె నృత్యం చేపట్టాలని కోరుకున్నారు. కానీ ఆమె భౌతిక శాస్త్రంపై గల మక్కువతో ఆ రంగంలో ఉండటానికి యిష్టపడ్డారు. 1939 లో ఆమె మద్రాసులో గల ప్రెసిడెన్సీ కాలేజీలో పట్టభద్రురాలయ్యారు. ఈమె బి.యస్సీ. ఆనర్స్ డిగ్రీని భౌతిక మరియు రసాయన శాస్త్రాలలో పొందారు. భౌతిక శాస్త్రంలో అధ్యయనం చేయటానికి, పరిశోధనలు నిర్వహించటానికి1940 లో బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆమెకు స్కాలర్ షిప్ ఇచ్చింది.

🌐పరిశోధనలు, సహకారాలు

అన్నా మణి పట్టభద్రురాలైన తర్వాత ఆమె సి.వి.రామన్ వద్ద రీసెర్చ్ స్కాలర్ గా పనిచేశారు. ఇచట రుబీ మరియు వజ్రం యొక్క దృశా ధర్మాలను పరిశోధించారు. ప్రయోగశాలలో ఆమె రోజుకు 20 గంటల పాటు పని చేసేవారు.‌ ఆమె రుబీలు, వజ్రాల స్పెక్ట్రోస్కోపీపై ఐదు పరిశోధనా పత్రాలను రచించారు. కానీ ఈమె భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయని కారణంగా పిహెచ్.డిని పొందలేకపోయారు. 1945 లో ఆమె భౌతిక శాస్త్రం అధ్యయనం చేయుటకు బ్రిటన్ వెళ్ళారు. కానీ దానిని ఆపివేసి లండన్ నందుగల ఇంపీరియల్ కాలేజిలో వాతావరణ రంగానికి చెందిన పరికరాలపై పరిశోధనలు కొనసాగించారు.

భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మన దేశం అత్యంత సరళమైన శాస్త్రీయ పరికరాల కోసం కూడా ఇతర దేశాలపై ఆధారపడింది. 1948లో అన్నా మణి భారతదేశానికి వచ్చిన తర్వాత పూనేలో గల వాతావరణ శాఖలో ఎస్. పి. వెంకిటేశ్వరన్ నేతృత్వంలోని ఇన్స్ట్రుమెంట్స్ డివిజన్ లో చేరారు. ఆమె వాతావరణ రంగంలో వివిధ పరికరాలపై విశేషమైన పరిశోధనలు చేసి పలు పత్రాలను ప్రచురించారు. బ్రిటన్ నుండి వాతావరణ పరికరాల దిగుమతికి కృషి చేశారు. ఆమె డివిజన్ కు హెడ్ గా ఉన్నప్పుడు ఆమె క్రింద 121 మంది పురుషులు పనిచేసేవారు. ఆమె భారతదేశం వాతావరణ పరికరాల తయారీలో స్వయంసంవృద్ధి సాధించాలని కోరుకొనే వారు. ఆమె సుమారు 100 వాతావరణ పరికరాలను ప్రామాణీకరించారు. ఆ సమయంలో భారత దేశంలో అన్వేషింపబడని రెండు రంగాలను ఆమె చేపట్టారు. అవి సౌరశక్తి మరియు పవనశక్తి. 1957-58 ప్రాంతంలో సోలార్ రేడియేషన్ ను కొలవడానికి ఎన్నో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓజోన్ (ozone) ను కొలవడానికి ఒక పరికరం ఓజోన్ సోండ్ ( ozonesonde ) ను అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ఆమె ఇంటర్నేషనల్ ఓజోన్ అసోసియేషన్ సభ్యురాలు. గాలి వేగాన్ని, సోలార్ ఎనర్జీని కొలవడానికి పరికరాలను తయారు చేసే వర్క్ షాప్ ను ఏర్పాటు చేశారు. తుంబా రాకెట్ కేంద్రం వద్ద వాతావరణ పరిశోధనశాలను, ఇన్స్ట్రుమెంటేషన్ టవర్ ను ఏర్పాటు చేశారు.

ఆమె పదవీ విరమణ తర్వాత రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో సైంటిస్ట్ ఎమెరిటస్ గా పనిచేశారు. రేడియేషన్, ఓజోన్ మరియు అట్మాస్పియరిక్ ఎలక్ట్రిసిటీలలో పరిశోధనలు చేశారు. ఆమె భారత దేశపు వాతావరణ సంబంధిత డేటాను సేకరించి దానిని విశ్లేషించారు. 1960 లలో ఆమె ఓజోన్ ను, దాని ధర్మాలను అధ్యయనం చేశారు.

ఆమె ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, అమెరికన్ మీటియరలాజికల్ సొసైటీ, ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ సొసైటీ, వరల్డ్ మీటియరలాజికల్ ఆర్గనైజేషన్ (WMO), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మీటియోరోలజీ అండ్ అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ వంటి అనేక శాస్త్రీయ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆమె అమెరికన్ మీటియరలాజికల్ సొసైటీ మరియు రాయల్ మీటియరలాజికల్ సొసైటీ సభ్యురాలు.

ఆమె 1969లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఢిల్లీకి బదిలీ అయ్యారు. 1975లో ఆమె ఈజిప్టులో WMO కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆమె 1976 లో భారత వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. అదే సంవత్సరంలో ఆమె రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు వద్ద మిల్లీమీటర్ వేవ్ టెలిస్కోపు ఏర్పాటు చేయడంలో సహాయపడ్డారు. ఆమె 1980లో The Handbook for Solar Radiation Data for India మరియు 1981లో Solar Radiation over India అనే పుస్తకాలను రచించారు. వాటిని సౌర మరియు థర్మల్ వ్యవస్థలపై ప్రామాణిక రిఫరెన్స్ పుస్తకాలుగా పరిగణిస్తారు. ఎంతసేపూ విజ్ఞానరంగానికి ఏదన్నా చేయాలనే తలంపుతో మణి అవివాహితగానే మిగిలిపోయారు.

వాతావరణ శాస్త్రంలో అన్నా మణి యొక్క కృషి నేటి సమాజంపై ప్రభావవం చూపింది. ఆమె సహకారాలు సౌరశక్తి, పవన శక్తి, ఓజోన్ పొరలు మరియు వివిధ వాతావరణ సాధనాల అన్వేషణకు విస్తరించాయి. నిజానికి, మణి యొక్క దార్శనికత మరియు పని భారతదేశం నేడు పవన శక్తిని ఉపయోగించడంలో ప్రపంచ అగ్రగామిగా మారింది. ఆమె వాతావరణ శాస్త్ర ఆవిష్కరణలు భారతదేశ వైజ్ఞానిక రంగాన్ని అలాగే స్వాతంత్య్రానంతరం దేశ అభివృద్ధిని విస్తరించాయి. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, అన్నా మణి చాలా మంది యువతులకు వారి గుర్తింపులపై సామాజిక పరిమితులు ఉన్నప్పటికీ వారి కలను కొనసాగించడానికి ఒక ప్రేరణ. మణి పురుషాధిక్య రంగంలో స్థానం సంపాదించడమే కాదు, తనతో కలిసి పనిచేసేందుకు పురుషుల బృందాన్ని కూడా ప్రేరేపించగలిగింది. ఇది చాలా మంది భవిష్యత్ మహిళా శాస్త్రవేత్తలకు మార్గం సుగమం చేసింది. స్త్రీలు సంరక్షించే పాత్ర కంటే ఎక్కువగా ఉండగలరని ప్రపంచానికి చూపించింది. అన్నా మణి ఒకసారి చెప్పినట్లుగా, "[నేను] ఒక స్త్రీ అయినందున నేను నా జీవితంలో ఎంచుకున్నదానిపై ఎటువంటి ప్రభావం లేదు."

1994లో మణి స్ట్రోక్‌తో బాధపడ్డారు. ఆమె 83వ పుట్టినరోజుకు ఒక వారం ముందు తిరువనంతపురంలో 16 ఆగస్టు 2001న మరణించారు. ప్రపంచ వాతావరణ సంస్థ అన్నా మణి 100వ జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంది మరియు అన్నా ఇంటర్వ్యూతో పాటు ఆమె జీవిత ప్రొఫైల్‌ను ప్రచురించింది. అన్నా మణి కె.ఆర్. రామనాథన్ మెడల్ ను 1987లో పొందారు. 23 ఆగస్టు 2022న‌ Google అన్నామణిని ఆమె 104 వ జన్మదినోత్సవం సందర్భంగా Google Doodle తో సత్కరించింది .

Source: వికీపీడియా

🏵️📚🔭విశిష్ట లక్షణాలున్న కార్బన్ రూపాంతరం  గ్రాఫీన్ (Graphene)ను కనుగొన్న భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత, అజ్ఞేయవాది K...
23/08/2026

🏵️📚🔭విశిష్ట లక్షణాలున్న కార్బన్ రూపాంతరం గ్రాఫీన్ (Graphene)ను కనుగొన్న భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత, అజ్ఞేయవాది Konstantin Novoselov పుట్టినరోజు సందర్భంగా... ఆగస్ట్23

కాన్స్టాంటిన్ నోవోసెలోవ్ ( Sir Konstantin Sergeevich Novoselov FRS FInstP FRSC )( జననం 23‌ ఆగస్టు,1974 ) ఒక రష్యన్ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త. కార్బన్ రూపాంతరం గ్రాఫీన్‌ను కనుగొన్నందుకు ఆయనకు 2010 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

ఏదేని ఒక మూలకం రెండు కన్నా ఎక్కువ భౌతికరూపాలలో లభిస్తూ, రసాయనక ధర్మాలలో దాదాపు సారూప్యతను కలిగి ఉండి భౌతిక ధర్మాలలో విభేదించే ధర్మాన్ని రూపాంతరత ( allotropy ) అని అంటారు. ఒక మూలకం యొక్క విభిన్న రూపాలను రూపాంతరాలు ( allotropes ) అని అంటారు. అవి వాటి పరమాణువుల అమరికల తేడాల వలన ఏర్పడతాయి. గ్రాఫీన్ ( Graphene ) కర్బన రూపాంతరాలలో ఒకటి. గ్రాఫీన్ అనేది ఏక పొర పరమాణువులను కలిగిన రెండు డైమెన్షన్ల నానో నిర్మాణం.

2004 లో ఆండ్రీ గేమ్ ( Andre Geim ) మరియు నోవోసెలోవ్ సాధారణ పెన్సిల్స్‌లో కనిపించే గ్రాఫైట్ ముక్క నుండి గ్రాఫీన్‌ను సేకరించారు. సాధారణ అంటుకునే టేప్‌ ( adhesive tape )ను ఉపయోగించి వారు కేవలం ఒక అణువు యొక్క మందంతో కార్బన్ ఫ్లేక్‌ను పొందగలిగారు. వారు గ్రాఫీన్ ధర్మాలను మ్యాప్ చేశారు. గ్రాఫీన్ నందు 0.3 నానో మీటర్ల మందం కలిగిన తేనె తొట్టెను పోలిన షణ్ముఖియ ( hexagonal ) నిర్మాణం అంతటా కార్బన్ పరమాణువులు విస్తరించి ఉంటాయి.

గ్రాఫిన్ రాగి కన్నా మంచి విద్యుత్ వాహకం, ఉష్ణ వాహకం. స్టీలు కన్నా 200 రెట్లు బలమైనది కానీ ఆరు రెట్లు తేలికైనది. అలాగే కాంతికి దాదాపు సంపూర్ణంగా పారదర్శకమైనది కానీ అధిక సాంద్రత కలిగినది. ఇది మెటీరియల్స్ రంగం లోను, ఎలక్ట్రానిక్స్ రంగం లోను అనేక అనువర్తనాలు కలిగి ఉంది. ఇది ఆచరణాత్మకంగా పారదర్శకం మరియు మంచి వాహకం కాబట్టి, ఇది పారదర్శక టచ్ స్క్రీన్‌లు, లైట్ ప్యానెల్‌లు మరియు సౌర ఘటాలను కూడా ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

నోవోసెలోవ్ పలు అంశాలపై 376 పీర్-రివ్యూడ్ రీసెర్చ్ పేపర్‌లను ప్రచురించారు. అందులో మెసోస్కోపిక్ సూపర్ కండక్టివిటీ ( హాల్ మాగ్నెటోమెట్రీ ), మాగ్నెటిక్ డొమైన్ వాల్స్ యొక్క సబ్‌టామిక్ కదలికలు, గెక్కో టేప్ యొక్క ఆవిష్కరణ మరియు గ్రాఫీన్.

🏆అవార్డులు,గౌరవాలు

👉నికోలస్ కుర్తి ప్రైజ్ (2007)
👉TR35 (2008)
👉యూరో ఫిజిక్స్ ప్రైజ్ (2008)
👉IUPAP ప్రైజ్ (2008)
👉భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (2010)
👉నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నెదర్లాండ్స్ లయన్ (2010)
👉FRS (2011)
👉నైట్ బ్యాచిలర్ (2012)
👉లెవర్‌హుల్మే మెడల్ (2013)
👉ఆన్సేగర్ మెడల్ (2014)
👉కార్బన్ మెడల్ (2016)
👉డాల్టన్ మెడల్ (2016)
👉HonFRSC
👉HonFinstP
👉నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడు (20

Sir Konstantin Sergeevich Novoselov FRS FRSC FInstP (born 23 August 1974) is a Russian-British physicist, and a Professor at the Centre for Advanced 2D Materials, National University of Singapore. He is also the Langworthy Professor in the School of Physics and Astronomy at the University of Manchester. His work on graphene earned him the Nobel Prize in Physics in 2010.

Novoselov has published 336 peer-reviewed research papers on several topics including mesoscopic superconductivity (Hall magnetometry) as of June 22, 2018, subatomic movements of magnetic domain walls, the discovery of gecko tape and graphene.

Novoselov is an agnostic.

🏵️Nobel prize

The Nobel Prize in Physics 2010 was awarded jointly to Andre Geim and Konstantin Novoselov "for groundbreaking experiments regarding the two-dimensional material graphene."

🔭🏵️📚కార్బన్ రూపాంతరం బక్ మిన్స్టర్ ఫుల్లరిన్ (Buckministerfullerine)ను కనుగొన్న రసాయన శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత Robert...
23/08/2026

🔭🏵️📚కార్బన్ రూపాంతరం బక్ మిన్స్టర్ ఫుల్లరిన్ (Buckministerfullerine)ను కనుగొన్న రసాయన శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత Robert Curl పుట్టినరోజు సందర్భంగా... ఆగస్ట్23

రాబర్ట్ ఫ్లాయిడ్ కర్ల్ జూనియర్ ( Robert Floyd Curl Jr.) ( 23 ఆగస్టు 1933 - 3‌ జూలై 2022 ) ఒక అమెరికన్ రసాయన శాస్త్రవేత్త. రిచర్డ్ ఎరెట్ స్మాలీ మరియు హెరాల్డ్ క్రోటోతో కార్బన్ యొక్క కొత్త రూపాంతరం బక్‌మిన్‌స్టర్‌ఫుల్లరిన్‌ ( Buckminsterfullerine ) / ఫుల్లరిన్ లను కనుగొన్నందుకు 1996 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. బక్‌మిన్‌స్టర్‌ఫుల్లరిన్‌ లను బకీబాల్‌లు ( buckyballs) అని కూడా పిలుస్తారు.

కార్బన్ మూలకం ప్రకృతిలో వివిధ రూపాలలో లభిస్తుంది. వాటిని కార్బన్ రూపాంతరాలు ( allotropes) అంటారు. ఉదాహరణకు గ్రాఫైట్, వజ్రం. ఫుల్లరిన్ కూడా కార్బన్ రూపాంతరమే.

1985 లో రిచర్డ్ స్మాలీ, రాబర్ట్ కర్ల్, హెరాల్డ్ క్రోటోలు ఒక గ్రాఫైట్ ఉపరితలాన్ని లేజర్ పల్సెస్ తో ఉద్యోతితం ( irradiated) చేసి కార్బన్ వాయువును తయారు చేశారు. జడ వాయువు వాతావరణంలో కార్బన్ వాయువును సాంద్రీకరించారు. అప్పుడు కొన్ని కార్బన్ పరమాణువుల గుత్తులు ఏర్పడటం గమనించారు. వాటిని మాస్ స్పెక్ట్రోస్కోపీతో విశ్లేషించగా 60 లేదా 70 కార్బన్ పరమాణువుల గుత్తులను గమనించారు. అవి ఐదు, ఆరు అంచులతో ఏర్పడిన గోళాకార నిర్మాణాలు. వాటికి నిర్మాణ శిల్పి బక్ మిన్స్టర్ ఫుల్లరిన్ జియోడెసిక్ నిర్మాణాల ఆకారం పోలి ఉండడంతో వాటికి Buckminsterfullerines / fullerines అని పేరు పెట్టారు.

కర్ల్ యొక్క తదుపరి పరిశోధన ఆసక్తులు భౌతిక రసాయన శాస్త్రం , DNA జీనోటైపింగ్ మరియు సీక్వెన్సింగ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను అభివృద్ధి చేయడం మరియు క్వాంటం క్యాస్కేడ్ లేజర్‌లను ఉపయోగించి ట్రేస్ వాయువుల కోసం ఫోటోఎకౌస్టిక్ సెన్సార్‌లను సృష్టించడం వంటివి కలిగి ఉన్నాయి.

🏆అవార్డులు

👉క్లేటన్ ప్రైజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, 1957
👉అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ సీనియర్ US సైంటిస్ట్ అవార్డు, యూనివర్శిటీ ఆఫ్ బాన్, జర్మనీ, 1984
👉అమెరికన్ అకాడమీ ఆఫ్ అచీవ్‌మెంట్ యొక్క గోల్డెన్ ప్లేట్ అవార్డు , 1997
👉న్యూ మెటీరియల్స్ కోసం అంతర్జాతీయ బహుమతి , అమెరికన్ ఫిజికల్ సొసైటీ, 1992
👉రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి , రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ , 1996
👉స్పెక్ట్రోస్కోపీలో జోహన్నెస్ మార్కస్ మార్సి అవార్డు, 1998
👉సెంటెనరీ మెడల్, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ, 1999
👉యూనివర్శిటీ ఆఫ్ బోచుమ్ రీసెర్చ్ ప్రైజ్, 2004
👉నేషనల్ హిస్టారిక్ కెమికల్ ల్యాండ్‌మార్క్ , అమెరికన్ కెమికల్ సొసైటీ, 2010
👉సైటేషన్ ఫర్ కెమికల్ బ్రేక్‌త్రూ అవార్డు, డివిజన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ కెమిస్ట్రీ, అమెరికన్ కెమికల్ సొసైటీ, 2015

Robert Floyd Curl Jr. (born August 23, 1933) is a University Professor Emeritus, Pitzer–Schlumberger Professor of Natural Sciences Emeritus, and Professor of Chemistry Emeritus at Rice University. He was awarded the Nobel Prize in Chemistry in 1996 for the discovery of the nanomaterial buckminsterfullerene.

(Buckminsterfullerene is a type of fullerene with the formula C60. It has a cage-like fused-ring structure (truncated icosahedron) that resembles a soccer ball, made of twenty hexagons and twelve pentagons. Each carbon atom has three bonds.)

🔭Nobel prize

The Royal Swedish Academy of Sciences awarded the 1996 Nobel Prize in Chemistry jointly to Professor Robert F. Curl, Harold W. Kroto and Richard E. Smalley for their discovery of fullerenes.

🌐🛞☀️ఈరోజు మన దేశ నోబెల్ గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ తో నోబెల్ బహుమతి పంచుకొన్న శాస్త్రవేత్త, జీవ కణాలలో ప్రొటీన్ల సంశ్...
23/08/2026

🌐🛞☀️ఈరోజు మన దేశ నోబెల్ గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ తో నోబెల్ బహుమతి పంచుకొన్న శాస్త్రవేత్త, జీవ కణాలలో ప్రొటీన్ల సంశ్లేషణలో పాల్గొనే రైబోసోమ్ ( Ribosome ) నిర్మాణం, విధులపై కృషి చేసిన ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త, సర్ హాన్స్ క్రెబ్స్ మెడల్ గ్రహీత థామస్ ఆర్థర్ స్టైట్స్ జయంతి సందర్భంగా... ఆగస్ట్23

థామస్ ఆర్థర్ స్టైట్స్ ( Thomas Arthur Steitz ) ( 23 ఆగస్టు 1940 - 9 అక్టోబరు 2018 ) ప్రముఖ అమెరికన్ బయోకెమిస్ట్, బయో ఫిజిసిస్ట్. ఆయన జీవకణం లోని రైబోసోమ్ ( Ribosome ) అనే కణాంగ నిర్మాణం, దాని విధులు గురించి పరిశోధనలు చేశారు. 2009 సంవత్సరానికి గాను ఆయన రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతిని భారతీయ జీవ శాస్త్రవేత్త వెంకటరామన్ రామకృష్ణన్, ఇజ్రేలీ మహిళా శాస్త్రవేత్త ఆడా యోనాత్ తో కలిసి అందుకున్నారు.

ఒక జీవి యొక్క ముఖ్యమైన జీవ సంబంధమైన విధులను సంక్లిష్ట ప్రొటీన్ అణువులు నిర్వహిస్తాయి. ఈ ప్రొటీన్లు జీవ కణంలోని రైబోసోములలో ఉత్పత్తి అవుతాయి. రైబోసోముల పనితీరును గురించిన అవగాహన జీవం యొక్క శాస్త్రీయ అవగాహనకు దారి తీస్తుంది.

అడా యోనాత్, వెంకట్రామన్ రామకృష్ణన్, థామస్ ఆర్థర్ స్టైట్స్ లు పరమాణు స్థాయిలో రైబోసోమ్ నిర్మాణం, దాని విధులు గురించి పరిశోధనలు చేశారు. వారు ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీని ఉపయోగించి రైబోసోమ్ లోని లక్షలాది పరమాణువులను మ్యాప్ చేశారు.

ప్రతి జీవకణంలో డి ఎన్ ఎ అణువులు ఉంటాయి. ఒక జీవి ఎలా ఉంటుందో, అది ఏ విధంగా పనిచేస్తుందో తెలిపే బ్లూ ప్రింట్ ను ఇవి కలిగి ఉంటాయి. డి ఎన్ ఎ లోని జన్యు స్మృతిలో రాయబడిన సూచనల ఆధారంగా రైబోసోములు అనేక ప్రొటీన్లను తయారు చేస్తాయి. రైబోసోములలో మెసెంజర్ ఆర్ ఎన్ ఎ నుండి జన్యు సమాచారం అమైనో ఆమ్లాల గొలుసులుగా అనువదించబడుతుంది. అవి ప్రొటీన్లను నిర్మిస్తాయి. అంటే ప్రొటీన్ సంశ్లేషణ ( protein biosynthesis) చేస్తాయి. ప్రొటీన్లు జీవి నిర్మాణంలో బిల్డింగ్ బ్లాక్స్ అయితే, వాటిని తయారుచేసే కర్మాగారాలే రైబోసోములు. ఒక్కో రకం ప్రొటీన్ ఒక్కో విధిని నిర్వర్తిస్తాయి. ప్రొటీన్లకు కొన్ని ఉదాహరణలు: హెమోగ్లోబిన్ అణువులు, యాంటీ బాడీలు, చర్మపు కొల్లాజెన్, ఎంజైములు. ఈ వేలాది ప్రొటీన్లు జీవిని నిర్మించి, జీవాన్ని రసాయనిక స్థాయిలో నియంత్రిస్తాయి.

స్టైట్స్ మరియు పీటర్ మూర్ X-రే క్రిస్టలోగ్రఫీని ఉపయోగించి పెద్ద 50S రైబోసోమల్ సబ్‌యూనిట్ యొక్క పరమాణు నిర్మాణాన్ని నిర్ణయించారు.

యోనాత్, రామకృష్ణన్, స్టైట్స్ లు రైబోసోములు, యాంటీ బయోటిక్స్ మధ్య గల ఇంటరాక్షన్ లను అధ్యయనం చేశారు. తద్వారా కొత్త యాంటీబయాటిక్స్ యొక్క డ్రగ్ డిజైన్ల నిర్మాణానికి సహాయపడ్డారు.

స్టైట్స్ జన్యు వ్యక్తీకరణ ప్రక్రియ లక్షణాలు, డిఎన్ఏ రెప్లికేషన్, జెనెటిక్ రీకాంబినేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, మొదలైన అంశాల అధ్యయనానికి ఎక్సరే క్రిస్టలోగ్రఫీని ఉపయోగించారు.
స్టైట్స్ కొత్త యాంటీ బయోటిక్స్ ఆవిష్కరణకు, తయారీకి రిబ్-ఎక్స్ ఫార్మాస్యూటికల్స్ ( ఇప్పుడు మెలింటా థెరప్యూటిక్స్) ను సహస్థాపించారు.

👉రైబోజోములు / రైబోసోములు అంటే:

రైబోజోములు అనేవి సెల్యులార్ యంత్రాలు. ఇవి రైబోసోమల్ RNA (rRNA) మరియు ప్రోటీన్లతో కూడి ఉంటాయి. ఇవి ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటాయి. అవి మెసెంజర్ RNA (mRNA) పై జన్యు సంకేతాన్ని చదవడం ద్వారా అమైనో ఆమ్లాలను ఒక నిర్దిష్ట క్రమంలో అనుసంధానించి పాలీపెప్టైడ్ గొలుసులను ఏర్పరుస్తాయి. తరువాత ఆ గొలుసులు మడవబడి ప్రోటీన్లుగా మారతాయి. రైబోజోములు అన్ని జీవ కణాలలో కనిపిస్తాయి. అవి సైటోప్లాజంలో స్వేచ్ఛగా ఉండవచ్చు లేదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంతో జతచేయబడి ఉండవచ్చు.

🏆అవార్డులు, గౌరవాలు

👉సర్ హాన్స్ క్రెబ్స్ మెడల్ (2000)
👉రోజెన్స్టియల్ అవార్డు (2001)
👉కీయో మెడికల్ సైన్స్ ప్రైజ్ (2006)
👉గైర్డ్నర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డు (2007)
👉రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి (2009)
👉ForMemRS (2011)

🏆Nobel prize

The Nobel Prize in Chemistry 2009 was awarded jointly to Venkatraman Ramakrishnan, Thomas A. Steitz and Ada E. Yonath "for studies of the structure and function of the ribosome."

Source: Wikipedia, Nobel Prize Organization, other websites

Address

3rd Floor, Balotsav Bhavan, Aakulavari Street, Governorpet
Vijayavada
520002

Alerts

Be the first to know and let us send you an email when Jana Vignana Vedika - AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jana Vignana Vedika - AP:

Shortcuts

Share