03/12/2025
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకుల డిమాండ్.
కర్నూలు, 03 డిసెంబర్ 2025:
త్వరలో జరగబోయే *ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని* కర్నూలు బిర్లా కాంపౌండ్లోని సాయి వసంత్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన *రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు డిమాండ్* చేశారు.
ఈ సమావేశాన్ని *బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ బాబు* ఆధ్వర్యంలో నిర్వహించగా, *బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య* అధ్యక్షత వహించారు.
సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు:
యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అయ్యన్న యాదవ్, బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ధనుంజయ ఆచారి, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు సింధూ నాగేశ్వరరావు, మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రిక, సీనియర్ మహిళా నాయకురాలు నాగేశ్వరి నాయుడు, బీసీ సంఘాల JAC ఛైర్మన్ టీజీ శ్రీనివాసులు, బీసీ యువ నాయకులు శ్రీరామ్ యాదవ్, వెంకటేశ్వర్లు, రవి, రాము యాదవ్, భరత్ భూషణ్, లక్ష్మన్న, ప్రియాంక యాదవ్, రాము, సవారన్న తదితరులు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “జనాభాలో సగం భాగం ఉన్న బీసీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 50% రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం తక్షణం స్పష్టతనివ్వాలి. శాస్త్రీయ పద్ధతిలో కుల గణన నిర్వహించి బీసీల నిజమైన జనాభా సంఖ్యను ప్రకటించాలి. వివిధ బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన బడ్జెట్ కేటాయించాలి. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. బీసీ విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.” అని వారు పేర్కొన్నారు.
అలాగే, బీసీల హక్కుల కోసం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం దశలవారీగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
- ఆనంద్ బాబు
అధ్యక్షులు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్