AIDWA AP

AIDWA AP Mahilapi himsanu prathighattiddam.ఇంటి పని ఇద్దరదని చాటుదాం

Permanently closed.
20/05/2026
కర్మాగారాల లో తయారయ్యే రోబోట్లు మనుషుల సహకారం లేకుండా పని చేయలేవు. అందుకే పిల్లలను కనాలి. వారి కుటుంబాల లో మాత్రమే ఒక్క ...
16/05/2026

కర్మాగారాల లో తయారయ్యే రోబోట్లు మనుషుల సహకారం లేకుండా పని చేయలేవు. అందుకే పిల్లలను కనాలి. వారి కుటుంబాల లో మాత్రమే ఒక్క బిడ్డనే కంటారు. మంది మాత్రం కనాలి. కష్టపడి పెంచాలి పనీపాటలు చేయడానికి సిద్దంచేయాలి.

16/05/2026

ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సీఎం చందబ్రాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి:ఐద్వా

కొలనుకొండ: “పిల్లలు భారమేమీ కాదు... సంపద” అంటూ ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహించేలా ఈ రోజు శ్రీకాకుళం(డి) నరసన్నపేటలో సీఎం చందబ్రాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది. సీఎం వ్యాఖ్యలపై ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.సావిత్రి, కె.శ్రీదేవి ఒక ప్రకటన విడుదల చేశారు.
పిల్లలను కనండి.. ఇప్పుడు అవసరం మనకి.. ఇది చంద్రబాబు కొత్త స్లోగన్. ఒకప్పుడు కుటుంబ నియంత్రణపై నేనే చేశా.. ఇప్పుడు ఇది చేద్దాం అని చెప్పటమే కాదు.. మÖడో బిడ్డపుడితే 30 వేలు, నాలుగో బిడ్డపుడితే 40వేలు ఎంకరేజ్‌మెంట్ పేమెంట్ అని కూడా ప్రకటించారు. ఈ మహానుభావుడు ఒకసారి డబ్బులు ఇస్తాడని కనేస్తే.. తర్వాత పెంచేదెవరు.. పోషించేదెవరు? ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఎప్పుడైతే ఆర్ధిక భారాలు పెరిగాయో.. అసలు కుటుంబ పోషణ అనేది పెద్ద టాస్క్ అయిపోయిందో.. అప్పటి నుంచి ప్రజలే స్వచ్ఛందŠంగా కుటుంబ నియంత్రణను ఫాలో అవడం మొదలెట్టారు. అలా నిర్ణయం తీసుకోకుండా ఎలా ఉంటారు. పిల్లలు పుట్టారంటే వారి పోషణ ఒక ఎత్తు అయితే వారికి చదువు చెప్పించడం.. మంచి బట్టలు, పండగలు, ఫంక్షన్లు చేయడం చివరికి వారికి పెళ్లి చేయడం..ఇన్ని చేయాలి. ఒకసారి ప్రెగ్నెంట్ అని తెలియగానే ఆ దంపతులిద్దరికీ ఈ రీల్ అంతా ఒక్కసారిగా తిరిగేస్తుంది. బతుకు బండి లాగాలంటే ధైర్యం కావాలి.. డబ్బు కావాలి. అందుకే ఒక్కరు చాలు.. ఇద్దరు కూడా వద్దనుకుంటున్నారు. ఆఖరికి ఒకరు కాదు ఇద్దరు ఉండాలని సైకాలిజిస్టులు కూడా సలహాలు ఇచ్చినా ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.
ఈ విషయంలో మరో ముఖ్యమైన వాదన ముందుకొచ్చింది. కనే కష్టం తెలిస్తే అంత మందిని కనాలి ఇంతమంది ని కనాలి అంటారా అని. ఎంతమంది ని కనాలో కనవద్దో నిర్ణయించుకునే స్వేచ్చ కూడా లేదా ఆడవాళ్ళకు. ఇక పిల్లలు పుట్టాక ఆడవాళ్లకే పెంపకం బాద్యత కూడా. పిల్లలను కనడంలో వారి ఆరోగ్యాలు కూడా ఎఫెక్టు అవుతాయి. వారి కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. అయినా మాతృత్వ కర్తవ్యంగా పిల్లలను కనక తప్పదని కంటున్నారు. కాని పిల్లలను పెంచడంలో భర్తలు కేవలం డబ్బులిస్తే చాలనే దాకా వచ్చారు..పెంపకం భారం అంతా భార్యదే. దానికే ఆవేదన చెందుతుంటే.. నేడు భార్య కూడా సంపాదనపరురాలు అయి ఉద్యోగాలు చేస్తోంది. అయినా పిల్లల బాధ్యత మాత్రం భార్యదే.
అందుకే మÖడో బిడ్డ అనగానే ఆడవాళ్లంతా అడిగింది ఈ ప్రశ్నే. మరి మాతో పాటు మగవాళ్లు కూడా పెంపకంలో పాలు పంచుకోవాలి.. పిల్లలను చూసుకోవాలి అని అనటం మొదలెట్టారు. అసెంబ్లీలోనే కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఇదే ప్రశ్న లేవనెత్తారు. అయినా ఆర్ధిక స్తోమత పెంచకుండా.. వారిని బిడ్డలను కనమనటం కరెక్ట్ కాదని చెప్పేశారు. అలా అన్ని వర్గాల నుంచి దీనిపై వ్యతిరేకంగానే రెస్పాన్స్ వస్తుంది. మరి చంద్రబాబు దీనిపై ఎందుకిలా వాదిస్తున్నారు?
అన్ని వర్గాల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తుంది. మరి చంద్రబాబు దీనిపై ఎందుకిలా వాదిస్తున్నారు?
పనిచేసే వారు లేకపోతే వ్వవసాయం, పరిశ్రమలు, సేవలు ఏవి జరగవు. అందుకే ఇప్పుడు మానవ వనరుల గురించి అందరూ మాట్లాడవలసి వస్తుంది. కర్మాగారాల లో తయారయ్యే రోబోట్లు మనుషుల సహకారం లేకుండా పని చేయలేవు. అందుకే పిల్లలను కనాలి. వారి కుటుంబాల లో మాత్రమే ఒక్క బిడ్డనే కంటారు. మంది మాత్రం కనాలి. కష్టపడి పెంచాలి పనీపాటలు చేయడానికి సిద్దంచేయాలి. ఆరఎసఎస్ 4 గురిని కావాలంటున్నది కదూ. బాబుకి ఆరైఎసఎస్ కు జోడీ కుదిరినట్టుందికదా. ఆడవాళ్ళను పిల్లలను కనే యంత్రాలుగా చూసే ఫక్తు వ్వాపార సూత్రం ఇది.
అభినందనలతో,
కె.శ్రీదేవి వి.సావిత్రి
రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధానకార్యదర్శి

మార్చింగ్ ఇన్‌ది డార్క్సినిమా  సమీక్ష చీకటిలో ప్రయాణం (2024) దర్శకుడు:కిన్షుక్ సుర్జన్/105 ని.లు) - బాలాజీ భారతదేశంలో వ్...
15/05/2026

మార్చింగ్ ఇన్‌ది డార్క్

సినిమా సమీక్ష

చీకటిలో ప్రయాణం (2024) దర్శకుడు:కిన్షుక్ సుర్జన్/105 ని.లు)

- బాలాజీ

భారతదేశంలో వ్యవసాయం ప్రాణాంతకమైన వృత్తిగా మారింది. మహారాష్ట్రలో గత మÖడు దశాబ్దాల్లో 70వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2023లో రోజుకు ఏడుగురు చొప్పున మరణించారు. చనిపోయిన వారు పిరికివాళ్లుగా పలాయనమౌతారు. పేపర్లో వార్తగా, గణాంకాల్లో సంఖ్యగా, గోడపై పటంగా మిగిలిపోతారు. కానీ విషాదంతో, పిల్లలతో, అప్పులతో, సామాజిక వెలివేతలతో బతకాల్సిన వితంతువుల సంగతి ఏమిటి? వీరంతా జీవితకాలపు బ్రతుకుపోరు కోసం ధైర్యం ఎలా కూడదీసుకోవాలి? ఈ విషయాన్ని చర్చిస్తుంది ‘మార్చింగ్ ఇన్ ది డార్క’.
ప్రధాన కథానాయిక సంజీవని భూరే ఓ మహారాష్ట్ర గ్రామంలోని 33 ఏళ్ల వితంతువు. పంటల ధరలు పడిపోవడంతో అప్పుల బాధ భరించలేక ఆమె భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త నుండి అప్పుల్నే ఆస్తిగా పొందింది. ఇద్దరు చిన్న పిల్లలతో సంజీవని బావ గారి పొలంలో కూలిచేస్తూ, అదనపు సంపాదన కోసం క్లినిక్‌లో పనిచేస్తూ బతుకుపోరు సాగిస్తోంది. ఆమె మగాడిలా కష్టపడాలి. కానీ ఆర్థిక లావాదేవీల కోసం ఇతర మగాళ్లపై ఆధారపడాలి. పెళ్లిళ్లూ, పూజలూ వంటి సరదా కార్యక్రమాల్లోకి వితంతువులకు అనుమతిలేదు. సడెన్‌గా ఒక్కోసారి జీవితం కటిక చీకటిలో ఉన్నట్టనిపించి నీరసపడిపోతుంది సంజీవని. అటువంటి ఆమెకు సంజీవనీ మొక్కలా తారసపడింది ‘మనస్విని ఫౌండేషన’ అనే సహకార సంస్థ. సైకో థెరపీలా వితంతువులకు ఉపశమనం కల్పించడానికై ఈ సంస్థను ఒక సైకియాట్రిస్టు స్థాపించాడు. ఈ సంస్థ సంబంధంలోకి వచ్చిన వితంతువు లందరూ సామÖహిక చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. డాక్టరు ఎక్కువగా మాట్లాడడు. అవతలి వారినే మాట్లాడనిస్తాడు. కొన్ని చోట్ల కొంచెం మాట్లాడుతూ వారిని గైడ్ చేస్తాడు. తమలో గూడుకట్టుకున్న కోపాన్నంతా వారు ఆ సందర్భంలో వెళ్లగక్కుతారు. పితృస్వామ్య ద్వంద్వ ప్రమాణాల గురించి తిట్టుకుంటారు. తమ మగాళ్లు తాగొచ్చి కొట్టేవారనీ, ఇప్పుడు తమను వితంతువులను చేసి, పిల్లల బాధ్యతల్ని అప్పగించి మాయమయ్యారనీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. “ఏడుపు ఆపి పోరాటం సాగిద్దాం” అని ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటున్న తన తోటి బాధితురాలితో అంటుంది. “మనం మన కోసం జీవించాలి. ఆయన పోతే ఏమైంది? మనకు జీవితం ఒక్కసారే దొరుకుతుంది కదా?” అని మరొకామె అంటుంది. ఇలా తమ బాధల్ని పంచుకునే వారి మధ్య, ఒకరి కొకరు ధైర్యం చెప్పుకుంటూ రానున్న రోజుల బతుకుపోరు కోసం కావలసినంత శక్తిని పోగేసుకుంటారు వితంతువులు.
తమ చుట్టు పక్కల ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఈ సంస్థ తరుపు మహిళలు వెళ్లి భర్తను కోల్పోయిన ఆ స్త్రీకి ధైర్యం చెప్పి వస్తారు. వారిని కూడా తదుపరి కాలంలో తమ సెషన్స్‌లో చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. వీరిలో ఒకామె మళ్లీ పెళ్లి చేసుకుని ఇతరులు కూడా అలా చేయొచ్చని సూచిస్తుంది. అయితే అర్థం చేసుకునే మగాడు అందరికీ దొరకడం కష్టం. దొరికినా అందరు వితంతువులూ అందుకు సిద్ధపడడం అసాధ్యం. ఈ వితంతువులు తమ సంస్థ ఆఫీసులో అన్యధా తమకు నిషిద్ధమైన హోలీపండుగ జరుపుకుంటారు. ఈ సినిమాలో చూపిన సామÖహిక చర్చలు చాలా ఉద్వేగభరితంగా ఉంటాయి.
సోషలిస్టు భావాల రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ దర్శకుడు ఈ సినిమా కోసం కొన్ని సంవత్సరాల పాటు శ్రమించాడు. ఈ సినిమాకు జ్యూరిచ్ ఫెస్టివల్‌లో స్పెషల్ మెన్షన్ అవార్డు వచ్చింది. యÖరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది. అకాడెమీ అవార్డులో ఉత్తమ డాక్యుమెంటరీ పోటీ కోసం భారతదేశం నుండి ఎంపిక చేసిన నాలుగు డాక్యుమెంటరీల్లో ఇదొకటి.
చైతన్య మానవి, ఏపిల్ర్ 2026

12/05/2026

బండి భగీరథ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి:ఐద్వా
మైనర్ బాలికను వంచించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను తక్షణం అరెస్టు చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి, తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని కోరారు. వేధింపులను తట్టుకోలేక బాధితురాలు రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించగా, తొలుత కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ఒత్తిడి పెరగడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చట్టం అందరికీ సమానమే. అధికారంలో ఉన్నవారి కుటుంబాలకు “ప్రత్యేక రక్షణ ఉండకూడదు” అని స్పష్టం చేశారు. మహిళలపై అన్యాయం జరిగితే పోలీసులు మౌనంగా ఉండటం సరికాదని హితవు పలికారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ బాధితురాలికి అండగా ఉండాల్సింది పోయి హనీ ట్రాప్ చేస్తున్నారంటూ ఎదురు కేసులు పెట్టడం తగదని హెచ్చరించారు. తక్షణం బండి సంజయ్ కుమారుడిని అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఐద్వా డిమాండ్ చేసింది.

ఉక్కు పాదానికి ఎల్లలు లేవు` కట్టా  కృష్ణారావు(విశ్రాంత అధ్యాపకులు)   ప్రపంచ సాహితీ చరిత్రలో అన్ని భాషల్లోను సృజియించబడ్డ...
12/05/2026

ఉక్కు పాదానికి ఎల్లలు లేవు
` కట్టా కృష్ణారావు
(విశ్రాంత అధ్యాపకులు)

ప్రపంచ సాహితీ చరిత్రలో అన్ని భాషల్లోను సృజియించబడ్డ లక్షల పుస్తకాల్లో గొప్ప పుస్తకాలపై సాహతీ వేత్తలు పరిశీలన చేసిన నూరు అద్భుత పుస్తకాల జాబితాలో అమెరికా రచయిత జాక్ లండన్ రచన “ది ఐరన్ హీల” ఒకటి. మన తెలుగు భాషలో “ఉక్కుపాదం” పేరుతో అనువాదం పొంది పాఠకుల చేతుల్లోకి వచ్చి చేరింది.
జాక్ లండన్ 1908లో రాసిన ఈ నవల కాలక్షేపం కోసం రాసింది కాదు. ఆనాటి జనజీవన సమాజ స్వరూపం, దాని అడుగున దాగున్న కఠోర వాస్తవ జీవనసత్యాన్ని, జటిలమైన విషయాలను సులభ శైలిలో దృశ్యమానం చేశాడు. అతని పదునైన భాష, శక్తివంతమైన వ్యక్తీకరణ విస్మయం గొల్పోతుంది. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వాన్ని, రణరంగ రక్తసిక్త ప్రవాహాన్ని, దరిద్రుల్ని కాల్చుకు తిన్న బలవంతుల దౌర్జన్యాన్ని, నరహంతకుల కబంధహస్తాల్లో పదఘట్టనల్లో ఎలా నలిగిపోతూ, ఎలా రక్తంతో కన్నీళ్ళతో తడిసిపోతుందో సత్యదర్శనం చేసాడు.
మానవ హస్తం శ్రమకు మÖలస్థానమని, శ్రమయే మానవ నాగరికతకు జన్మస్థానమని గ్రహించి సర్వ మానవాళి శ్రమశక్తి ఉత్పత్తితోనే జీవనం సాగిస్తుందని తెలుసుకున్నాడు. ప్రపంచ మానవ చరిత్రని జయాపజయాల్ని భూత భవిషత్ వర్తÁ్తమానాల్ని క్రిటికల్ ఆలోచనతో, క్రియేటివ్ ప్రజెంటేషన్ చేశాడు. మనిషి జీవనం దుర్లభమైపోతున్న స్థితిలో బ్రతకడానికున్న హక్కును స్థాపించడమే మానవ ధర్మం అని ఆక్రోషించాడు. ధనికలోకం పూజితావాదంతో అధికార దుర్వినియోగం, కార్మిక అణచివేత, ప్రజల్ని హింసించడం, ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ శక్తితో లాభాల కోసం సాగించే రాజకీయ దోపిడీ శక్తులు నిజస్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు దృశ్వీకరించిన రచన “ఉక్కుపాదం”.
అందంగా కనిపించే ఈ లోకం ఉపరితల ఆకారం ముసుగు తొలగిస్తే, అంతరంగ సత్యాన్వేషణ సాగిస్తే సాగుతున్న దుర్మార్గాలు, మోసాలు, ద్వేషాలు, దోపిడీలు వాటి దుర్భేధ్యరహస్యాలు తెలుసుకోవడం సాధ్యం. అందంగా కనిపిస్తున్న మానవ శరీరాన్ని తీసుకుంటే.. ఎన్నో పరీక్షలు నిర్వహిస్తే తప్ప లోపల రుగ్మతల్ని కనిపెట్టలేం. జబ్బు ఏ రూపంలో, ఎక్కడ ఉందో తెలిస్తేనే కదా దానికి చికిత్స సాధ్యమవుతుంది. ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని రక్షించుకోగలిగేది.
ఉక్కుపాదం ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితమైందికాదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వర్తించే విశ్వజనీన సత్యాన్వేషణే ఈ రచన. జనాభా విస్పోటనంతో అధిక ఆహార ధాన్యాల దిగుబడి తప్పనిసరైన మాట వాస్తవమే కానీ దీనికై సృష్టించే రసాయనక ఎరువులు, క్రిమిసంహారక మందులు, మార్కెట్ మతలబులు, మాయాజాలంతో పై మెరుగులు అద్దె విష పదార్థాల స్లోపాయిజన్లు, వ్యాధి కారకాల పళ్ళు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, బియ్యం, గోధుమ అన్ని మానవ ఆరోగ్యాన్ని, భూసారాన్ని నాశనం చేస్తున్నాయి. భారతదేశంలో క్రిమిసంహారక మందులు 63 వేల మెట్రిక్ టన్నులు, ఫెర్టిలైజర్ 500 లక్షల మెట్రిక్ టన్నులు ఉపయోగిస్తుంటే.. ప్రపంచంలో క్రిమిసంహారక మందులు 37 లక్షల మెట్రిక్ టన్నులు, ఫెర్టిలైజర్స్ కోటి 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉపయోగిస్తున్నారు. వీటి వెనుక లక్షల కోట్ల లాభార్జనే ధేయంగా ఎరువుల రసాయనాల ఉత్పత్తిదారులు ఉన్నారనే సత్యం మనకు తెలియదుగా..! ప్రాణుల జీవనంలో జలం పాత్ర విస్మరించలేనిది. ప్రవహిస్తున్న కాలువలు, నదులు, చెరువులన్నింటా ఫ్యాక్టరీలు విడిచి పెట్టే వ్యర్ధాలన్నీ ఈ ప్రవాహాల్లోకి తోసేస్తున్నారు. నీరంతా కలుషితం చేయబడుతుంది. స్థలాల్లోకి, పొలాల్లోకి రసాయనాలు కొట్టుకొస్తున్నాయి. తాగునీరు ప్రాణాంతకమైన జబ్బులకు కారణం అవుతుంది. వీటి వెనుకున్న వ్యాపారవర్గ లాభాలు మనకు కనిపించవు. ప్రజల ప్రాణాలు హరించే దుర్మార్గం తెలిస్తే భయమేస్తుంది. మరి స్వచ్ఛమైన గాలైన పీల్చి జీవించే అదృష్టం ఉందా?. ఉహు.. ప్రతిరోజు పరిశ్రమలు, వాహనాలు, ఏసీలు, ఫ్రిజ్ లు విడిచిపెట్టే విషవాయువులతో వాతావరణ కాలుష్యం ఏర్పడి కోట్ల మంది జబ్బుల బారిన పడుతున్నారు. మరి స్వచ్ఛమైన గాలి పీల్చి బతకడమెలా? సాంస్కృతిక కాలుష్యానికి కారణాలు చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా లాభాలు గడించడానికి వారి ఉత్పత్తులు వినియోగం కావడానికి, వినియోగదారుల్ని మెస్మరైజ్ చేయడానికి వ్యాపార ప్రకటనలు, ప్రచారాలు, పత్రికలు,రేడియో, టీవీ, సినిమా, సీరియల్స్, కంప్యూటర్ నెట్వర్క్, సెల్ఫోన్లు ద్వారా ప్రజల మెదళ్లను చేజిక్కించి లక్షల కోట్లు కొల్లగొట్టే వ్యాపార సామ్రాజ్యాలు రాజ్యమేలుతున్నాయి.
పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రజలకు నిజాలు తెలియకుండా చేయడానికి ప్రచండమైన, శక్తివంతమైన ప్రసార సాధనాలు పత్రికలను, టీవీ చానల్స్, సెల్ ఫోన్స్ శక్తితో బుద్ధిని చిత్తు చేసే మత్తు పానీయాల ఎత్తును కొనసాగిస్తుంది. మతాధిపతులను, విశ్వవిద్యాలయాలను, దేవాలయాల్ని, దేవుళ్లను వాళ్ళ ఆధీనంలో ఉంచుకుని కట్టు కథలతో ప్రజల మెదళ్లు ఏలడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. శ్రామిక జనం తెలివిమీరితే, సంఘటితమవుతుంటే అణచివేతకు చట్టాలు సృష్టిస్తారు. తమను కాపాడుకోవడానికి పోలీస్ వ్యవస్థను అవసరమైతే సైనిక శక్తిని వినియోగిస్తారు. అతిక్రూరంగా మృత్యువిన్యాసాలు సృష్టించి రక్తపుటేరుల్లో ముంచెత్తుతారు. ఈ కరాళనృత్యం, నిర్ధాక్షణ్య పథగట్టనల్ని ఎలా సాగిస్తుందో రచయిత చరిత్రలో అనేక సంఘటనల ఆధారంగా ఊహాత్మకంగా తన మేదస్సును జోడించి భవిష్యత్తు ప్రపంచ గమనాన్ని ఉక్కుపాదం నవలలో కళ్లకు కట్టినట్టు దృశ్యమానం చేశాడు.
అమెరికా రచయిత జాక్ లండన్ తన అద్భుత సృష్టి ఉక్కుపాదం నవల. ఈ నవలలోని కథానాయకుడు ఎర్నెస్ట్ ఎవర్ హార్డ్ ఒక శక్తివంతమైన పాత్ర. గొప్ప మేధావి మానవతావాది, మÖర్తీభవించిన సమరశీలి. అతని అనంతమైన విజ్ఞాన ఆర్జనతో, ప్రజ్ఞా పాఠవాలతో సమాజంలోని అసమానతలకు కారణాల్ని బహిర్గతం చేశాడు. ఎవిస్ సంపన్న వర్గానికి చెందిన ఒక సాధారణ మహిళ. ఎర్నెస్ట్ పరిచయంతో సమాజంలో జరుగుతున్న మోసాన్ని, దోపిడీని అర్థం చేసుకుంటుంది. ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం ఎలా విజృంభిస్తుందో అర్థం చేసుకుంటుంది. ఎర్నెస్ట్ గొప్పతనం అవగతమై ప్రేమిస్తుంది. అతన్ని వివాహమాడి అతనితో కలిసి సమాజ హితం కోసం పాటుపడుతుంది. సంపూర్ణ మానవతావాదిగా మారుతుంది. ఎన్నికలు, రాజ్యాంగం, చట్టాలు, సమస్త వ్యవహారాలు వాటి వెనుక ఉన్న ధనిక వర్గం స్వార్ధాన్ని అర్థం చేసుకుంటుంది. తన అనుభవాలను రాసుకున్న డైరీనే ఈ నవల. జాక్ లండన్ ఉక్కుపాదం నవల దేశ కాలాలకు అతీతమైంది. ఏ వర్గసమాజంలోనైనా దోపిడీ విశ్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి, పీడిత జనం జాగృతం కావడానికి, విస్మయం కొలిపే దోపిడీ రహస్య కోటల్ని బద్దలుకొట్టాడు. మన చుట్టూ జరుగుతున్న వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉక్కుపాదం ఎంతో ఉపకరిస్తుంది. ఇది చదివి అర్థం చేసుకుంటే మన అవగాహనాజ్ఞానం పదింతలు పెరుగుతుంది. ఇది నా అనుభవం. నాకిష్టమైన పుస్తకం ఇది. మీరు ఒకసారి చదవడానికి ప్రయత్నించండి.

చైతన్య మానవి, ఏపిల్ర్ 2026

దేశభక్తి పేరిట మసకబార్చేయత్నాలుజాతి గౌరవం ముసుగులో రాజ్యాంగ విలువలపై చేస్తున్న దుర్మార్గపు దాడి మాత్రమే అవునో కాదో అర్థం...
11/05/2026

దేశభక్తి పేరిట మసకబార్చేయత్నాలు
జాతి గౌరవం ముసుగులో రాజ్యాంగ విలువలపై చేస్తున్న దుర్మార్గపు దాడి మాత్రమే అవునో కాదో అర్థం చేసుకోవడానికి మనం 1937 నాటి రాజ్యాంగ అసెంబ్లీ ఏం నిర్ణయించిందో, బిజోరు ఇమ్మాన్యుయేల్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అండ్ అదర్స్ కేసులో (1986) సుప్రీం కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందో తెలుసుకోవాలి.
బలహీనత కాదు విజ్ఞత...
1937 అక్టోబర్ నెలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కలకత్తాలో సమావేశమైంది. ఆనాడు చేసిన నిర్ణయాన్ని ఇవాళ కొందరు బుజ్జగింపు చర్యగా ప్రచారం చేస్తున్నారు. కానీ జరిగింది అది కాదు. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ బలపరిచారు. మహాత్మా గాంధీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ తీర్మానాన్ని వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
వందేమాతర గీతంలోని కొన్ని చరణాల పట్ల ముస్లిం సోదరులు లేవనెత్తిన అభ్యంతరాలు సబబైనవే. జాతీయ సమావేశాల్లో ఎవరికీ అభ్యంతరం లేని ఆ గీతంలోని మొదటి రెండు చరణాలను జాతీయ గీతంగా ఆ తీర్మానం ఆమోదించింది. ఇవాళ దీనిని కొంతమంది పిరికితనంగా అభివర్ణిస్తున్నారు. కానీ ఆ నిర్ణయం బాధ్యతతో కూడినది. బంకించంద్ర ఛటర్జీ రాసిన గీతంలో తరువాయి చరణాలలో హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి, సరస్వతుల గురించి ప్రస్తావించారు. ఒక చరణంలో అయితే ‘త్వం హి దుర్గా, దళ ప్రహరణ ధారణ’ (దశాయుధాలు ధరించిన ఓ దుర్గామాత) అంటూ మాతృభూమిని పోల్చారు.
రవీంద్రనాథ్ టాగూర్ కూడా వందేమాతర గీతాన్ని మొదటి రెండు చరణాలకే పరిమితం చెయ్యడాన్ని సమర్ధించారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న మధ్యేవాదుల నుండి అతివాదుల వరకు, లౌకిక భావజాలానికి కట్టుబడి ఉన్నవారి నుండి పరమ భక్తుల వరకూ అందరూ ఈ మొదటి రెండు పాదాలూ ఎవరి వ్యక్తిగత విశ్వాసాలనూ కించపరచకుండా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయని భావించారు.
ఇది లొంగుబాటు కానే కాదు, దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన సమస్త ప్రజానీకపు సమష్టి విజ్ఞత.1950 జనవరి 24న నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ‘జనగణమణ’ మన జాతీయ గీతం అవి ప్రకటిస్తూ ‘వందేమాతర’ గీతాన్ని కూడా సరిసమానంగా గౌరవిద్దాం అని స్పష్టం చేశారు.
రాజ్యాంగ అసెంబ్లీ వందేమాతర గీతం లోని మొదటి రెండు చరణాలనే జాతీయ గీతంగా గుర్తించింది. మిగిలిన నాలుగు చరణాలనూ ప్రమాదవశాత్తూ ఉద్దఏశపూర్వకంగా మరిచిపోవడం అంటూ జరగలేదు. లౌకిక రాజ్యంలో నిర్దిష్ట మత దేవతలను అధికారిక చిహ్నాలుగా చేపట్టడం సరికాదన్న స్పష్టమైన అవగాహనతోనే మన జాతి నిర్మాతలు ఆ నాలుగు చరణాలను వదలిపెట్టారు.
మన రాజ్యాంగంలోని 51ఎ(ఎ) అధికరణం దేశంలోని ప్రతి పౌరుడూ జాతీయ జెండాకు, జాతీయ గీతానికి కట్టుబడి ఉండాలని పేర్కొంటోంది. జాగ్రత్తగా గమనిస్తే ఈ అధికరణంలో ఏది జాతీయగీతం అన్న స్పష్టత లేకపోవడం గుర్తించవచ్చు. 1976లో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు పౌరుల ప్రాథమిక బాధ్యతలను రూపొందించింది. ఇందులో కూడా జాతీయ జెండా, జాతీయ గీతాలను గౌరవించాలన్నది పౌర బాధ్యతగా చేర్చారు. కానీ జాతీయ పాటను చేర్చలేదు. ఇది పొరబాటున జరిగింది కాదు. స్పష్టమైన ఎంపిక. జాతి గౌరవాన్ని అగౌరవపరచడాన్ని నివారించే పేరిట 1971లో ఒక చట్టం తీసుకు వచ్చారు.
జాతీయ గీతం, జాతీయ జెండా, రాజ్యాంగం-ఈ మÖడింటినీ ఆ చట్టం పరిధి కిందకు తీసుకు వచ్చారు. ఈ చట్టంలో కూడా వందేమాతర గీతాన్ని ప్రస్తావించలేదు. ఈ గీతాన్ని ఆలపించక పోతేనో లేక ఈ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడకపోతేనో అది ఆ గీతాన్ని అవమానించినట్లు పరిగణించి...చట్ట పరంగా అలాంటి వారి మీద చర్య తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఇది యాదృచ్ఛికం కానే కాదు. రాజ్యాంగ చట్రం జాతీయ గీతానికి, పాటకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా గుర్తించినందునే అలా నిర్ణయించారు.
నిరాకరించే హక్కుకు సంబంధించిన కేసు...
1985 జులైలో కేరళలో బిజోరు, బిను మోల్, బిందు ఇమ్మాన్యుయేల్ అనే ముగ్గురు పిల్లలను స్కూలు నుండి బహిష్కరించారు. వీళ్లు ముగ్గురూ యెహోవా ఆరాధకులు. రోజూ అసెంబ్లీలో జాతీయ గీతాలాపన జరిగేప్పుడు వీళ్లు కూడా గౌరవంగా నిలబడి ఉండేవారు. గీతాన్ని ఆలపించే వారు కాదు. వీళ్లు అనుసరించే మత విశ్వాసం అందుకు అనుమతించదు. ఆ పిల్లలు ఎవరినీ ఆటంకపరచలేదు. ఎలాంటి గొడవ చేయలేదు.
ఆ రాష్ట్ర మంత్రి ఒకరు జోక్యం చేసుకుని ఆ ముగ్గురు పిల్లలను స్కూలు నుండి బహిష్కరింపచేశారు. కేరళ రాష్ట్ర హైకోర్టు ఇందులో తప్పేంలేదని భావించింది. కానీ సుప్రీం కోర్టు ఇది తప్పుని తేల్చి చెప్పింది. ‘ఆ ముగ్గురు పిల్లలను స్కూలు నుండి బహిష్కరించడం ద్వారా రాజ్యాంగం ఈ దేశంలో ప్రతి పౌరుడికీ ఇచ్చిన మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కులను హరించివేశారు’ అని జస్టిస్ ఒ.చిన్నపరెడ్డి తీర్పు చెప్పారు.
‘జాతీయ గీతం ఆలపించినప్పుడు గౌరవ సూచకంగా నిలబడే ఉన్నారు. ఆ గీతంతో గొంతు కలపకపోవడం జాతీయ గీతాన్ని అగౌరవపరచడంగా భావించకూడదు’ అని శిలాశాసనం లాంటి మాట చెప్పారు. ‘జాతీయ గీతాన్ని ఆలపించకపోవడాన్ని అగౌరవంగా భావించడం సరికాదు. గౌరవపూర్వకంగా నిలబడి, మౌనంగా ఉండడం ఏ చట్టాన్నీ ఉల్లంఘించినట్లు కాదు. పిల్లలు మౌనంగా ఉండిపోవడం వాళ్లు వాక్ స్వాతంత్య్రపు హక్కులో భాగమే. రాజ్యాంగపరంగా వారికి ఆ హక్కుల రక్షణ లభిస్తుంది’ అని న్యాయమÖర్తి ఆ తీర్పులో వివరించారు.
ఇప్పుడు ఈ రచ్చ దేనికి?...
వందేమాతర గేయాన్ని గౌరవించవద్దని ఎవరూ అనడం లేదు. ఈ గేయంలో మొదటి రెండు చరణాలూ వలస పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనా జ్వాలలు రగిలించాయి. ప్రజలు హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా, సిక్కులా అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ రెండు చరణాలనూ వీధుల్లో, జైళ్ళలో ఆలపించారు.
స్వాతంత్య్ర పోరాట నినాదంగా భావించారు. అలాంటిది ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే- దేశభక్తి పేరుతో ఏ ప్రభుత్వమైనా తన పౌరులను మతపరమైన అంశాల్లో పాల్గొనాలని నిర్బంధించవచ్చా? చిత్తశుద్ధితో రాజ్యాంగాన్ని, సుప్రీం కోర్టు తీర్పును చదివిన వారు ఎవరైనా సరే ‘కూడదు’ అనే బదులు చెబుతారు. బిజోరు ఎమ్మాన్యుయేల్ తీర్పు ఇంకా మట్టిగొట్టుకు పోలేదు. ఇంకా సజీవంగానే ఉంది. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక వ్యవస్థలో విభేదించే హక్కు, గౌరవంగా మౌనం వహించే హక్కు రాజద్రోహం కానేరదు. స్వాతంత్య్రానికి సిసలైన భాష్యం ఇదే.
కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు 1937 ఒప్పందాన్ని త్రొసిరోజంటున్నాయి. రాజ్యాంగ సభ చేసిన నిర్ణయాన్ని విస్మరిస్తున్నాయి. రాజ్యాంగంలోని 51ఎ అధికరణాన్ని తృణీకరిస్తున్నాయి. జాతీయ గౌరవాన్ని అవమానించడాన్ని నిరోధించే చట్టాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి.
ఎలాంటి చట్టం చెయ్యకుండా సవరణ....
ఇదంతా పార్లమెంటులో ఎలాంటి చట్టం చెయ్యకుండా, రాజ్యాంగ సవరణ తీసుకురాకుండా, న్యాయస్థానం ఆమోదం లేకుండా ఒక జీఓ ద్వారా అమలుచెయ్యాలని చూస్తున్నారు. మన రాజ్యాంగం పౌరులందరికీ చెందినది. జాతీయగీతం ఆలపించేవారికి, ఆలపించక పోయినా చైతన్యవంతంగా, గౌరవపూర్వకంగా మౌనంగా నిలబడేవారికి అందరికీ చెందుతుంది ఈ దేశం.
అటువంటి ప్రకాశవంతమైన రాజ్యాంగాన్ని దేశభక్తి పేరిట మసకబార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో పౌరులందరూ ఒకే రకంగా ప్రార్థించాలని రాజ్యాంగం ఎక్కడా నిర్దేశించలేదు. అయినప్పటికీ పౌరులందరూ సమానమే అని మన రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలైనా ఈ రెండు వాస్తవాలనూ వమ్ము చెయ్యలేవు.

‘ది హిందూ’ సౌజన్యంతో
చైతన్య మానవి, ఏపిల్ర్ 2026

జనగణమన, డి లిమిటేషన్ షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి! విజయవాడలో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 2 కే వాక...
05/05/2026

జనగణమన, డి లిమిటేషన్ షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి! విజయవాడలో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 2 కే వాక్

”పిల్లల ఆనందం కోసం వారు కోరినవన్నీ కొనిస్తుంటాం. సకల సౌకర్యాలు సమకూరుస్తుంటాం. వారికి ఇంకేమి కావాలి? అయినా పిల్లలు మాట వ...
04/05/2026

”పిల్లల ఆనందం కోసం వారు కోరినవన్నీ కొనిస్తుంటాం. సకల సౌకర్యాలు సమకూరుస్తుంటాం. వారికి ఇంకేమి కావాలి? అయినా పిల్లలు మాట వినడం లేదు” అంటూ కొంతమంది తల్లిదండ్రులు వాపోతుంటారు. ఇలాంటి తల్లిదండ్రులకు పిల్లల ఆనందం గురించి ఏమీ తెలియదనుకోవాలి.
- సి.వి కృష్ణయ్య
పిల్లలు ఎందుకు ఆనందంగా ఉండాలి? ఎందుకు సంతోషంగా పెరగాలి? ఆనందం లేకుండా పెరిగిన పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి వ్యక్తులుగా తయారవుతారు? అసలు బాల్యంలో ఆనందం అనేది ఎలా ఉంటుంది? పిల్లలపై ఎలాంటి హింస జరుగుతూ ఉంది? పిల్లల ఆనందం కోసం పెద్దలు ఏమి చేయాలి? ఈ విషయం గురించి తెలుసుకుందాం.
బాల్యం గురించి ఏమీ తెలియని ప్రపంచం...
ప్రపంచ మానవాళి ప్రకృతి గురించి, జీవుల గురించి ఎంతో విజ్ఞానం సంపాదించింది. వీటిపై శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేశారు. కొత్త ఆవిష్కరణలు రూపొందించారు. చివరకు మానవుడి అవయవాలు ప్రయోగశాలలో పెంచే వరకు వచ్చారు. కానీ మనిషి బాల్యం గురించి, వారి పెరుగుదల గురించిన జ్ఞానాన్ని మాత్రం సంపూర్ణంగా సంపాదించలేదు. శిశువు బాల్య దశలో ఎలాంటి వాతావరణంలో పెరిగితే ఎలాంటి వ్యక్తిగా తయారవుతాడు? గొప్ప కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, స్వాములు, సన్యాసులు, ప్రజాసేవకులు, హంతకులు, దొంగలు, మంచివారు, చెడ్డవారు వీరంతా శిశు బాల్య దశల్లో ఎలాంటి వాతావరణంలో పెరిగారు? వారి తల్లిదండ్రులు ఎలాంటి వారు? కుటుంబ జీవనం ఎలాంటిది? కొందరు ప్రజల కోసం ఎందుకు ప్రాణాలు ఇస్తున్నారు? మరొకరు ఎందుకు ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు? ఇలాంటి అన్ని విషయాలపై దీర్ఘకాలం సమగ్ర పరిశోధనలు ఏవీ జరగలేదు? జంతువులపై చేసిన ప్రయోగాలు మనుషులపై ప్రయోగిస్తున్నారు. బాల్యం అనేది వ్యక్తిగతం కాదు. అది కుటుంబ సమస్యో దేశ సమస్యో కాదు. పేదరికానికి చెందిన సమస్య కూడా కాదు. అది ప్రపంచ మానవాళి సమస్య. మానవ సమాజం ఏ వైపు సాగాలో దిశా నిర్దేశం చేసే సమస్య. బాల్యం అనేది భవనానికి పునాది వంటిది. ఆ పునాది భద్రంగా ఉండాలి కదా! ఆ పునాది నిర్మాణం వైపా, విధ్వంసం వైపా ఆలోచించాలి.
బాల్యంపై జరుగుతున్న హింస...
బాలలపై జరుగుతున్న హింస గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లల భవిష్యత్తు పేరుతోనో, వారి మేలుకోసమో, ఆనందం కోసమో అన్నట్టు జరిగే హింస సంగతి ముందుగా తెలుసుకోవాలి. ఇది చదువుల పేరుతోనూ సమాజపు అంగీకారంతోనూ, అజ్ఞానంతోనూ జరుగుతున్న హింస. బాల్యం గురించి ప్రపంచానికి ఏమీ తెలియదని అన్నిటికంటే ఈ చదువులకు ఎక్కువగా వర్తిస్తుంది. ఒక విషయం గురించిన జ్ఞానం పిల్లలు ఎలా సంపాదించుకుంటారు? వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా నేర్పడం సాధ్యమవుతుందా? భయంతో జ్ఞానాన్ని సంపాదించగలరా? పరీక్షల భయం, టీచర్ల భయం, తల్లిదండ్రుల భయం, గంటల తరబడి కూర్చుని వినడం, అనుభవంతో తెలుసుకోవలసిన విషయం కంఠస్థం చేయాల్సి రావడం, ఇతరులతో పోల్చడం, శిక్షలు, బహుమతులు ఇవన్నీ పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి?
సమాజానికి తెలిసేది ఒక శాతమే....
బాలికలైనా, బాలురైనా పిల్లలపై జరిగే లైంగిక హింస సంగతి సమాజానికి తెలిసేది ఒక శాతమే. ఇళ్లల్లో, హాస్టళ్లలో, పనిచేసే ప్రదేశాల్లో, మత సంస్థల్లో చాలా రహస్యంగా ఇది జరిగిపోతూ ఉంటుంది. పైకి చెప్పుకోలేని హింస ఇది. ఆటల్ని అటకెక్కించి కథలనీ, కబుర్లనీ కంచికి పంపించి, నిరంతరం నీతులు చెబుతూ, తిట్లతో దబాయింపులతో బాల్యాన్ని నలిపేసి, నరకం చేస్తే, ఆ పిల్లలు కసి, ద్వేషం, పగలతో రగిలిపోతూ పెరిగితే వాళ్లు మనుషులుగా మిగులుతారా? మానవత్వంతో పెరుగుతారా? చుట్టూ ఉన్న నేర ప్రపంచం రారమ్మని ఆహ్వానిస్తుంటే ఏమి జరుగుతుందో మనకు తెలియదా?
బాల్యం ఒక బంగారు కాలం...
మనుషులు వయసును బట్టి ఒక్కో దశ దాటుకుంటూ భవిష్యత్తులోకి అడుగుపెడతారు. వీరు బాల్య కౌమార దశలు దాటి యవ్వనంలో ప్రవేశిస్తారు. నూతన ఉత్సాహంతో ఉరకలు వేస్తూ చదువులు పూర్తి చేసి, ఉద్యోగంలో చేరతారు. పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుడతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. పిల్లల చదువులు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరేవో సమస్యలు చుట్టుముడతాయి. జీవితం ఏదో తేడాగా కనిపిస్తుంది. ఆలోచిస్తూ మథóŠన పడతారు. అప్పుడు గుర్తుకువస్తుంది ఆనందంగా లేని సంగతి. గతాన్ని గుర్తుచేసుకుంటూ కాలంతో వెనక్కి వెళ్లి చూస్తాం. బాల్యంలోకి తొంగి చూస్తాం. ఒకసారి గుండెలు ఆనందంతో పొంగిపోతాయి. అది బంగారు కాలం. స్వర్గం. బాధ్యతలు, బరువులు లేని బాల్యం. కుల మతాల అడ్డుగోడలు లేని స్వేచ్ఛా ప్రపంచం. ఆస్తులు, అంతస్తులు తేడాలు ఒంటబట్టని వయస్సు. కల్లాకపటం లేని హృదయాలు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అంతలోనే కలిసిపోయి ఆడుకుంటారు.
స్వర్గం అనేది బాల్యమేననీ...
ఆటలు, మాటలే వారికి ఆనందాలు. వారికి విలువైన ఆట వస్తువులు అవసరం లేదు. మట్టి, ఇసుక, రాళ్లు, కర్ర పుల్లలు, గాజు పెంకులతో ఆడుకుంటారు. చిన్న చిన్న విషయాలకి పగలబడి నవ్వుకుంటారు. కదిలే కుక్క తోకను చూసి కడుపుబ్బ నవ్వుతారు. తెరలు తెరలుగా అలసిపోయే వరకు నవ్వుతూనే ఉంటారు. బ్రహ్మానంద భరితులవుతారు. వారి శరీరంలో ప్రతి అణువు పులకించిపోతుంది. ఆనందమనేది ఇలా ఉంటుందని, స్వర్గం అనేది బాల్యమేననీ అర్థం చేసుకుంటాం. మనుషులు జీవితంలో విజయం సాధించినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, కొత్తబట్టలకు కొనుక్కున్నప్పుడు, కోరికలు తీరినప్పుడు పొందేవి ఆనందాలు కాదు. అది తీయటి మిఠాయిలను తిన్నప్పుడు కలిగే సంతృప్తి లాంటిది. అది కొద్దిసేపు ఉండి మరుగున పడిపోతుంది. కానీ బాల్యంలోని ఆనందం అంతరంగానికి చెందింది. బాల్యంలో పొందిన ఆనందం మరి దేని వల్లా పొందలేనిది.
ఇష్టముంటే కష్టపడతాం....
”పిల్లల ఆనందం కోసం వారు కోరినవన్నీ కొనిస్తుంటాం. సకల సౌకర్యాలు సమకూరుస్తుంటాం. వారికి ఇంకేమి కావాలి? అయినా పిల్లలు మాట వినడం లేదు” అంటూ కొంతమంది తల్లిదండ్రులు వాపోతుంటారు. ఇలాంటి తల్లిదండ్రులకు పిల్లల ఆనందం గురించి ఏమీ తెలియదనుకోవాలి. “పిల్లలు బాల్యంలో కష్టపడి పెరిగితే పెద్దవాళ్ళయ్యాక సుఖపడవచ్చు కదా” అంటూ కొంతమంది గొప్ప వ్యక్తుల్ని ఉదాహరణగా చూపిస్తుంటారు. పిల్లలు కష్టపడకూడదు అనడం లేదు. పనిచేయడంలో, ఏదైనా సాధించడంలో కష్టపడడం వేరు. వారు మనసులను నొచ్చుకునేట్లు బాధపడేట్లు చేయడం వేరు. మనం ఒక విశాలమైన మైదానానికి పిల్లల్ని తీసుకొని వెళ్తాం. ఆ పక్కన ఉన్న ఎత్తైన కొండ ఆకర్షిస్తుంది. ఎంత కష్టమైనా ఆ కొండనెక్కి విజయం సాధించాలనుకుంటాం. ఇలా పిల్లలు ఇష్టమైతే ఎంత కష్టమైనా భరిస్తారు. చదువు కూడా ఇలాగే ఇష్టపూర్వకంగా సాగాలి.
బాలల ఆనందం సమాజానికి చుక్కాని...
ఆనందంగా, స్వేచ్ఛగా ఎదిగిన బాలల సమాజం ఈ ప్రపంచాన్ని సరైన దిశకు తీసుకుపోతుంది. తమ జీవితాలతో పాటు ప్రపంచాన్ని కూడా సంతోషంగా ఉండేలా చూస్తుంది. ఆనందంగా ఎదిగిన పిల్లలు ఆశావహ దృక్పథంతో ఉంటారు. అయితే బాల్యం ఆనందంగా ఉండడం అనేది బాలల చేతిలో లేదు. అది పెద్దల చేతిలోనే ఉంది. మానవ సమాజాన్ని హింస వైపు నడిపిస్తారో, శాంతి వైపు నడిపిస్తారో పెద్దల ఇష్టం.
‘బాల్యం ఆనందంగా ఉండాలి. పిల్లల సంతోషంగా ఎదగాలి’ అనే మాటలు పిల్లల మీద ప్రేమతోనో జాలితోనో అంటున్న మాటలు కాదు. మానవ సమాజం ఏ దిక్కు వైపు ప్రయాణం చేయాలో ఆ వైపు వేసే తొలి అడుగును గురించిన హెచ్చరిక-ఆ మాటలు!
‘జన విజ్ఞానం’ సౌజన్యంతో

చైతన్య మానవి, ఏపిల్ర్ 2026

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when AIDWA AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share