09/03/2026
మానవత్వం చాటుకున్న కర్రి సాయికృష్ణ
మునగపాక గ్రామానికి చెందిన గండిమని పెంటారావు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీ ధర్మ ఫౌండేషన్ చైర్మన్ కర్రి సాయికృష్ణ శ్రీ ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సేవ మరియు ధర్మాన్ని కాపాడే లక్ష్యంతోనే శ్రీ ధర్మ ఫౌండేషన్ను స్థాపించామని, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని తెలిపారు