Bhupati Rural Development Trust (BRDT)

Bhupati Rural Development Trust (BRDT) BRDT it’s a Non-Governmental Organization.We support to improve rural development in terms of Educ

30/06/2022

2021 జూలై 1 న శ్రీ వర్మ గారు @ 75 సందర్భంగా
సీనియర్ పాత్రికేయులు
డి సోమసుందర్ గారు రాసిన కొన్ని జ్ఞాపకాలు
————/—
మార్క్సిజం స్ఫూర్తి! గ్రామ్సీ దీప్తి!

సృజనాత్మక కృషి సాగిస్తున్న

వర్మగారి జన్మదినం జూలై 1.
----------------------------------------------
డి.వి.వి.ఎస్.వర్మ గారి పేరు ఒక మార్క్సిస్టు మేధావిగా రాష్ట్రంలోని వామపక్ష శ్రేణులకు చిరపరిచితమైనదే!

ఆయన రచనలు, విశ్లేషణలు, కొత్త దైన లోచూపుతో చారిత్రక, సామాజిక, రాజకీయ,ఆర్థిక అంశాలను అధ్యయనం చేయడానికి మనకు దారి చూపుతాయి!

ఉద్యమాలలో విశాల ప్రజానీకం విస్తృతంగా పెద్ద ఎత్తున పాల్గొనడానికి వీలుగా వర్మగారు రూపొందించే నినాదాలు,పోరాట రూపాలు, వైవిధ్యంగానూ, సరళంగాను, వినూత్నంగానూ అత్యంత ప్రభావవంతం గానూ ఉంటాయి!

భారతకమ్యూనిస్టుపార్టీలో, లోక్ సత్తా ఉద్యమసంస్థలో, లోక్ సత్తా పార్టీలో వర్మగారు ఎంతో ముందుచూపుతో, నైపుణ్యంతో చూపిన కొత్తదారి ఆయా ఉద్యమాల్లో వేలాదిమంది కార్యకర్తల్ని అమితంగా ప్రభావితం చేసింది!

రాజకీయ,సైద్ధాంతిక గురుకులాలపైనా, గురుపీఠాలపైనా వర్మగారికి ఏమాత్రం నమ్మకంలేదు!

అందుకే ఆయన పీఠాధిపతి కాలేదు!
అయితే వర్మగారి కుదురునుండి తయారైన సామాజిక కార్యకర్తల బలగం ఒకటి తెలుగు రాష్ట్రాలలో ఉంది!

విభిన్న జీవనరంగాలలో వారంతా తమదైన కీలక భూమిక పోషిస్తున్నారు!

వర్మగారి ఆలోచనలలో ని కొత్త దృష్టిని వారు వ్యాప్తిచేస్తున్నారు!

క్రియాశీల రాజకీయాలలో లేకున్నా వర్మగారి ఆలోచనలు మార్క్సిస్టు సిద్ధాంత ఆచరణ చుట్టూనే ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి!

అధ్యయనాన్ని ఆచరణకు అన్వయింప చేయడంపైనే ఆయన దృష్టిసారించి మేధోకృషి సాగిస్తూ ఉంటారు!

జూలై 1 వ తేదీ ఆయన పుట్టిన రోజు!

వర్మ గారితో ఓ నాలుగున్నర దశాబ్దాలకు పైబడిన అనుబంధం నాది!

ఆ చనువుతోనే వారి కృషి గురించి కొన్ని సంగతులు చెప్పడానికే ఈ పోస్ట్!
----------------------------------------------
వర్మ @75.
**********************
2021 జూలై 1 వ తేదీనాటికి 75 ఏళ్లు నిండుతున్నాయి!

ఆయన 76 వ ఏట ప్రవేశిస్తున్నారు!

వర్మగారి పూర్తిపేరు దాట్ల వీర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వర్మ!

పశ్చిమగోదావరి జిల్లా
జంగారెడ్డిగూడెం శివారు రామచంద్రపురంలో 1946 జూలై 1 వ తేదీన జన్మించారు!

తండ్రి దాట్ల సత్యనారాయణరాజు గారు!

తల్లి సూర్యనారాయణమ్మ గారు!

వర్మగారికి ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు!

తండ్రి ఉపాధ్యాయుడు!

వర్మగారు జంగారెడ్డిగూడెంలో పాఠశాలవిద్య పూర్తిచేశారు!

హైస్కూల్లోనే ఏ.ఐ.ఎస్.ఎఫ్. తోనూ కమ్యూనిస్టుపార్టీతోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది!

అప్పటినుండీ పార్టీయే ఆయనకు సర్వస్వం అయిపోయింది!

మూడున్నర దశాబ్దాలపాటు పార్టీతో ఆయన జీవితం పెనవేసుకు పోయింది!

ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో బి.ఎస్సీ పూర్తిచేశారు!

ఆంధ్ర యూనివర్సిటీలో లా కోర్సులో చేరారు!

విద్యార్థిఉద్యమ అవసరాలకోసం మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పారు!

విశాఖఉక్కు ఉద్యమ నేపథ్యంలో 1966 లో గుంటూరులో జరిగిన
ఏ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర మహాసభల్లో సురవరం సుధాకరరెడ్డి గారు రాష్ట్రఅధ్యక్షుడుగా, వర్మగారు ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు!

విశాఖఉక్కు ఆంధ్రులహక్కు పేరుతో జరిగిన ఉద్యమంలో వర్మగారు కీలక భూమిక పోషించారు!

ఆ తర్వాత అఖిల భారత యువజన సమాఖ్య ప.గో. జిల్లా అధ్యక్షుడుగా,రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు!

1964 లో భారత కమ్యూనిస్టుపార్టీ లో చేరిన వర్మగారు 1971 నాటికి జిల్లా కార్యవర్గసభ్యుడు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అయ్యారు!

అప్పట్లో బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన ప్రపంచ యువజనోత్సవాలకు ప్రతినిధిగా హాజరయ్యారు!

సోవియట్ యూనియన్ లో సోషలిస్టు సిద్ధాంత, ఆచరణలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడానికి పదినెలలపాటు మాస్కోలో ఉండి వచ్చారు!

1971 నుండి 9 సంవత్సరాలు సి.పి.ఐ.జిల్లా సహాయకార్యదర్శిగా ఉన్నారు!

1980 నాటికి జిల్లా కార్యదర్శిగాఎన్నికయ్యారు!

రాష్ట్ర కమిటీ సభ్యునిగా 1996 వరకూ ఉన్నారు!

రెండుసార్లు మించి ఏ బాధ్యతకూ ఎన్నిక కారాదన్న స్వీయనిబంధన తోనే పార్టీ కార్యదర్శిగా ఆయన వైదొలిగారు!

1989 లో పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు!

అయితే పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఆయన్ని రాష్ట్ర కమిటీలో కొనసాగించింది!

1996 లో వర్మగారు పార్టీలో తన సభ్యత్వాన్ని పునరుద్ధరించు కోకుండా స్వచ్ఛందంగా వదులుకున్నారు!

ఆ విషయంలో కూడా వర్మగారు తన ప్రత్యేకతను నిలుపుకున్నారు!

ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు!

పార్టీ ఆయన్ని బహిష్కరించలేదు!

పార్టీకి వ్యతిరేకంగా గానీ, నేతలకు వ్యతిరేకంగా గానీ ఆయన ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు!

సభ్యత్వం వదులుకున్నారు. అంతే!
----------------------------------------------
వినూత్నంగా ప్రజాఉద్యమాలు!
****************************
వర్మగారి హయాంలో జరిగిన పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, సమీకరణలు అందరికీ తెలిసినవే!

వాటి జోలికి పోకుండా వర్మ గారి ప్రత్యేకతలను వివరించే కొన్ని ఉద్యమాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను!

1980 - 90 దశకంలో ఈ ఉద్యమాలు జరిగాయి!

గ్రామీణప్రజలకు సామూహిక మరుగుదొడ్లు సైతం లేనిరోజులవి!

పశ్చిమగోదావరి జిల్లాలో అప్పట్లోనే
ఇంటింటికీ మరుగుదొడ్డి నినాదాన్ని రూపొందించి ఉద్యమం నిర్వహించిన ఘనత వర్మ గారికి దక్కుతుంది!

దాన్ని ఒకసమస్యగా గుర్తించడానికి సిద్ధంగా లేని ఆరోజుల్లో
జిల్లాలో పెద్దఎత్తున పాదయాత్రలు నిర్వహించి ప్రజల్లో సమస్యపై అవగాహన కల్పించారు!

అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి సమస్య తీవ్రతను వివరించి పరిష్కారానికి చర్యలు తీసుకునేటట్లు చూసారు!

పథకానికి బ్లూ ప్రింట్ ఆయనే తయారు చేశారు!

నిధుల సమీకరణకు మార్గం కూడా ఆయనే చూపారు!

ఫలితంగా తొలివిడతగా జిల్లాలో 40 వేల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది!

ఆ తర్వాత జిల్లాలో సుమారు రెండున్నరలక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ ఉద్యమమే దారి చూపింది!

మూడున్నరదశాబ్దాల క్రితం వర్మ గారు చేపట్టిన నినాదాన్నే
ఇప్పుడు అందరూ స్వచ్చభారత్ అంటున్నారు!

పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన సారథ్యంలో వ్యవసాయకార్మికులు నిర్వహించిన ఉద్యమం ఫలితంగా , చెట్టుపట్టా, వనసంరక్షణసమితి వంటి జాతీయస్థాయి పథకాల రూపకల్పన జరిగింది!

అప్పట్లో జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట "నిరవధిక ధర్నా" పొరాట రూపాన్ని వర్మగారే రూపొందించారు!

వేలాదిమంది కూలీలు కార్యాలయ ఆవరణలో మకాంచేసి అక్కడే వంటలుచేసుకుని, అక్కడే స్నాన పానాలు చేసి నిద్రించారు!

ప్రతిరోజూ,బియ్యం, పాలు, కూరగాయలు వచ్చిపడ్డాయి!

(ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల పోరాటం గుర్తుకు వస్తోంది కదా!)

మూడురోజుల పాటు ఉద్యమం ఉధృతంగా జరిగింది!

ఎన్నిరోజులైనా పోరాటం అదేవిధంగా కొనసాగుతుందన్న గట్టిసంకేతం వెళ్ళడంతో నాటి ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపింది!

అటవీ సంరక్షణకు పరిసర ప్రాంతాల ప్రజల జీవనోపాధిని ముడిపెట్టి సమస్యకు చక్కని
పరిష్కారంచూపింది వర్మగారే!

పార్టీలకు అతీతంగా రైతుఉద్యమం ఉండాలన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అనే సంస్థను వర్మగారి ఆలోచన మేరకే ఏర్పాటుచేశారు!

రైతాంగసమస్యలపై ఆసంస్థ పలు పోరాటాలు చేసింది!

ఆపోరాటాలు కూడా వినూత్న పద్ధతిలో కొనసాగాయి!

గ్రామీణబందు, గ్రామీణ ప్రాంతాల దిగ్బంధనం, వంటి పోరాట రూపాలను వర్మ గారు రూపొందించారు!

గ్రామీణప్రాంతాలలో ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది!

జాతీయ,రాష్ట్ర రహదారులపై
రెండెడ్లబళ్ళు, ట్రాక్టర్లతో గ్రామీణులు చేసిన దిగ్బంధనాలు, రాస్తారోకోలు అప్పటికి కొత్తవి!

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రైతుఉద్యమ పర్యవసానంగానే అనంతరకాలంలో ఉచితవిద్యుత్ పథకం రూపకల్పనకు దారితీసింది!
----------------------------------------------
సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం!
****************************
జిల్లాలో 1989 - 95 మధ్య జరిగిన సంపూర్ణ అక్షరాస్యత, నిరంతర విద్య, బాలకార్మిక వికాససమితి వంటి కార్యక్రమాలు విజయవంతంకావడంలో వర్మగారి కృషి కీలకమైనది!

స్వాతంత్య్రానంతరం జిల్లాలో సుమారు 50 వేలమంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి పాల్గొన్న ఏకైకఉద్యమం అది!

వారంతా ఆర్నెల్లపాటు సమయాన్నిచ్చి వయోజనులకు అక్షరాలు నేర్పించడం చిన్న విషయంకాదు!

మహిళలు,యువకులు, విద్యార్ధులు, అంత పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉద్యమం సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమమే అని చెప్పాలి!

అది ఒక ప్రభుత్వ పథకంగా కాకుండా ప్రజల భాగస్వామ్యాన్ని సమీకరించి ప్రజాఉద్యమంగా తయారుచేయడంలో వర్మగారి వ్యూహం ప్రధానపాత్ర పోషించింది!

వాలంటీర్ల శిక్షణ, అభ్యాసకుల శిక్షణకోసం వర్మగారు పలు కరదీపికలు రూపొందించారు!

సులభవాచకాలు రాశారు!

అక్షరాస్యతా ఉద్యమం కోసం, నిరంతర విద్య కోసం వర్మగారు
సుమారు 15 బుక్ లెట్స్ ను రచించారు!

అక్షరాస్యతా ఉద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా జాతీయస్థాయిలో ప్రథమస్థానం పొందింది!

తణుకు పట్టణం రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించింది!

జిల్లాఅధికారులు ,పలుఅవార్డులు పొందారు!

అక్షరాస్యతా ఉద్యమం నుండి స్వయం సహాయక సంఘాలు ఆవిర్భవించాయి!

సారా వ్యతిరేక పోరాటం వచ్చింది!

పొదుపు, పిల్లల బడినమోదు పెరిగాయి!

పేదల సామాజిక స్థాయి పెరగడానికి ఇవన్నీ తోడ్పడ్డాయి!

ఈ విజయాల వెనుక వర్మగారి ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలూ,ఆయన ప్రత్యక్ష నాయకత్వమూ ఉన్నాయని అప్పట్లోనే జిల్లాఅధికారులంతా చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి!
----------------------------------------------
లోక్ సత్తా లో...!
*******************
1999 సంవత్సరంలో వర్మగారు లోక్ సత్తా ఉద్యమసంస్థలో చేరారు!

సంస్థకు రాష్ట్రప్రధానకార్యదర్శిగా, తర్వాత రాష్ట్ర సమన్వయకర్తగా ఎన్నికయ్యారు!

అప్పటివరకూ మేధావుల థింక్ టాంక్ గానూ, అడ్వకసీగ్రూప్ గానూ పనిచేస్తున్న లోక్ సత్తాను ఉద్యమ సంస్థగా, పోరాడేశక్తిగా రూపొందించినవారు వర్మగారే!

294 నియోజకవర్గాల్లో లోక్ సత్తాకు సంస్థగత నిర్మాణం ఏర్పాటు చేసిందీ వర్మగారే!

స్థానిక ప్రభుత్వాల సాధికారిత కోసం, సమాచారహక్కు చట్టం సాధనకోసం, ఎన్నికల సంస్కరణల కోసం, లోక్ సత్తా చేసినకృషిలో వర్మగారు కీలకపాత్ర పోషించారు!

కోటిసంతకాల సేకరణ, ప్రజా బ్యాలెట్, వంటి పోరాటరూపాలను ఆయన రూపొందించారు!

2006 లో లోక్ సత్తా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న డా.జయప్రకాష్ నారాయణ్ ఆలోచనను వర్మగారు పెద్దగా ఇష్టపడలేదు!

అడ్వకసీ గ్రూప్ ను యాక్షన్ గ్రూప్ గా మార్చి ఒక ప్రెషర్ గ్రూప్ గా కొనసాగించి పరిపాలనా ఎన్నికల సంస్కరణల కోసం ప్రయత్నం చేయాలన్నది వర్మగారి ఆలోచన!

రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదని కొత్తపార్టీ అవసరంలేదని వర్మగారు అభిప్రాయ పడ్డారు!

అయితే జేపిగారి పట్టుదలతో పార్టీ ఏర్పడింది!

జేపీ గారి అభ్యర్థన మేరకు దానికి ప్రధానకార్యదర్శి అయ్యారు!

తర్వాత అధ్యక్షుడు అయ్యారు!

అయితే 2014 తర్వాత వర్మగారు లోక్ సత్తా పార్టీకి దూరం అయ్యారు!

లోక్ సత్తా నిర్వహించిన అనేక ప్రజా ఉద్యమాల వెనుక వర్మ గారి ఆలోచనలు, వ్యూహాలు ఉన్నాయని అందరికీ తెలిసినదే!

"నేను మనదేశంలో ఒక అచ్చమైన లిబరల్ పార్టీ పెట్టాలనుకున్నాను, వర్మగారు,ఆయన మిత్రులు కలిసి దీన్ని ఒక సోషల్ డెమాక్రటిక్ పార్టీ గా చేశారు" అంటూ జేపీ గారు 2010 లో లోక్ సత్తా శిక్షణా తరగతులలో పరిహాసధోరణిలో అన్నారు!

జే.పి.గారు ఏ ధోరణిలో అన్నప్పటికి అది మాత్రం నిజమేనని చెప్పాలి!
----------------------------------------------
వర్మగారి విశిష్టతలు!
**********************
వర్మ గారు ఒక మార్క్సిస్టుమేధావి!

సృజనాత్మక ఆలోచనాశీలి!

మూస, రొడ్డకొట్టుడు పద్ధతులకు ఆయన వ్యతిరేకం!

మార్క్స్ నూ ఎంగెల్స్ నూ, లెనిన్నూ, ఎంత శ్రద్ధగా చదివారో, గాంధీజీ నీ, అంబేడ్కర్ నూ అంతే అనురక్తితో చదివారు!

ఆంటోనియో గ్రామ్ సీ నీ లోతుగా అధ్యయనం చేశారు!

భారతీయ వాస్తవికతలకు అనుగుణంగా మార్క్సిజాన్ని వర్తింప చేయడానికి ఆయన తనవంతు మేధోకృషి కొనసాగిస్తున్నారు!

ప్రభావాలకూ, ప్రలోభాలకూ తలవంచని స్వతంత్ర వ్యక్తిత్వం ఆయన సొంతం!

కమ్యూనిస్టుపార్టీలో ఆయన్ని ప్రభావితం చేయడానికి పెద్ద నాయకులు ఎంతో ప్రయత్నించారు!

వీలు కాలేదు!

తన అభిప్రాయాల కోసం ఎంతటి వారితోనైనా తలపడే ధైర్యం,పట్టుదల,నిజాయితీ ఆయనలోని విశిష్టతలు!

అలాగే భిన్నాభిప్రాయాల కారణంగా ఆయనకు ఎవ్వరితోనూ వ్యక్తిగతంగా విభేదాలులేవు!

తగాదాలులేవు!

ఇన్నేళ్ళ పరిచయంలో ఇతర వ్యక్తుల గురించి ఆయన నిందా పూర్వకంగా, ద్వేషంగా మాట్లాడటం నేనెప్పుడూ వినలేదు!

అందరితోనూ స్నేహ సంబంధాలను సామరస్యపూరితంగా కొనసాగించడం వర్మగారి వ్యక్తిత్వంలోని విశిష్టత!

రాజకీయ, సామాజిక కార్యాచరణలో వినూత్న ఆలోచనలకు,ప్రయోగాలకు, మార్పులకు సదాసంసిద్ధంగా ఉండటం వర్మగారి ప్రత్యేకత!

గ్రాస్ రూట్ లో వచ్చే సామాజిక మార్పులను,రాజకీయ డైనమిక్స్ ను సీస్మోగ్రాఫిక్ స్థాయిలో పసిగట్టడంలో వర్మ గారికి ఎంతో నైపుణ్యంవుంది!

కమ్యూనిస్టుపార్టీలో, లోక్ సత్తాలో సైద్ధాంతిక, రాజకీయశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్తలను తయారు చేయడంలో వర్మగారు విశేష కృషిచేశారు!

శిక్షణా తరగతులను పదే పదే నిర్వహించే వారు!

ఆ రెండు ఉద్యమాల్లో వందలాది మంది కార్యకర్తలు ఆయన చేతుల మీదుగా తయారయ్యారు!

ఆయన ఎన్నో శిక్షణా కరదీపిక లను, అవగాహనాపత్రాలను, చిన్న చిన్న బుక్ లెట్ లను తయారు చేశారు!

ఎన్నో పుస్తకాలు రాశారు!

విశాలాంధ్ర దినపత్రిక తరపున 1990 లో "పశ్చిమగోదావరి జిల్లా సమాచార దర్శిని" పేరుతో 290 పేజీల ప్రత్యేక సంచిక టాబ్లాయిడ్ సైజులో ప్రచురించారు!

దానికి వర్మగారు సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించారు!

అటువంటి సమగ్ర సమాచార సంచిక ఆ స్థాయిలో మళ్ళీ ఇంతవరకూ రాలేదని చెప్పాలి!

ప్రస్తుతం "జాతీయ స్ఫూర్తి" పక్ష పత్రిక సంపాదకునిగా ఆయన బాధ్యతలు చూస్తున్నారు!

ఇటీవల కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ఎంగెల్స్, జయంతి ఉత్సవాలు, కమ్యూనిస్టు మానిఫెస్టో 150 సంవత్సరాలు, భారత రాజ్యాంగం 70 సంవత్సరాలు, ఆంటోనియో గ్రామ్ సీ జయంతి సందర్బాల్లోనూ, సి.రాఘవాచారి స్మారకార్థం ప్రచురించిన "జాతీయస్ఫూర్తి" ప్రత్యేకసంచికలు వామపక్ష మేధో వర్గాల్లో మంచి ఆదరణ పొందాయి!

ఇప్పటికీ జిల్లాలో పలు కార్మికసంఘాలకు కూడా ఆయన సారథ్యం వహిస్తున్నారు!
----------------------------------------------
వర్మ గారి వ్యక్తిగతం!
****************

వర్మగారి వివాహం తన విద్యార్థి ఉద్యమసహచరి సంకుమనోరమ గారితో 1971 లో అయ్యింది!

మనోరమ గారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టుపార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, రైతునాయకుడు, సంకుఅప్పారావు, మహిళా ఉద్యమనేత సంకు లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమార్తె!

ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ గా మనోరమగారు పదవీవిరమణ చేశారు!

మహిళా ఉద్యమనేతగా, సామాజికకార్యకర్తగా మనోరమ గారు జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే చిరపరిచితురాలు!

కమ్యూనిస్టు ఉద్యమంలో, లోక్ సత్తాలో, మహిళాహక్కులకోసం, ప్రపంచశాంతి కోసం జరిగిన ఉద్యమంలో, మద్య వ్యతిరేక ఉద్యమాల్లో మనోరమ గారు క్రియాశీలంగా పాల్గొన్నారు!

వర్మ, మనోరమ దంపతులకు ఇద్దరు పిల్లలు!

కుమారుడు రాహుల్ కుటుంబం జంగారెడ్డిగూడెంలో, కుమార్తె కవిత కుటుంబం యు.ఎస్.లో స్థిరపడ్డారు!

వర్మగారు చక్కని ఆరోగ్యంతో, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మాబోటి కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!

వర్మగారికి జన్మదిన శుభాకాంక్షలు!

డి. సోమసుందర్,
సీనియర్ పాత్రికేయుడు,
01- 07- 2021,

03/06/2022
07/05/2022

*విద్యార్ధిని,విద్యార్థుల ఉన్నత చదువుల కోసం..*

*AP POLYCET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2022
ఫీజు:400

*APRJC:*
అప్లై కి ఆఖరు తేది:30-05-2022
ఫీజు:250

*AP EAMCET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2022
ఫీజు:500

*TS EAMCET:*
అప్లై కి ఆఖరు తేది:10-06-2022
ఫీజు:OC/BC-800
SC/ST/PH-400

*AP I-CET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2022
ఫీజు:550

*AP ECET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2022
ఫీజు:550

*ANU PGCET:*
అప్లై కి ఆఖరు తేది:30-06-2022
ఫీజు: OC/BC-600
SC/ST/PH-500

*AP PGECET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2022
ఫీజు: OC/BC-1000
SC/ST/PH-500

*AP LAWCET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2022

*AP EdCET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2022
ఫీజు: OC/BC-600
SC/ST/PH-400

*AP PECET(PET):*
అప్లై కి ఆఖరు తేది:15-06-2022
ఫీజు: OC/BC-850
SC/ST/PH-650

*Sri Padmavathi Mahila University PGCET:*
అప్లై కి ఆఖరు తేది:10-06-2022
పరీక్ష తేదీ: 02-08-2022

*AP DEECET(TTC Entrance):*
అప్లై కి ఆఖరు తేది: 04-06-2022
ఫీజు : 600
పరీక్ష తేదీ: 23-06-2022, 24-06-2022

*AP LP CET*
అప్లై కి ఆఖరు తేది:11-06-2022
ఫీజు:600
పరీక్ష తేదీ: 26-06-2022

23/04/2022

*మలికిపురం కాలేజీ ఆస్తులు మంగెనవారి సొంతమా*!?
మహాశయులార!!
రాజోలు నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా పేరును *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా* మార్పు చేయాలని ఉదృతంగా ఆందోళన జరుగుతుంది.
రాజోలు నియోజకవర్గంలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రతి చోటకు యువకులు, పెద్దలు కుల, మతాలకు అతీతంగా అందరూ చేరి, ఒక పక్క బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ, మారో పక్క అంబేద్కర్ జిల్లా గా పేరు మార్పు చేయాలని అధికారులకు, ప్రభుత్వానికీ విజ్ఞప్తులు, హెచ్చరికలుచేస్తున్నారు. ఈ రోజు కాకపోతే మరో రోజు అయినా అంబెడ్కర్ పేరుతో కోనసీమ జిల్లా పేరు మారుతుందని ధృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.
*కోనసీమ జిల్లాకు బాబా సాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి గాని, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఒక్క రూపాయి అదనంగా ఖర్చు కాదు. పైగా ఆ మహానుభావుని పేరు ఒక జిల్లాకు పెట్టినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతో గౌరవం చేకూరుతుంది*.. అందువల్ల ప్రభుత్వం పున రాలోచన చేసీ కోనసీమ జిల్లా పేరు డాక్టరు బాబా సాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా తప్పక మార్పు చేస్తుందని అందరూ ఎంతో నమ్మకంతో వున్నారు.

*ఇది ఇలా ఉండగా*..
*సందట్లో సడేమియా* లాగా ..
అంతర్వేదిపాలెం ఫిర్కా ప్రజల విద్యాదాయిని అయినా ఏ.ఎఫ్.డి.టి (AFDT)విద్యాసంస్థల స్థలం మా కుటుంబానిది అని, దానికీ వారసులం మేమే అనే పేరుతో కొందరు వ్యక్తులు కోర్టుల కెక్కి, మలికిపురం లోని ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీని, *ప్రభుత్వ కాలేజీ గా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చి 29 న ఇచ్చిన GO ను రద్దు చేయమని చెపుతున్నారు.* స్టే వచ్చిందని ప్రచారం కూడా చేస్తున్నారు.*
కోర్టు కు వెళ్ళిన వారి ఉద్దేశం వెనుక కుట్ర దాగి వుంది. *మలికిపురం కాలేజీ ఆస్తులు వారి (మంగేన) కుటుంబానికి చెందినవి అయితే, వారి దగ్గర ఉన్న పత్రాలతో, లింక్ డాక్యుమెంట్లు, సంపూర్ణ ఋజువులతో వారి ఆస్తినీ స్వాధీనం చేయనని సంబంధిత న్యాయ స్థానం ముందుకు వెళ్ళ వచ్చు*. అంతే గానీ మలికిపురం కాలేజీని ప్రభుత్వ కాలేజీ గా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన *GO ms no 12 (Higher Education) తేదీ 29-3-2022* ని రద్దు చేయనని అడగరు, ఆ అవసరం వారికీ ఉండదు. GO రద్దు చేయమనడం పెద్ద కుట్ర ఉంది
అదృష్ట వశాత్తూ, హైకోర్ట్ వారు, పిటిసనర్ (శ్రీ మంగెన నరసింహ మూర్తి తండ్రి పేరు తెలియదు) కోరినట్టుగా GO ను రద్దు చేయలేదు, GO అమలు పై స్టే కూడా ఇవ్వలేదు.
పిటిషనర్ చెపుతున్న కాలేజీ భూమి 7.68 ఎకరాల భూమి ఏమీ చేయవద్దు *స్టేటస్కో* అని చెప్పి కేసు తదుపరి విచారణకు వాయిదా వేశారు.
మలికిపురం కాలేజీనీ ప్రభుత్వం చేపట్టాలని, PG కోర్సులు ప్రవేశ పెట్టాలని ఎప్పటి నుండో అందరూ కోరుకున్నారు. అనేక మంది రాజకీయాలతో ప్రమేయం లేకుండా దాని కోసం కృషి చేసారు.*చివరకి సాధించు కున్నారు*.
కోరిక నెరవేరిందని, సంబరాలు చేసుకునే సమయంలొ ఈ ప్రాంత పేద ప్రజలకు ఉన్నత విద్యను దూరం చేసే దురుద్దేశంతో *మలికిపురం కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకుండా చేయాలనే దురుద్దేశంతో* వారసులము అనే పేరుతో కొందరు కుట్రలు చేస్తున్నారు.
నిజంగా మలికిపురం కాలేజీ భూములు *మంగెన* వారివా??
శ్రీ మంగెన వేణుగోపాలoగారు, శ్రీ మంగెనా సత్యంగారు, శ్రీ మంగెన గంగయ్య గారు నిజంగా త్యాగ జీవులు, వీరి త్యాగాలు ఈ ప్రాంత ప్రజలు సదా గుర్తు ఉంచుకుంటారు. ప్రభుత్వ కాలేజీకి కూడా వీరి పేరు యధా తథంగా కొనసాగించి వారి కుటుంబాన్ని స్మరించుకుంటూ ఉంటాము. అందులో సందేహం లేదు.
అయితే...
శ్రీఅల్లూరి వెంకట రామరాజు
శ్రీ రుద్ర రాజు రామలింగ రాజు
శ్రీఅల్లూరి సూర్యనారాయణ రాజు
శ్రీఅల్లూరి కృష్ణం రాజు
శ్రీగెడ్డం మహాలక్ష్మి
శ్రీకానేటి మోహన రావు
శ్రీనీతిపూడి గణపతి రావు
శ్రీనయనాల గనేశ్వరరావు
శ్రీగంజి నాగేశ్వర రావు
శ్రీభూపతి వెంకట నరసయ్య
శ్రీబిక్కిన గోపాల కృష్ణ
శ్రీబోళ్ళ సత్య నారాయణ
శ్రీ రుద్ర రాజు పద్మ రాజు లాంటి ప్రజా ప్రతినిదులు, శాసన సభ్యులు పరోక్షంగా, ప్రత్యక్షముగా ఈ విద్యా సంస్థల అభివృద్ధికి ఏంతో కృషి చేసారు. ఈ అభివృద్ధిలో వారు కూడా భాగస్వామ్యులు.
శ్రీఓగూరి నూకయ్య గారి లాంటి గొప్ప దాతలు,మరియు పేర్లు వెల్లడి చేయడానికీ ఇష్టం లేని మరెందరో గుప్త దాతలు కూడా ఈ విద్యా సంస్థల అభివృద్ధిలో భాగస్వాములుగా వున్నారు.
శ్రీముప్పర్తి వెంకట రత్నం
శ్రీజాన శంకరయ్య
శ్రీరావూరి పద్మనాభం
శ్రీబళ్ళ శ్రీరాములు
శ్రీ కనుమూరి సత్యనారాయణ రాజు
శ్రీ కనుమూరి రంగరాజు
శ్రీ జంపన సత్యనారాయణ రాజు
శ్రీ రాపాక నాగయ్య
శ్రీ బత్తుల వెంకటరత్నం
శ్రీ మట్టాడ నరసింహస్వామి
శ్రీ గెడ్డం ఫ్రాన్సిస్ శ్రీ ఒగూరి వసంతరావు .. శ్రీ కొల్లాబత్తుల సూర్యా రావు
ఇలా మరెందరో ఈ ప్రాంత పెద్దల సహకారం, ప్రోత్సాహంతో ఈ విద్యా సంస్థలు ఈ అభివృధికి చేరాయి ....
శ్రీభూపతి నారాయణ మూర్తి
శ్రీ రాపాక వెంకటరావు
శ్రీగుబ్బల సత్యనారాయణ
శ్రీచెల్లుబోయేన సత్యనారాయణ
శ్రీదంతులూరి జగన్నాథరాజు
శ్రీబొరుసు బ్రహ్మానందం
శ్రీనాన్నా రాజు గారు
శ్రీముదునూరి కామరాజు
శ్రీరుద్రరాజు సత్యనారాయణ రాజు లాంటి పలు గ్రామాల సర్పంచ్ ల సహయ సహకారాలు కూడా ఈ విద్యా సంస్థలకు అందాయి.
శ్రీగొల్లపల్లి సూర్యారావు, శ్రీరాపాక వర ప్రసాదరావు గార్ల సహయ సహకారాలు కూడా ఈ కాలేజీ అభివృద్ధిలో ఉన్నాయి. ఫీర్కా లోని వందలమంది, వ్యాపార వేత్తలు, విద్యావంతులు, ఉద్యోగుల పరోక్ష, ప్రత్యక్ష సహకారాలతో ఈ కాలేజీ ఈ అభివ్రుద్దిని సాధించింది.
కాలేజీ విద్యార్ధులు, పూర్వ విద్యార్ధులు, అధ్యాపకుల పాత్ర, త్యాగం, సహకారం ఈ కాలేజీ అభివృద్ధికి దోహదం చేశాయి..
ఇంతమంది మహానుభావుల త్యాగ లక్ష్యం ఒక్కటే.. ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య లభించాలన్నదే..
ఇలాంటి మహోన్నతమైన లక్ష్యానికి విఘాతం కలిగేలా స్వార్థ పరులు పావులు కదుపుతున్నారు.
వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇందుకు గాను ప్రజా ప్రతినిదులు, పురప్రజలు ఆలోచన చేయాలి. మలికిపురం కాలేజీ ప్రభుత్వ కాలేజీ గా కొనసాగాలి. దీని కోసం అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి.
ఇట్లు
నమస్కారములతో
_*అజయ్ కుమార్ భూపతి*
AFDT విద్యా సంస్థల పూర్వ విద్యార్థి.
9849826227.

23/04/2022

కోనసీమ జిల్లాలో సముధ్రతీర ప్రాంత గ్రామాలైన అంతర్వేది నుండి కరవాక వరకూ ఉన్న గ్రామాల్లో ఎస్సీసీఎఫ్ సొసైటీ భూముల పరిధిలో A V R Oil and Gas Pvt Ltd వారు 100 కోట్ల రూపాయలు వ్యయంతో ఐదు చమురు బావులు నిర్మాణం చేయుట కొరకు ఈ సొసైటీలకు చెందిన కొంతమంది దళారులను(నాయకులును) వాడుకుంటూ కొన్ని ప్రయోజనాలు వారికి కల్పించి వారికి అనుకూలంగా
మార్చుకునే పరిస్థితులు కల్పించుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజల అనుమతులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఈ పరిధిలో ఉన్న 30 సొసైటీల సభ్యులకు కనీస అవగాహన కల్పించకుండా వారు కోరుతున్న 24 .2 చ.కి.మీ విస్తీర్ణం గల భూమిని అప్పగించేందుకు ఈ దళారీ మాఫియా తయారై ఈ ప్రాంతాన్ని మరో ఎడారి గల్ఫ్ ప్రాంతంగా మార్చేందుకు బలంగా సన్నాహాలు చేస్తుంది. ఈ విషయంలో మన ప్రాంత సామాజిక రాజకీయ సమస్యలు పరిరక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న రాజోలు పౌరహక్కుల సంఘం, రాజోలు నియోజకవర్గ పరిరక్షణ సమితి, మానవహక్కుల సంఘం, బహుజన సమాజ్ పార్టీ.....మొదలగు ప్రజాసంఘాలు,మేధావులు ముక్తకంఠంతో ఖండిస్తూ అంతర్వేది నుండి కరవాక వరకూ ఈ ప్రాంత కుటుంబాలకు అర్ధమయ్యే విధంగా వివరించినప్పటికీ పై స్థాయిలో రాజకీయ ఒత్తిల్లు ప్రయోగించి ఈ చమురు బావుల ఏర్పాటుకు రంగం సిద్దమైనట్లుగా కనిపిస్తుంది. కనుక ఈ ప్రాంత ప్రజలు బలంగా వ్యతిరేకిస్తూ నిలబడకపోతే ఇప్పటికే
OnGc వాళ్ళు 70% నాశనం చేశారు ఇప్పుడు ప్రైవేట్ companies అయితే హద్దు అదుపు ఉండదు... కాకినాడ కేజీ బేసిన్ Reliance వాడు చీమని కూడా ఆ ఫీల్డ్ వైపు రానివ్వడు. కొన్ని ఎకరాలు cover chesi చుట్టూ బౌండరీలుగా చేసుకున్నాడు. లోపల ఒక మినీ Singapore లా తయారు చేశాడు. రిలయన్స్ కి ఉన్న Projects లో కేజీ బేసిన్ Project హైలీ Richest ante ఆలోచించండి.
ఇప్పుడు నెమ్మదిగా ప్రారంభించి 5 rigs అంటారు తర్వాత మొత్తం ఊరులునే ఖాలి చేయిస్తారు కనుక అందరూ ఒకే మాటమీద నిలబడి తీసుకోవలసిన విషయం ఇది. Joint collection and RDO, Pollution Control officer వారు అటెండ్ అయిన మీటింగ్ లో ఈ ప్రాంతానికి చెందిన ఐదుగురు ఈ ప్రాజెక్టుకు అంగీకారాన్ని తెలిపినట్లు ఒక్కరు నుంచి మాత్రమే ప్రాజెక్టు ఇక్కడ వద్దని అఫీషియల్ గా వ్యతిరేకించినట్లు పై అధికారులు ప్రకటించారు, అంటే ఆ సమర్ధించిన ఈ ప్రాంతానికి చెందిన ఆ ఐదుగురు ఎవరు...? ఎందుకు ఇలా చేసారు. ఇంత జరుగుతున్నా మనవాళ్లు ఎంత వెనుకబడి ఉన్నారో దీన్ని బట్టి వారు ఈజీగా గ్రహించగలరు.
ఇప్పటికే
ఆక్వాతో జల, వాయు కాలుష్యంతో ఈ ప్రాంత నీరు మనుషులు త్రాగడానికి వీలు లేకుండా పోయింది. ఇక్కడ విస్తారంగా పండే కొబ్బరి, వరి, వేరుశెనగ, జీడిమామిడి,అరటి వంటి ప్రధాన ఆహార పంటలు, సరుగుడు వంటి వాణిజ్య పంట కలప దిగుబడి తగ్గిపోవడం,పశువులకు గడ్డి కూడా మొలవని బీడుభూములుగా మారిపోవడంతో జీవనమే అస్తవ్యస్తమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ చమురు బావుల ఏర్పాటు అంటే ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చమురు ప్రైవేటు కంపెనీలు చెలగాటమాడుతున్నట్లే కావున ప్రజా సంఘాలు పోరాటాన్ని ఇక్కడి వ్యతిరేకతను గ్రహించి ఇక్కడ తలపెట్టే ఈ నిర్మాణాలను నిలుపుధల చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Address

Razole
533242

Telephone

+91 9849826227

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhupati Rural Development Trust (BRDT) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhupati Rural Development Trust (BRDT):

Share