06/09/2026
*జమిదగ్గుమిల్లి స్కూల్ టాపర్ ‘రామ్ చరణ్’కు ఘన సత్కారం...*
*రూ. 10,000 నగదు ప్రోత్సాహకం అందించిన ‘మనం వనం’ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు*
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించినందుకు గుర్తింపువిద్యార్థులను ప్రోత్సహించడంలో ‘మనం వనం’ ఫౌండేషన్ ముందంజ
పామర్రు/జమిదగ్గుమిల్లి సెప్టెంబర్ 3 :
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ అసాధారణ ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘మనం వనం’ ఫౌండేషన్ మరోమారు తన ఉదారతను చాటుకుంది.
జమిదగ్గుమిల్లి ఉన్నత పాఠశాలలో గత పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి, పాఠశాల స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ప్రతిభావంతుడైన విద్యార్థి వెన్న మోహన రామ్ చరణ్ను ట్రస్ట్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి,రూ. 10,000 నగదు బహుమతి అందజేశారు.
పాఠశాలలోగురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘మనం వనం’ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ పెనుమాల శ్రీనివాసరావు (పి.ఎస్.ఆర్) గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన టాపర్గా నిలిచిన వెన్న మోహన రామ్ చరణ్కు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థి ఉన్నత చదువులకు ఆర్థికంగా తోడ్పడేలా రూ. 10,000 (పది వేల రూపాయలు) నగదు ప్రోత్సాహకాన్ని డైరెక్టర్ పెనుమాల శ్రీనివాసరావు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కొనియాడారు.
రామ్ చరణ్ సాధించిన విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో అతను మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
తమ పాఠశాల ప్రతిభవంతుడైన విద్యార్థికి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించినందుకు పాఠశాలప్రధానోపాధ్యాయులు చలమల శెట్టి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయ బృందం ‘మనం వనం’ ట్రస్ట్కు మరియు డైరెక్టర్ శ్రీనివాసరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాడిశెట్టి సత్య, మనం వనం ఫౌండేషన్ ప్రతినిధి పెనుమాల ప్రతాప్, మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ముదునూరి శివకృష్ణ, వాయామ ఉపాధ్యాయుడు బాదర్ల రాము, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.