02/05/2022
*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన యువజన వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది...*
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ABVP *రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి* గారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలైన
శుభసందర్భంలో దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో దేశం సాధించిన ఉన్నతి, ప్రముఖ ఘట్టాలను, అమరుల త్యాగాలను వర్తమాన,భవిష్యత్ తరాలకు అందించే విధంగా, దేశమంతా * అజాదీ కా అమృత మహోత్సవాలు* జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ యూనివర్సిటీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రపంచ దేశాలలో భారత దేశం అద్భుతంగా ప్రజ్వరిల్లడానికి మహనీయులు డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ పటిష్టమైన పునాదులు వేశారన్నారు.తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ తన విశేష విజ్ఞానంతో సమసమాజ నిర్మాణం కోసం అహరహం కృషి చేసి బావి భారతానికి మహనీయుడు చేసిన కృషి అమోఘమన్నారు.దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తునన్నా ఇంకా దేశ విచ్చిన్నకర శక్తులు యూనివర్సిటీ క్యాంపస్ లలో తిష్ట వేసి దేశంలో చిచ్చు పెట్టె ప్రయత్నాలు చేస్తున్నారని జాగారుకతతో ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులతో యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.స్వాతంత్ర్యం సిద్దించిన సిద్దించిన తొలినాళ్లాలో పురుడుపోసుకున్న ABVP విద్యార్థుల, విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తూ జాతీయ పునర్నిర్మాణంలో విద్యార్థుల భాగస్వాములను చేస్తూ విద్యార్థులలో జాతీయ భావాలను నింపేందుకు అలుపెరగని కృషి చేస్తుందని అన్నారు.*పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ గారు* మాట్లాడుతూ దేశం నాది ఈ గడ్డ నాది అని ఏబీవీపీ ముందుకు వెళ్తుందని అంబేద్కర్ కొందరి వాడు కాదు అని అందరి వాడు అని ఆయన అన్నారు.అంబేద్కర్ ని అందరికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని కుహన మేధావులకు హితవుపలికారు.ప్రిన్సిపాల్ హారతి గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆటలను వ్యక్తిగతగంగా తీసుకోకుండా ముందుకు వెళ్లాలని అన్నారు.అనంతరం క్రీడాకారులకు బహుమతులు అందజేశారు*
*ఈ కార్యక్రమంలో:-సురేందర్ రెడ్డి,వెంకటకృష్ణ,నవీన్,మనోజ్,శివ,శ్రీకాంత్,సురేష్,గజేంద్ర మరియు యూనివర్సిటీ కార్యకర్తలు పాల్గొన్నారు...