15/06/2026
ప్రెస్ నోట్ 15-06-2026
*పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లు పెంచాలి*
*త్రిఫ్ట్ పండు పథకం వెంటనే ప్రారంభించాలి*
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లు పెంచాలని *సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య* డిమాండ్ చేశారు.
సోమవారం నల్లగొండ పట్టణంలో ని పద్మనగర్ పద్మశాలి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్లూమ్ రంగాన్ని ఆదుకునే విధానాలు అమలు చేయాలని, కార్మికుల ఉపాధి భద్రతకు చర్యలు తీసుకోవాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పవర్లూమ్ కార్మికుల పొదుపు పథకం నిలుపుదల చేసి 8 నెలలు కావస్తుందని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు పద్మా నగర్ లో ఇండ్లు లేని పవర్లూమ్ మరణించిన సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు గతంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారని కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
పవర్లూమ్ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిశ్రమ అభివృద్ధి కోసం సంఘటిత ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులందరూ యూనియన్ 2026 సభ్యత్వాలు వెంటనే పూర్తి చేసి, కూల్ రేట్లు పెంచాలని యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వాలని తదితర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
*తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్ జిల్లా కమిటీ సభ్యులు గంజి రాజేష్ సీనియర్ నాయకులు పెండెం రాములు, ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షులు పెండెం బుచ్చి రాములు పద్మనగర్ ఇండస్ట్రియల్ ఏరియా చర్లపల్లి తదితర ప్రాంతాల మహిళలు కార్మికులు సురపల్లి భద్రయ్య ఎల్గం అంజనేయులు, దేవులపల్లి గిరిబాబు నిమ్మలగోటి సైదులు పొట్టబోతుల యాదగిరి, మూడ చంద్రకళ మిరియాల శ్రీవాణి సావిత్రమ్మ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు*