20/04/2026
*--Press note ---*
(20/04/2026, దేవరకొండ టౌన్)
*చికాగో అమరవీరుల స్ఫూర్తితో మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి.*
-- *సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీమ్
ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీమ్ కార్మికులకు పిలుపునిచ్చారు.
సోమవారం దేవరకొండ మండల కేంద్రంలో CITU జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 140 ఏళ్ల క్రితం చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం కార్మికులు చేసిన పోరాటం ప్రపంచ కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిందని గుర్తు చేశారు. ఆనాడు కార్మికులు చిందించిన రక్తం ఫలితంగానే 8 గంటల పని విధానం, సెలవు సౌకర్యాలు మరియు కనీస వేతన చట్టాలు ఏర్పడ్డాయని తెలియజేశారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిని 4 కార్పొరేట్ అనుకూల 'లేబర్ కోడ్లు'గా మార్చడం కార్మిక వర్గానికి పెను ప్రమాదమని సలీమ్ హెచ్చరించారు.8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచే వెసులుబాటును ఈ కోడ్లు కల్పిస్తున్నాయని మండిపడ్డారు.
రాజ్యాంగం కల్పించిన సంఘటితమయ్యే హక్కు, నిరసన హక్కు, సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె చేసే అధికారాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు యాజమాన్య భద్రత కవచాలుగా మారడం శోచనియం అన్నారు. లేబర్ కోడ్స్ అమలవుతున్న నేపథ్యంలో దేశంలో పెరిగిన ద్రవ్యల్గుణం, ఇండ్ల అద్దెలు,ఆహార ధరలు, పిల్లల చదువులు, వైద్యం ఖర్చులు కార్మికులకు మోయలేని భారాలైన నేపథ్యంలో కార్మికుల సంఘటితమై తమ బ్రతుకులు మార్చు కొరకు ఈ మేడను ఉద్యమంగా వాడవాడలా గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి మే డే జెండాలను ఎగురవేసి పోరాట స్ఫూర్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో CITU సీనియర్ నాయకులు O యాదగిరి, మండల కన్వీనర్ ఎండి రహీం, హమాలీ యూనియన్ నాయకులు రామావత్ జబ్బార్, రామావత్ రవి, CH ముత్యాలు, రామావత్ వినోద్ వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.
-- * నల్ల వెంకటయ్య*
CITU జిల్లా సహాయ కార్యదర్శి