28/05/2026
శింగర పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 23 సంవత్సరాల కార్తిక్ కుమార్ గారు పుట్టిన రోజు నుంచి శారీరక మానసిక దివ్యాంగులు. ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె రంగ జనార్ధన గారు, శ్రీమతి రామ లక్ష్మీ గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు మరియు ఇరుగు పొరుగు వారు పాల్గొన్నారు.