12/09/2025
మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ నమస్కారం..🙏
కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కత్రం ఆరోగ్య సేవా ప్రాజెక్ట్ విజయవంతంగా కొనసాగుతోందని తెలియజేసేందుకు సంతోసిస్తున్నాము.. మన మొబైల్ ఆసుపత్రి ద్వారా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లోని 40 గ్రామాల్లో ఇప్పటి వరకు మూడు విడతల్లో పర్యటించి పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందించడం జరిగింది. నాలుగో విడత వైద్య సేవలు సోమవారం అనంతగిరి మండలం కొత్తగూడెం తండా నుంచి ప్రారంభంవుతాయని తెలియజేస్తున్నాము. సామాజిక బాధ్యతతో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ కత్రం శ్రీకాంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం ఇదే స్పూర్తితో నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భవిష్యభారత్ సంస్థవారికి, కో-ఆర్డినేటర్ గౌతమ్ గారికి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ మై గారికి (MBBS), ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, యూనిట్ ఆపరేటర్ మరియు మొత్తం భవిష్యభారత్ బృందానికి, జిల్లా వైద్య అధికారి గారికి, మండల ఆరోగ్య అధికారులు, గ్రామ పాలన అధికారులు, గ్రామకార్యదర్శులు, ప్రజాపతినిధులు, ఆయా గ్రామాల పెద్దలు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు..
ఈ కార్యక్రమానికి రూపకర్త, మార్గనిర్దేశకుడు మరియు ఈ వైద్య సేవలకు పూర్తిగా ఆర్థిక సహకారం అందిస్తున్న శ్రీ కత్రం శ్రీకాంత్ రెడ్డి గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
ప్రజలందరూ ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇట్లు
– రామాంజనేయులు బుడిగ
కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధి