Kathram Charitable Foundation - KCF

Kathram Charitable Foundation - KCF Kathram Charitable Foundation is commited to empowering communities through accessible healthcare, quality education, and the promotion of sports.

We strive to build a healthier, educated, and stronger society.

40 గ్రామాల్లో విజయవంతంగా ఐదు విడతల క్యాంపులు పూర్తి చేసుకొని నవంబర్ 19న కొత్తగూడెం తండా గ్రామంతో ఆరవ విడత క్యాంపులు ప్రా...
19/11/2025

40 గ్రామాల్లో విజయవంతంగా ఐదు విడతల క్యాంపులు పూర్తి చేసుకొని నవంబర్ 19న కొత్తగూడెం తండా గ్రామంతో ఆరవ విడత క్యాంపులు ప్రారంభించిన "కత్రం ఆరోగ్య సేవ"..

కత్రం శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో "భవిష్య భారత్" నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ వైద్య సేవలకు సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు "కత్రం చారిటబుల్ ఫౌండేషన్" తరపున ప్రత్యేక ధన్యవాదాలు🙏

భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి జయంతి అయిన నవంబర్ 14న చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో కత్రం చారిటబుల్ ఫౌండేషన...
15/11/2025

భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి జయంతి అయిన నవంబర్ 14న చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..

ఓ నిరుపేద విద్యార్థిని MBBS కలను నిజం చేస్తున్న "కత్రం విద్యా భరోసా"చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన MB...
26/10/2025

ఓ నిరుపేద విద్యార్థిని MBBS కలను నిజం చేస్తున్న "కత్రం విద్యా భరోసా"

చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన MBBS విద్యార్థిని గాలి నవ్యకు నాలుగేళ్ల కళాశాల ఫీజు చెల్లించేందుకు హామీ ఇచ్చి అందులో భాగంగా ఫస్ట్ ఇయర్ ఫీజును లెజెండరీ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బరావుగారి చేతుల మీదుగా అందజేత..

17/10/2025
ప్రజారోగ్య పరిరక్షనే పరమావధిగా సాగుతున్న కత్రం ఆరోగ్య సేవా ప్రయాణం మరో మైలు రాయిని చేరుకుంది...నేరుగా పల్లె వాకిళ్లకే వె...
15/10/2025

ప్రజారోగ్య పరిరక్షనే పరమావధిగా సాగుతున్న కత్రం ఆరోగ్య సేవా ప్రయాణం మరో మైలు రాయిని చేరుకుంది...
నేరుగా పల్లె వాకిళ్లకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న మన "ఉచిత మొబైల్ ఆసుపత్రి" విజయవంతంగా నాలుగో విడత క్యాంపులను పూర్తి చేసుకొని నేడు ఐదో విడత సేవా ప్రయాణానికి సిద్ధమవుతోంది..

30/09/2025

"కత్రం ఆరోగ్య సేవ" 3 నెలలు పూర్తి చేసుకొని, ప్రతీ రోజు విజయవంతంగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహోన్నత కార్యక్రమానికి అండగా నిలిచిన దేవుడికి మరియు నా తల్లికి ముందుగా కృతజ్ఞతలు 🙏. వారి ఆశీస్సులు, దయ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. మీ అందరి సహకారం, ఆశీస్సులు, ప్రోత్సాహమే మాకు కొండంత శక్తి.. ఇకపై కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి మరింత మందికి మా సేవలను చేరవేయాలన్నదే మా సంకల్పం 🙏🙏

నడిగూడెం మండలం శ్రీరంగపురంలో సెప్టెంబరు 25 గురువారం కత్రం ఆరోగ్యసేవ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించడ...
29/09/2025

నడిగూడెం మండలం శ్రీరంగపురంలో సెప్టెంబరు 25 గురువారం కత్రం ఆరోగ్యసేవ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.

మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ నమస్కారం..🙏కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కత్రం ఆరోగ్య సేవా ప్రాజెక్ట్...
12/09/2025

మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ నమస్కారం..🙏

కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కత్రం ఆరోగ్య సేవా ప్రాజెక్ట్ విజయవంతంగా కొనసాగుతోందని తెలియజేసేందుకు సంతోసిస్తున్నాము.. మన మొబైల్ ఆసుపత్రి ద్వారా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లోని 40 గ్రామాల్లో ఇప్పటి వరకు మూడు విడతల్లో పర్యటించి పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందించడం జరిగింది. నాలుగో విడత వైద్య సేవలు సోమవారం అనంతగిరి మండలం కొత్తగూడెం తండా నుంచి ప్రారంభంవుతాయని తెలియజేస్తున్నాము. సామాజిక బాధ్యతతో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ కత్రం శ్రీకాంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం ఇదే స్పూర్తితో నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తున్నాము.

ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భవిష్యభారత్ సంస్థవారికి, కో-ఆర్డినేటర్ గౌతమ్ గారికి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ మై గారికి (MBBS), ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, యూనిట్ ఆపరేటర్ మరియు మొత్తం భవిష్యభారత్ బృందానికి, జిల్లా వైద్య అధికారి గారికి, మండల ఆరోగ్య అధికారులు, గ్రామ పాలన అధికారులు, గ్రామకార్యదర్శులు, ప్రజాపతినిధులు, ఆయా గ్రామాల పెద్దలు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు..

ఈ కార్యక్రమానికి రూపకర్త, మార్గనిర్దేశకుడు మరియు ఈ వైద్య సేవలకు పూర్తిగా ఆర్థిక సహకారం అందిస్తున్న శ్రీ కత్రం శ్రీకాంత్ రెడ్డి గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు.

ప్రజలందరూ ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.


ఇట్లు
– రామాంజనేయులు బుడిగ
కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధి

ప్రజారోగ్య పరిరక్షణకై "మేముసైతం" అంటూ ముందుకు సాగుతున్న "కత్రం ఆరోగ్యసేవలు" ఆగస్టు నెలలోనూ నిరాటంకంగా కొనసాగాయి. ఈ నెలలో...
06/09/2025

ప్రజారోగ్య పరిరక్షణకై "మేముసైతం" అంటూ ముందుకు సాగుతున్న "కత్రం ఆరోగ్యసేవలు" ఆగస్టు నెలలోనూ నిరాటంకంగా కొనసాగాయి. ఈ నెలలో మొత్తం 38 గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 1,320 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం జరిగింది. వీరిలో 405మందికి అవసరమైన రక్త పరీక్షలు సైతం నిర్వహించడం జరిగింది.

అంతేకాకుండా ఆగస్టు నెలలో ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామంలో "తల్లిపాల వారోత్సవం" నిర్వహించి 15మంది బాలింతలకు అవసరమైన కిట్లు అందించాము. అనంతగిరి మండలం గోల్ తండా గ్రామంలో వృద్ధుల దినోత్సవం నిర్వహించి పలువురు వృద్దులకు పండ్లు పంపిణీ చేశాం.. అలాగే కిష్టాపురం గ్రామంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవంలో పాలు పంచుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా "కత్రం చారిటబుల్ ఫౌండేషన్" సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు..🙏

"కత్రం ఆరోగ్యసేవ" ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవంప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా కత్రం చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలోని "క...
21/08/2025

"కత్రం ఆరోగ్యసేవ" ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవం

ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా కత్రం చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలోని "కత్రం ఆరోగ్య సేవా" ఆధ్వర్యంలో అనతగిరి మండలం గోల్ తండా గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి సతీష్ వృద్ధులకు లభించే సంక్షేమ పథకాలను వివరించగా, ఏఎన్ఎం కళ్యాణి వృద్ధుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల గురించి వివరించారు.
కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధి రామాంజనేయులు మాట్లాడుతూ కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. వృద్ధులు సమాజానికి ఇచ్చే అనుభవం, వారి జ్ఞానం నేటి యువతరానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. వృద్ధులను గౌరవిస్తేనే సమాజ బలం పెంచుతుందని తెలిపారు. వృద్ధుల అనుభవం సమాజానికి ఓ ధనం అన్నారు. వారిని ఆదరించడం మనందరి బాధ్యత అన్నారు.
కత్రం ఆరోగ్య సేవా ప్రాజెక్టు వైద్యాధికారి డాక్టర్ కిరణ్ మై (MBBS) మాట్లాడుతూ వృద్ధాప్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. క్రమం తప్పని వైద్య పర్యవేక్షణ అవసరాన్ని వివరించారు. అనంతరం కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రత్యేక అధికారి సతీష్, గ్రామ కార్యదర్శి స్వాతి, ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ మోతిలాల్, ఏఎన్ఎం కళ్యాణి, ఐసీడీఎస్ టీచర్ సుజాత, ఆశా కార్యకర్తలు, కత్రం ఆరోగ్యసేవ బృందం, పీసీ జి. గౌతం రెడ్డి మరియు కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధి రామాంజనేయులు, పలువురు గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.

విజయవంతంగా రెండు నెలలు పూర్తి చేసుకుని మూడో నెలలోకి అడుగు పెడుతున్న  "కత్రం ఆరోగ్యసేవ".. నేటి నుంచి గ్రామాల్లో మూడో విడత...
15/08/2025

విజయవంతంగా రెండు నెలలు పూర్తి చేసుకుని మూడో నెలలోకి అడుగు పెడుతున్న "కత్రం ఆరోగ్యసేవ"..
నేటి నుంచి గ్రామాల్లో మూడో విడత ఆరోగ్య క్యాంపులు ప్రారంభం

Address

Kodada
508206

Website

Alerts

Be the first to know and let us send you an email when Kathram Charitable Foundation - KCF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kathram Charitable Foundation - KCF:

Share