09/08/2025
*లక్ష్య సాధనకు విద్యే ఆయుధం :*
*------- హ్యూమన్ రైట్స్ సొసైటీ*
కల్లూరు :కల్లూరు పట్టణంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు అనుబంధ సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ నేషనల్ మహిళా అధ్యక్షురాలు ఆదూరి మణి అధ్యక్షతన మానవ హక్కులు- చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది.
ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ మానవ హక్కులలో పొందుపర్చిన ఆర్టికల్ 26 ప్రకారం విద్యా హక్కు చట్టం -2009 వచ్చిందని, ఈ చట్టం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్భంద విద్య అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సకల సదుపాయాలను కల్పిస్తుందని, ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ లక్ష్య సాధనకు విద్యను ఆయుధం గా మలచుకోవాలని విద్యార్థులకు సూచించారు. లక్ష్యాలను సాధించే క్రమంలో చెడు అలవాట్లను వదిలివేసి, మంచి అలవాట్లను అలవార్చుకోవాలని కోరారు. చదువుపై ప్రభావం చూపే సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.
ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ జాతీయ అధ్యక్షులు, లీగల్ అడ్వైజర్ ఐ. మహేంద్రనాధ్ మాట్లాడుతూ బాల కార్మిక చట్టం గూర్చి తెలియజేస్తూ 18 సంవత్సరాల లోపు పిల్లలంతా బడిలోనే ఉండాలని, పనిలో ఉండకూడదని అన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిల్లిముంత వెంకటేశ్వరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిలూరి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగుల వెంకటేశ్వరావులు బాలల హక్కులు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మొదలగు వాటిపై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జి పల్లెపాము డేనియల్, హై స్కూల్ ఉపాధ్యాయులు వసంత, అనిత, సత్యం, ఆఫ్జాల్ జాన్, సావిత్రి, అనిత, తులసి, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
*బత్తులపల్లి హై స్కూల్ లో* *హ్యూమన్ రైట్స్ సొసైటీ సదస్సు*
సాయంత్రం 3 గంటలకు బత్తులపల్లి హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు బాలల హక్కులు - చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్ యన్. మధు మరియు స్టాఫ్ పాల్గొన్నారు.