03/06/2024
How jagan revolutionized PDS (Public Distribution System):
✍️ Mohan Talari
***
మీరు పుట్టిన ఊరుకి అంటే అమ్మమ్మ లేదా నానమ్మ ల ఊళ్ళకి దూరంగా ఉంటూ ఎప్పుడన్నా వేసవి కాలం వాళ్ళ ఇళ్లకు వెళితే , మీకు కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలు కనబడుతూ ఉండేవి కొన్ని సంవత్సారల క్రితం.
ఎవరిదైనా కొంచెం పెద్ద ఇంటి అరుగు మీద ఆడవాళ్ళు , కొంచెం ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు చేట లో బియ్యం పోసుకుని చెరుగుతూ, ఏరుతూ ఉండే వాళ్ళు . ఏమి ఏరేసే వాళ్ళు ఆ బియ్యం లో నుంచి
రాళ్ళు , చిన్న చిన్న పెంకులు( Inorganic matter)
వడ్లు (Organic matter)
మాడు గింజలు(Damaged grains)
బాగా పాయ పడిన లేదా పసుపు రంగుకి మారిన గింజలు(Discoloured grains)
కుదిరిన మేర నూకలు(Broken Rice)
నిజానికి government రేషన్ ద్వారా సప్లయ్ చేసిన బియ్యాన్ని ఇలా ఏరుకుని తినవలసిన అవసరం ప్రజలకు ఉండకూడదు. నేరుగా తినేయగలగాలి.
ఎప్పుడు ?
ఆ బియ్యం నాణ్యత FSSAI(FOOD SAFETY AND STANDARDS AUTHORITY OF INDIA) ని అనుసరించి ఉన్నప్పుడు. ఏమిటా నాణ్యతా ప్రమాణాలు ఒకసారి చూద్దాం. ఈ బియ్యం కొనుగోళ్ల సంగతి ఎప్పటి నుంచో చూసుకుంటున్నది FOOD COROPRATION OF INDIA. తెలుగులో భారత ఆహార సంస్థ.
భారత ప్రభుత్వ ఆహార సంస్థ (FCI) కి బియ్యాన్ని డెలివర్ చేసే మిల్లర్, ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.
అతను డెలివర్ చేసే బియ్యంలో నూకలు 25% , damaged grains 3% , discolored grains 3% , Inorganic and organic foreign matter రెండూ కలిపి 1% దాటి ఉండకూడదు. అంతకు మించి ఏ ఒక్కటి 0.1 % దాటి ఉన్నా భారత ఆహార సంస్థ తాలూకూ క్వాలిటి చెకింగ్ ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేస్తారు.
ఈ నంబర్స్ కి ఎలా arrive అయ్యారు అంటే , చాలా మంది పెద్ద పెద్ద సైంటిస్ట్స్ రీసెర్చ్ చేసి ఈ ఈ శాతం వరకూ పైన చెప్పిన నూకలు వగైరా బియ్యంలో కలిసి ఉన్నా, అటువంటి బియ్యాన్ని వండుకు తిన్నప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తవు అని, Cooking quality కి ఇబ్బంది ఉండదు అని నిర్ణయించారు. ఉదాహరణకు, నూకలు అంతకు మించి అంటే ముప్పై శాతం దాటి ఉన్నాయి అనుకోండి అన్నం మొత్తం గంజి అయిపోతుంది. డామేజ్ గింజలు 5% దాటి ఉన్నాయి అనుకోండి అటువంటి అన్నం కడుపు నొప్పికి దారి తీస్తుంది. పాయ పడిన గింజ వల్ల ఎటువంటి నష్టం లేకపోయినా, బియ్యం ఎక్కువ కాలం నిలువ ఉండవు . చూడడానికి కూడా బాగోదు.
*****
సరే ఒకసారి ఇప్పుడు మనం అంబేద్కర్ గారిని తలుచుకుందాం .
భారతీయులని అంబేద్కర్ గారు చెడ్డవాళ్ళు(bad people) అనలేదు . నీచులు(mean people) అన్నాడు. కావాలంటే ఆయన కులనిర్మూలన పుస్తకం చదువుకోండి అందులో ఉంటుంది.
అలా ఆయన ఎందుకు అన్నాడో ఇప్పుడు నేను కింద రాసింది చదివాక మీకు అర్ధం అవుతుంది.
అభివృద్ధి చెందిన దేశాలన్నిటినీ ఒకసారి చూడండి. Food అనేదాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. దేన్ని అయినా భరిస్తారు గానీ food adulteration(ఆహారంలో కల్తీ) ని పొరపాటున కూడా భరించరు . ఎవరైనా చేస్తే భారీగా జరిమానాలు శిక్షలు ఉంటాయి.
కానీ మనం అలా కాదు. నీచులం కదా. జనాల నోట్లోకి పోయే తిండి అన్న సోయ కూడా మనవాళ్లకు ఉండదు.
చదవండి నీరసపడకండి. చచ్చిపోయే ముందు కొన్ని ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి.
2014 లో మోడీ ప్రభుత్వం రాక ముందు చాలా రాష్ట్రాలలో ధాన్యం కొనుగోళ్లు, నిలువ, పంపకాలు అన్నీ భారత ఆహార సంస్థ ( FCI ) చూసుకునేది. అప్పుడు Mill Levy system ఉండేది. అంటే మిల్లుల ఓనర్లు వాళ్ళే పెట్టుబడి పెట్టి , ధాన్యం రైతుల నుండి కొనుక్కుని , ఆడించి ఆ వచ్చిన బియ్యాన్ని FCI కి డెలివరీ చేసేవాళ్ళు. FCI ఆ మిల్లర్లకు ఆ సంవత్సరం ఉన్న MSP(Minimum Support Price) ప్రకారం చెల్లింపులు చేసేది. (మిల్లర్లు మాత్రం ముష్టి రైతుల మొహం మీద పాడేసేవారు అది వేరే టాపిక్). FCI ఆ ధాన్యాన్ని తన దగ్గర నిలవ ఉంచి దేశం మొత్తం మీద ఎక్కడ ఏ రాష్ట్రానికి అవసరమైతే ఆ రాష్ట్రాలకు సరఫరా చేసేది రకరకాల సబ్సిడీ లు ఇస్తూ. ఆయా స్టేట్ గవర్నమెంట్ లు మళ్ళా కొంత భారం వాళ్ళ మీద పెట్టుకుని అతి తక్కువ ధరకి జనాలకు బియ్యం ఇచ్చేవి. అవే రెండు రూపాయల బియ్యం , రూపాయి బియ్యం. ఈ వ్యవహారం మొత్తం పూర్తిగా service తో కూడుకున్నది కాబట్టి , గవర్నమెంట్స్ కి కొన్ని కోట్లు దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. అందుకే ఎఫ్సిఐ ని white elephant అని అంటారు.
ఇక్కడే మీరు మన భారతీయుల meanness ఏమిటన్నది తెలుసుకోవాలి.
ఎడారిలో తైలం పిండే మన భారతీయులు ఈ మొత్తం బియ్యం సరఫరా ప్రాసెస్ లో దారుణమైన అక్రమాలకు తెగబడతారు. దందా ఒక దురాశ పరుడైన fci అధికారి దగ్గర మొదలవుతుంది. 25% లోపు ఉండవలసిన నూకలు దాటి ఉన్నాయి అనుకోండి. క్వాలిటి ఇన్స్పెక్టర్ దాన్ని రిజెక్ట్ చెయ్యాలి . కానీ చేయడు . మిల్లు ఓనర్ తో భేరం పెట్టుకుంటాడు. ఒక మూడు శాతం ఎక్కువ ఉన్నాయి అనుకోండి నూకలు, దానికి పాతిక నుండి ముప్పై వేలు భేరం పెట్టుకుంటాడు. సైలెంట్ గా గోడౌన్ లోకి పంపేస్తాడు . ofcourse పై అధికారుల inspections లో పట్టుబడితే తొక్క తీస్తారు. కానీ ఈ క్రిమినల్స్ కి దొరకకుండా ఏం చేయాలో తెలుసు.
ఇప్పుడు ఈ బియ్యాన్ని Andhra Pradesh state civil supplies వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం అంటే జనాలకు రేషన్ ఇవ్వడానికి FCI దగ్గర తీసుకుంటారు. Civil supplies వాళ్ళ godowns లోకి వెళ్ళిన తరువాత 28 % ఉన్న నూక 35 శాతానికి పెరుగుతుంది. 1 % ఉన్న రాళ్ళు పెంకులు 3 శాతానికి పెరుగుతాయి. తరువాత Civil supplies godown నుంచి ఏదో ఒక ఊరు రేషన్ షాపుకి ఈ బస్తాలు వెళతాయి. నాకు తెలిసినంత వరకు వెనుకటి రోజుల్లో రేషన్ షాపులు ఊళ్ళో బాగా పలుకుబడి ఉన్న కోమటోళ్ల కంట్రోల్ లో ఉండేవి. పైన అంతమంది తిన్నాక , ఈయన మాత్రం తినకుండా ఉంటాడా పాపం. ఆయన దగ్గర 35% నుంచి నూక 40 శాతానికి పెరుగుతుంది. రాళ్ళు రప్పలు ఇంకో శాతం పెరుగుతాయి. ఇది చాలదన్నట్టు తూకాలలో అవకతవకలు , కాటాలకు చింతపండు అంటించడాలు చాలా మామూలు విషయాలు. సో చివరికి జనాలకు ఏ క్వాలిటీ బియ్యం చేరుతున్నాయో అర్ధమైంది కదా. ఇదేంటి ఇలా ఉన్నాయి అని వాళ్ళు ప్రశ్నించరు అన్న ధైర్యమే ఈ పై వాళ్ళ అక్రమాలకు ఆయువు పట్టు.
2014 తరువాత Mill Levy system పోయింది. ఏ మాత్రం లాభం లేకపోగా బోలెడంత నష్టం తెచ్చి పెడుతున్న ఎఫ్సిఐ భారాన్ని మోడీ ప్రభుత్వం తగ్గించుకోవాలని నిర్ణయించుకుని De centralization మొదలుపెట్టింది. అంటే ధాన్యాన్ని పండించే రాష్ట్రాలు వాటి కొనుగోళ్లు , అమ్మకాల సంగతి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి అని చెప్పింది. వాళ్ళు కొనగా కొనగా ఇంకా ఏదన్నా మిగిలిపోతే దాన్ని ఎఫ్సిఐ తీసుకుంటుంది. అంటే ఇప్పటి నుంచి భారత ఆహార సంస్థ ది ఒక పర్యవేక్షకుడి పాత్ర మాత్రమే.
ఈ క్రమంలో Mill Levy system స్థానే CMR(Custom Milled Rice) system వచ్చింది. ఈ పద్దతిలో ఏమిటంటే , మిల్లర్లు ధాన్యం కొనడానికి పెట్టుబడి పెట్టవలసిన పని లేదు. మొత్తం ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి నేరుగా ప్రభుత్వమే కొంటుంది.( దీని వల్ల మధ్యలో ఉండే దళారి, లేదా మిల్లర్ రైతును మోసం చేసే అవకాశం కాస్త తగ్గుతుంది). ఆ ధాన్యాన్ని మిల్లర్ ఆడి వచ్చిన బియ్యాన్ని state civil supplies కి గానీ, వాళ్ళ పరిమితి దాటితే FCI కి గానీ ఇవ్వాలి. 2014 లో బాబు గారి ప్రభుత్వంలో కొత్తగా ఈ సిస్టమ్ మొదలయ్యాక జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పటి నుంచో ఆకలితో ఎదురు చూస్తున్న civil supplies వాళ్ళు దొరికిన కాడికి మేసేశారు . fci లో నేరం చేయడం అంత సులువు కాదు. బోలెడు inspections ఉంటాయి. కానీ civil supplies వాళ్ళను అడిగే వాడు లేడు. నూకలు మినిమం ముప్పై శాతం . డామేజ్ గింజలు అయిదు నుంచి ఏడు శాతం చొప్పున కొనేసి అవే జనాల మొహం మీద పాడేశారు. బియ్యం బదులు చాలా చోట్ల అచ్చంగా నూకల బస్తాలు కొనేశారు అన్న వార్తలు కూడా చెవుల పడ్డాయి. అవే జీవనాధారం అయిన వాళ్ళు తిన్నారు. తినలేని వాళ్ళు అమ్మేసుకున్నారు.
Rice Bowl of South India అయిన ఆంధ్రా లో పుట్టి ఆ వరి చేలల్లో పని చేసి పంటలు పండించిన పేదలకు నాణ్యమైన బియ్యం తినే దిక్కులేని పరిస్థితి కి పాలకులు దిగజార్చేశారు. ప్రభుత్వానికి ఇచ్చేదే ఎగుమతికి , ఓపెన్ మార్కెట్ కి పనికి రాని 1001 , 1016 లాంటి లావైన బియ్యం . అందులో కూడా మళ్ళా ఇన్ని రకాల కల్తీ. మోసం.
2019 లో జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో నాణ్యమైన రేషన్ బియ్యం, అది కూడా సన్న బియ్యం ఇవ్వడం ఒకటి. ప్రభుత్వం ఏర్పాటు కాగానే మిల్లర్స్ అందరికీ strict warnings ఇచ్చారు. ఎవరు తోక జాడించినా జీవితంలో మిల్ తెరవకుండా చేస్తామని హుకుం జారీ చేశారు. FSSA, FCI వాళ్ళ లిమిట్స్ కూడా కాదనుకుని కొత్తగా JAGAN LIMITS పెట్టారు.
కొత్తగా పెట్టిన లిమిట్స్ ప్రకారం నూకలు 15 % దాటి ఉండరాదు. డామేజ్ గింజలు 1% దాటి ఉండరాదు. Discolor గింజలు 1% దాటి ఉండరాదు. గత అయిదేళ్లుగా state civil supplies ఇవే లిమిట్స్ తో రైస్ procurement( కొనుగోళ్లు) చేస్తుంది. మనవాళ్ళ meanness(నీచత్వం) అంత త్వరగా పోయేది కాదు. ఇంకా అక్కడక్కడా కొంతమంది తోక జాడిస్తూనే ఉన్నారు. ఈసారి వచ్చాక అవన్నీ పూర్తిగా కత్తిరించబడతాయి.
రేషన్ షాపుల్లో చింతపండు వేషాలు వెయ్యకుండా, ఎండలో జనాన్ని లైన్లో నిలుచోబెట్టి ప్రభుత్వం ఇచ్చే దాన్ని వాడి ఇంటి సొమ్ము ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే వాళ్ళ మూతి మీద వాత పెట్టి బియ్యాన్ని నేరుగా ఇంటికే పంపించడం పేదవాడి కి ఈ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అని భావిస్తున్నాను నేనైతే. జనాల ముందే నిక్కచ్చిగా కొలిచి ఇస్తున్నారు . చెప్పండి ఇందుకు కాదూ ఈనాడు లక్షల ఆస్తి ఉన్నా తెల్ల రేషన్ కార్డ్ ఉన్న కమ్మ , కాపు , బ్రాహ్మణ , రెడ్డి గార్ల ఇల్లాళ్ళు చక్కగా లైన్లో నిలబడి మరీ బియ్యం తీసుకుంటుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా వీళ్ళు రేషన్ షాపుల ముందు లైన్లలో నిలబడ్డారా?
బియ్యం ఇచ్చి సోమరి పోతుల్ని చేస్తున్నారు లాంటి అరమెదడు కామెంట్స్ తో రాకండి .
ఫైనల్ గా ఒక్క మాట.
వీటిని పేదల Vs పెత్తందార్ల ఎలక్షన్లు అని ఎందుకు అంటున్నారో ఇప్పటికీ మీకు అర్ధం కాకపోతే , అంత చింతపండు నవరంధ్రాలలో కుక్కుకుని ...... డి.