Akshara Foundation

Akshara Foundation We believe all lives have equal value. it is the foundation for poor & needy . Join our community at https://www.facebook.com/realstarinreallife

The Akshara Foundation maintains this page to provide a forum for sharing research, ideas, and opinions regarding our philanthropic work. All statements and materials posted by contributors reflect the views of the individual contributors and also reflect the views of the Akshara foundation. We encourage respectful, constructive dialogue and reserve the right to remove posts that are offe

nsive, act as advertisements, or attempt to solicit funds from our fans. We also remove identical or substantially similar comments that are posted more than once, including those posted for the purpose of monopolizing the discussion. We value conversations on our Facebook space, and thank you for following the foundation.

07/05/2026

*లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి.*

➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప
➖ కూలీలతో పాటు అందరు అర్హులే.
➖ వైట్ రేషన్ కార్డు తప్పని సరి.
➖ ఏడాదికి రూ 22 మాత్రమే.
_. 5 ఏళ్లకు ఒకేసారి చెల్లించాలి. కేవలం 110/-రూ.. మాత్రమే
➖ అవగాహన పెంచుకుందాం
➖ అందరికీ చేరేలా చేయండి

1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు.

2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప, వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారు ఎవరైనా ఇందులో చేరవచ్చు.

3) రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీలు జత చేయాలి

4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

*ప్రయోజనాలు:*

5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/- రూపాయలు ఇన్సూరెన్స్.

6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం సంభవిస్తే రూ.6,00000/- రూపాయలు.

7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ కానుకగా 30,000/-రూ.

ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.

9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది కేవలం సంవత్సరానికి 22/- రూపాయలు మాత్రమే.

ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.
కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్)MPDO/MRO లను సంప్రదించండి.

చివరగా ఒక్క మాట. చాలా మంది
ఈ పథకం గురించి సరైన అవగాహన లేక .... కార్మికులు మాత్రమే దీనిలో చేరవచ్చని అనుకుంటున్నారు. కానే కాదు. వైట్ రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే...

04/05/2026
22/04/2026

Megastar Chiranjeevi

అవకాశం ఇస్తే మీ మెరిట్ మై ఫుట్ అంటారు!పేదింటి విద్యా కుసుమం.. జిల్లా ఫస్ట్..!సింగరాయకొండలోని ఏఆర్సీ & జీవీఆర్ ప్రభుత్వ జ...
18/04/2026

అవకాశం ఇస్తే మీ మెరిట్ మై ఫుట్ అంటారు!

పేదింటి విద్యా కుసుమం.. జిల్లా ఫస్ట్..!

సింగరాయకొండలోని ఏఆర్సీ & జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి కత్తి కిరణ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం MPC విభాగంలో 1000లో 975 మార్కులు సాధించి, ప్రకాశం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రథమ స్థానం సాధించాడు.

పేద కుటుంబానికి చెందిన కిరణ్ తండ్రి శ్రీను, తల్లి శ్రీలక్ష్మి హైదరాబాదులో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కిరణ్ మాత్రం సింగరాయకొండలో తన నాయనమ్మ సుబ్బులమ్మ వద్ద సోదరి పల్లవితో కలిసి ఉండి చదువుకుని ఈ విజయాన్ని సాధించడం విశేషం.

ప్రతిరోజూ అన్నాచెల్లెళ్లు కలిసి వంట చేసుకుని కాలేజీకి నడిచి వెళ్లడం, చదువుపై పూర్తి దృష్టి పెట్టడం కిరణ్ కృషికి నిదర్శనం. అతనికి 100% హాజరు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఇంటర్ మొదటి సంవత్సరంలో 460 మార్కులు, పదో తరగతిలో 540 మార్కులు సాధించిన కిరణ్, ఇప్పుడు 975 మార్కులతో తన ప్రతిభను మరింతగా నిరూపించాడు.

కిరణ్ సాధించిన ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సౌజన్య, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. పేదరికాన్ని జయించి సాధించిన ఈ విజయం, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

రాజనీతిజ్ఞుడు అహింస దురంధరుడు "కాకాని వెంకటరత్నం"దురదృష్ట వశాత్తూ కాకాని లాంటి వ్యక్తులు ఆదర్శంగా ఉండాల్సింది పోయి.   19...
18/04/2026

రాజనీతిజ్ఞుడు అహింస దురంధరుడు "కాకాని వెంకటరత్నం"

దురదృష్ట వశాత్తూ కాకాని లాంటి వ్యక్తులు ఆదర్శంగా ఉండాల్సింది పోయి.


1980 కి ముందు బెజవాడ లో పచ్చగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, ఒకరి ఉన్నతి లో మరొకరు సహకరించుకుంటూ సన్మార్గంలో నడిచారు, సమాజాన్ని శాంతియుత వాతావరణం లో నడిపించారు..



కాకాని లాంటి వ్యక్తి అస్తమయం

కాకాని వెంకటరత్నం గారు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక అజేయమైన శక్తిగా ఎదిగారు.

ఆయన నాయకత్వం కేవలం పదవులకు పరిమితం కాకుండా, ప్రజల హృదయాల్లో "ఆంధ్ర ఉక్కుమనిషి" (Iron Man of Andhra) గా ముద్ర వేసుకుంది.

ఆయన రాజకీయ ప్రస్థానం స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోనే ప్రారంభమైంది

1923లో విజయవాడలో జరిగిన చారిత్రాత్మక కాంగ్రెస్ సభలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ సభకు గాంధీజీ స్వయంగా హాజరయ్యారు, తర్వాతి కాలంలో ఆ ప్రదేశానికి "గాంధీ నగర్ మున్సిపల్ గ్రౌండ్స్" అని పేరు వచ్చింది.

గాంధీజీ ఆకునూరు గ్రామాన్ని సందర్శించినప్పుడు, ఆయన వెంట ఉండి పర్యటనను విజయవంతం చేసిన ఘనత కాకాని గారిది. ఖాదీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆయన కృషి చిరస్మరణీయం.

వ్యవసాయ మరియు పాడి పరిశ్రమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు
కాకాని వెంకటరత్నం గారిని కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక దార్శనికుడిగా పరిగణించాలి.

కృష్ణా జిల్లాలో పాడి పరిశ్రమ మరియు వ్యవసాయం నేడు ఈ స్థాయిలో ఉన్నాయంటే దానికి ఆయన వేసిన పునాదులే కారణం..

కృష్ణా జిల్లాలో పాడి రైతులను మధ్యవర్తుల దోపిడీ నుండి రక్షించడానికి ఆయన సహకార రంగాన్ని బలోపేతం చేశారు.

నేడు మనం చూస్తున్న "సంగం డెయిరీ" ఆవిర్భావంలో ఆయన పాత్ర కీలకమైనది. కృష్ణా, గుంటూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల పాడి రైతుల విరాళాలతో భూమిని సేకరించి,

దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి పాలు పొడి చేసే కర్మాగారాన్ని (Milk Powder Factory) విజయవాడలో స్థాపించడంలో ఆయన అగ్రభాగాన నిలిచారు.

ఈ కర్మాగారం నేడు ఆయన పేరుతోనే (కాకాని వెంకటరత్నం మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ) పిలువబడుతోంది.

ఆయన కృషి వల్ల పాడి పరిశ్రమ ఒక వ్యవస్థీకృత రంగంగా మారి, వేలాది మంది గ్రామీణ రైతులకు జీవనోపాధిని కల్పించింది.

అందుకే ఆయనను "అజాత శత్రువు" అని, గ్రామీణ ప్రజల పక్షపాతి అని కొనియాడుతారు..

జై ఆంధ్ర ఉద్యమం మరియు కాకాని గారి త్యాగం
1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముల్కీ నిబంధనల వివాదంతో అట్టుడుకుతున్న సమయంలో కాకాని వెంకటరత్నం గారు జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు.

ఈ ఉద్యమం కేవలం రాజకీయ పదవుల కోసం కాకుండా, కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సాగింది.

సమాంతర ప్రభుత్వం మరియు రాజకీయ సంక్షోభం
ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించడంతో, ఆంధ్ర ప్రాంత నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అప్పటి పి.వి. నరసింహారావు ప్రభుత్వం నుండి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులందరూ రాజీనామా చేశారు.

కాకాని వెంకటరత్నం గారు ఈ తిరుగుబాటుకు ప్రధాన సూత్రధారిగా నిలిచారు.

విజయవాడ కేంద్రంగా ఒక "సమాంతర ప్రభుత్వం" (Parallel Government) ఏర్పాటైంది, ఇందులో బి.వి. సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిగా, కాకాని వెంకటరత్నం గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది

1972 డిసెంబర్ 24న విజయవాడలో సమైక్యవాదులు మరియు ప్రత్యేక రాష్ట్ర వాదుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మక రూపం దాల్చాయి.

పోలీసుల కాల్పుల్లో ఎనిమిది మంది యువకులు మరణించారు. ఈ వార్త విన్న కాకాని వెంకటరత్నం గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

తన కళ్ళముందే యువత ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు.

ఆ బాధతోనే 1972 డిసెంబర్ 25 తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.

కాకాని గారు వ్యవస్థలను నిర్మిస్తే,

కాకాని వెంకటరత్నం గారు స్థాపించిన సంగం డెయిరీ మరియు మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ నేటికీ వేలాది మందికి అన్నం పెడుతున్నాయి.

ఆయన స్మారక చిహ్నాలు నేటి రాజకీయ నాయకులకు ఒక దిక్సూచిగా నిలుస్తున్నాయి.

నేటి తరం రాజకీయాల్లో ఈ ఫ్యాక్షన్ ధోరణులు తగ్గినప్పటికీ, ఆ నాటి కుల సమీకరణలు మరియు ముఠా తగాదాల నీడలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.

ఈ నాడు పవన్ కళ్యాణ్ లాంటి నికార్సైన నాయకుడు తెలుగుదేశానికి తోడు అవ్వ బట్టే..

తరాల వైరం తగ్గింది అని చెప్పక తప్పదు.. సమాజంలో విలువలు పెంచుకోవాలి.. విధేయత అలవర్చుకోవాలి

కాకాని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి..

Happy Birthday Shanti sree Hari Garu
16/04/2026

Happy Birthday Shanti sree Hari Garu

సంక్షోభంలో ఆదుకుంటున్న స్నేహ హస్తం...!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్‌కు చమురు ఇబ్బంది...
09/04/2026

సంక్షోభంలో ఆదుకుంటున్న స్నేహ హస్తం...!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్‌కు చమురు ఇబ్బంది లేకపోయినా, గ్యాస్ పరంగా కొంత సమస్య ఎదురైంది.

మనకు గ్యాస్ అందించే ప్రధాన దేశమైన 'ఖతార్'లో ప్రస్తుతం ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించగా.. నైజీరియా, అల్జీరియా, అంగోలా, కెమరూన్, ఈక్వటోరియల్ గినియా, మరియు మొజాంబిక్ వంటి ఆఫ్రికా దేశాలు అండగా నిలిచాయి. భారత ప్రభుత్వంతో యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ సరఫరా ఒప్పందాలు జరిగాయి. త్వరలోనే లక్షల టన్నుల గ్యాస్ భారత్‌కు చేరుకోనుంది.

ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన అడ్డంకులు ఈ మార్గానికి లేవు, కాబట్టి సరఫరా నిరంతరాయంగా సాగుతుంది.

ఒక్కసారి గతాన్ని గుర్తుచేసుకోండి.. 'ఆపరేషన్ సంజీవని', 'వ్యాక్సిన్ మైత్రి' ద్వారా భారత్ కరోనా సమయంలో ఇదే ఆఫ్రికా దేశాలకు మందులు, వ్యాక్సిన్లు పంపి లక్షలాది ప్రాణాలను కాపాడింది.

అప్పట్లో "మనకెందుకు ఈ లోకకళ్యాణం?" అని కొందరు ప్రశ్నించారు. కానీ, "మనం చేసే సాయం వృథా పోదు" అని నేడు నిరూపితమైంది. మనం ఆనాడు చూపిన ఉదారత, ఈనాడు మనకు గ్యాస్ రూపంలో రక్షణ కవచమై నిలిచింది.

కేవలం గ్యాస్ మాత్రమే కాదు.. భవిష్యత్తుకు అవసరమైన రేర్ ఎర్త్ మెటీరియల్స్, సిలికాన్, పెట్రోలియం వంటి వాటి కోసం కూడా భారత్ ఇప్పటికే ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలతో బలమైన ఒప్పందాలు చేసుకుంది.

కష్టకాలంలో అండగా నిలుస్తున్న మిత్రదేశాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏

భారత్ మాతా కీ జయ్

హెడ్ కానిస్టేబుల్ రేవతి … సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరి శిక్ష పడటానికి కారణమైన కీలక స...
08/04/2026

హెడ్ కానిస్టేబుల్ రేవతి … సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరి శిక్ష పడటానికి కారణమైన కీలక సాక్షి ❤️

ఒక సందర్భంలో మనసాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం రేవతి .

సంఘటన జరిగిన తర్వాత స్టేషన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే — జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చాలి… ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి.

ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్నే సేఫ్‌గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు ఆమెకి అది కేవలం డ్యూటీ విషయం కాదు… తన కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత.

తోటి సిబ్బంది ఒకవైపు… పై అధికారుల ఒత్తిడి మరోవైపు… ఇలాంటి పరిస్థితిలో నిలబడటం అనేది చిన్న విషయం కాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు… ఆ రాత్రి జరిగిన వాస్తవానికి మొదటి స్పష్టమైన రూపం.

పోలీసులు స్టేషన్‌ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసినా, ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మేజిస్ట్రేట్‌కు చూపించారు.

ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి.

సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినా, ఆమె తన జ్ఞాపకశక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తుకు దిక్సూచిలా నిలిచారు.

ఇది సాధారణ విషయం కాదు. అదే వ్యవస్థలో ఉండి, అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం అంటే చాలా పెద్ద నిర్ణయం. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు.

ఆమె చెప్పిన విషయాల ఆధారంగా కేసు బలపడింది. కోర్టు కూడా ఆమె భద్రతపై దృష్టి పెట్టి ప్రత్యేక రక్షణ కల్పించింది. అది ఆమె చెప్పిన నిజానికి వచ్చిన గుర్తింపు.

రేవతి చేసిన పని గొప్పగా చూపించాల్సిన అవసరం లేదు. ఆమె చేసింది చాలా సింపుల్ — జరిగినదాన్ని దాచలేదు.
కానీ అదే సమయంలో చాలా మంది చేయలేని పని అదే.

సాత్తాన్‌కుళం కేసులో న్యాయం జరగడానికి కారణాలు చాలా ఉండొచ్చు…

కానీ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు ఒక్కటే — రేవతి.

హ్యాట్సాఫ్ హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు ❤️❤️🙏👌

గౌరవ ముఖ్యమంత్రి  అన్నదాన పథకం గురించి మీరు పేర్కొన్న విషయాలు బాగున్నాయి. కానీ, ఈ పథకానికి అంకురార్పణ చేసిన అసలైన వ్యక్త...
07/04/2026

గౌరవ ముఖ్యమంత్రి అన్నదాన పథకం గురించి మీరు పేర్కొన్న విషయాలు బాగున్నాయి.

కానీ, ఈ పథకానికి అంకురార్పణ చేసిన అసలైన వ్యక్తి 'లక్కిశెట్టి వెంకట రామయ్య' (L.V. Ramaiah) గారి పేరును కూడా మీరు ప్రస్తావించకుండా

1985లో భక్తుల కష్టాలను చూసి చలించి, కంచి స్వామివారి ఆశీస్సులతో ఈ పథకాన్ని రూపకల్పన చేసి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని ఒప్పించింది లక్కిశెట్టి వెంకట రామయ్య గారే. ఆనాడు ఆయన తన సొంత సొమ్ము ₹10 లక్షలు (నేటి విలువ ప్రకారం దాదాపు ₹8 కోట్లు) తొలి విరాళంగా ఇచ్చి ఈ బృహత్తర కార్యానికి పునాది వేశారు.

వ్యవస్థను నడిపిన వారిని గౌరవిస్తూనే, ఆ వ్యవస్థకు ప్రాణం పోసిన దాత చరిత్రను మరుగున పరచడం సరికాదు. ఇప్పటికైనా ఆయన సేవలను గుర్తించాలని వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నాను, అన్యదా భావించ వద్దు 🙏

పోరాడి గెలిచిన మూడ అడుగుల డాక్టర్  !మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలం అని మరోసారి రుజువు అయింది. వ్యవస్థ పై పోరాడి ఓ మూడు...
20/12/2025

పోరాడి గెలిచిన మూడ అడుగుల డాక్టర్ !
మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలం అని మరోసారి రుజువు అయింది. వ్యవస్థ పై పోరాడి ఓ మూడు అడుగుల వ్యక్తి ఏకంగా డాక్టర్ అయిపోయాడు. దీంతో గుజరాత్ కు చెందిన డాక్టర్ గణేష్ బరయ్య పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పట్టుదల ఉంటే, ఎత్తు ఏ మాత్రం అడ్డంకి కాదని ఈ మూడు అడుగుల డాక్టర్ గణేష్ బరయ్య నిరూపించాడు. మనం అనుకున్నది సాధించాలనే పట్టుదలతో కృషి చేస్తే, కొండను కూడా పిండి చేయగలమని డాక్టర్ గణేష్ బరయ్య సక్సెస్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది.

2004 సంవత్సరంలో డాక్టర్ గణేష్ బరయ్య గ్రోత్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అయిందట. దీంతో అతడు పుట్టడంతోనే ఎత్తు మూడు అడుగులే పెరిగారు. ఈ నేపథ్యంలో నీట్ లో మంచి మార్కులు సాధించినా, గణేష్ కు సీట్ ఇచ్చేందుకు కౌన్సిల్ మాత్రం అంగీకరించలేదు. దీంతో అతను ఎక్కడ కూడా నిరాశ చెందకుండా... హైకోర్టు మెట్లు ఎక్కారు. అక్కడ కేసు ఓడిపోతే, సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. చివరికి 2019 సంవత్సరంలో గణేష్ బరయ్య కేసు గెలిచి, బావ్ నగర్ లో MBBS సీటు సంపాదించారు. ఇక ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్నారు. గణేష్ డెర్మటాలజిస్ట్ కావాలని అనుకుని, మొత్తానికి త‌న 23 ఏళ్ల వ‌య‌స్సులో డాక్ట‌ర్ అవ‌తారం ఎత్తారు.

The Akkineni family donated Rs 2 crore to ANR College in Gudivada, Andhra Pradesh, to fund scholarships for deserving st...
19/12/2025

The Akkineni family donated Rs 2 crore to ANR College in Gudivada, Andhra Pradesh, to fund scholarships for deserving students during the ANR college's 75-year celebrations.

King Nagarjuna, honored his late father Akkineni Nageswara Rao, who founded the college and gave generously despite modest film earnings. He reflected on ANR's love for learning and commitment to education, echoing that good deeds create lasting legacies.

Address

Plot No 1045 , Jublie Hills Road No-45
Hyderabad
520000

Alerts

Be the first to know and let us send you an email when Akshara Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Akshara Foundation:

Share