04/02/2026
*సమ్మక్క–సారలమ్మ తల్లుల జాతర ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు – అది తల్లితనం, త్యాగం, ప్రజల శ్రేయస్సు కోసం జరిగే మహా పండుగ.*
ఇటీవల జరిగిన సమ్మక్క–సారలమ్మ జాతరలో లక్షలాది మంది భక్తులు తల్లులపై అపారమైన భక్తితో “బంగారం” సమర్పించారు.
కానీ ఆ బంగారం నిజానికి లోహం కాదు – *భక్తి,విశ్వాసంతో *సమర్పించిన బెల్లం*.
ఈ బెల్లం తల్లుల పాదాల వద్ద పెట్టబడింది అంటే,దాని అర్థం-
“ఇది ప్రజల క్షేమానికి ఉపయోగపడాలి” అన్న భక్తుల ఆకాంక్ష.
ఈరోజు మన రాష్ట్రంలోని అనేక *సర్కారు బడులలో చదువుకునే చిన్నారులు, ముఖ్యంగా బాలికలు రక్తహీనత (అనీమియా) సమస్యతో* బాధపడుతున్నారు.
బలహీనత, అలసట, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి.
అలాంటి సమయంలో,
*భక్తితో సమర్పించిన బెల్లం – పోషకాహారంగా మారి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందితే, అది తల్లుల ఆశీర్వాదంగా సమాజ సేవగా మారుతుంది.*
👉 భక్తుల భక్తి వృథా కాకుండా,
👉 తల్లుల జాతర ఆత్మను నిలబెట్టేలా,
👉 పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడేలా…
*సమ్మక్క–సారలమ్మ జాతరలో సమర్పించిన బెల్లాన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయాలని ఇది ఒక వినమ్ర విజ్ఞప్తి.*
ఇది దానం కాదు,
ఇది ధర్మం.
ఇది రాజకీయ విషయం కాదు,
ఇది ప్రజారోగ్యం, భవిష్యత్తు తరం విషయం.
• తల్లుల ఆశీర్వాదం పిల్లల ఆరోగ్యంగా మారాలి.. భక్తి, సేవగా మారాలి 🙏
వందేమాతరం ఫౌండేషన్ ఆలోచనకు మద్దతుగా ఈ సందేశాన్ని అందరికీ చేరవేయండి.