02/01/2026
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవి 25 వ వర్ధంతి సందర్భంగా సిఆర్ ఫౌండేషన్ నివాళి:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవి 25 వ వర్ధంతి సందర్భంగా సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా సంక్షేమ కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె పోరాట పటిమను స్మరించుకుంటూ:
ఆరుట్ల కమలాదేవి బర్కత్ పురాలోని రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డి మహిళా కళాశాలలో మొదటి విద్యార్థిని గా ఆనాడు బాలికలకు హాస్టల్ వసతి కోసం పోరాటం చేసి వైఎంసి వద్ద ఉన్న ఉమెన్స్ హాస్టల్ను ఏర్పాటు చేయడం కోసం పోరాటం చేశారని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణలో స్వాతంత్రం రాకపోవడంతో భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చిన సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి తుపాకి పట్టుకొని పాల్గొన్నారు అని తెలిపారు. మొదటి శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నుంచి ఎన్నికయ్యారని తెలిపారు.సిపిఐ శాసనసభ పక్షా నేతగా పనిచేశారని అన్నారు. భారత జాతీయ మహిళా సమైక్య నాయకురాలుగా అనేక మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించాలని తెలిపారు. ఆరుట్ల కమలాదేవి ఆశయాలను సాధించడం కోసం మనందరం కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సి ఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షులు కంభంపాటి అజయ్, కోశాధికారి-వృద్ధాశ్రమం డైరెక్టర్ వి• చెన్నకేశవరావు , మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ జోస్యభట్ల కల్పన, అడ్వైజర్ ఉష,
సిఆర్ పాలీక్లినిక్ డైరెక్టర్ డాక్టర్ కె రజిని, మహిళా సమాఖ్య నాయకురాలు శ్రీమతి ప్రేమ పావని, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సి పి ఐ నాయకులు కామ్రేడ్ సంజీవ్,
సభ్యులు, లలిత, వంకా లక్ష్మి , వృద్ధాశ్రమ వాసులు, హోమ్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.