17/06/2026
తేదీ : 16- 06 - 2026
దోపిడీ, అసమానతల యొక్క పునాదిని ప్రశ్నించే ఉద్యమ నిర్మాతల్లో సుగుణ ఒకరు .
నిరంకుశ నిజాం సైన్యం, రజాకార్లుకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు శాఖమూరి సుగుణ ధైర్యం చాలా గొప్పదని, దోపిడీ, అసమానతల యొక్క పునాదిని ప్రశ్నించే ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు సుగుణమ్మ అని, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కీర్తిశేషులు ఎస్ వి కె ప్రసాద్ భార్య శ్రీమతి సుగుణ త్యాగాలను స్మరించు కున్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, మహిళాసమాఖ్య, కమ్యూనిస్టు నాయకురాలు శాఖమూరి సుగుణ ప్రథమ వర్ధంతి సందర్భంగా శాఖమూరి సుగుణ చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
సుదీర్ఘ కాలం సి ఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం లో నివసిస్తూ గతసంవత్సరం ఇదే రోజు శ్రీమతి సుగుణమ్మ కన్నుమూశారు. శ్రీమతి సుగుణమ్మ మరియు వారి కుటుంబసభ్యులు సి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కార్యకలాపాలకు ఎంతగానో దోహదం చేశారని వారి సహకారాన్ని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సి ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కె. అజయ్ కుమార్, కోశాధికారి చెన్నకేశవరావు, ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె రజిని, శ్రీమతి సుగుణమ్మ కుటుంబసభ్యుల తరఫున ఏ. కె. జిలానీ,
వృద్ధాశ్రమ సలహా కమిటీ సభ్యులు తమ్మారెడ్డి తాన్య, యన్. రాజేంద్ర రావు, మల్లంపాటి వెంకటేశ్వర రావు, సాంబశివ రావు, అరుణకుమారి, మహిళాసంక్షేమ కేంద్రం సభ్యులు వి లలిత, వృద్ధాశ్రమ వాసులు, విద్యార్దినిలు, తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.