29/07/2025
రేణుక, మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మొదటి కాన్పు అయ్యింది. కాన్పు సక్రమంగా జరిగి పాప పుట్టి, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ రేణుకకు పాలు సరిగా రాకపోవడంతో పాపకు తల్లిపాలు ఇవ్వలేకపోతున్నానని బాధపడుతూ ఉండేది. అప్పుడు వైద్యుల సలహా మేరకు Dhaatri Mother's Milk Bank ను సంప్రదించమని చెప్పగా, ఆమె మిల్క్ బ్యాంక్ ను సందర్శించి, లాక్టేషన్ కౌన్సిలర్లను సహాయం కోరారు. అక్కడ కౌన్సిలర్లు రేణుక పరిస్థితిని అర్థం చేసుకొని కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఆమెకు మసాజ్ చేస్తూ, పంపింగ్ పెట్టినా కూడా మొదటి రోజు ప్రయోజనం లేకపోయింది. రేణుకను ఎక్కువగా నీరు తీసుకోవాలని, తేలికగా జీర్ణమయ్యే విధంగా ఆహారాన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకోవాలని, అలాగే పాపకు పాలు ఇవ్వడం కూడా ప్రయత్నించమని చెప్పారు. అలా ప్రతిరోజూ క్రమం ప్రయత్నిస్తూ ఉండగా ఇప్పుడు చక్కగా పాలు వస్తున్నాయి. అలాగే పాపకు పాలు ఇచ్చేటప్పుడు ఎటువంటి పొజిషన్లలో ఇవ్వాలి, పాలు ఇచ్చిన తర్వాత నిద్రపుచ్చేటపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే తదితర విషయాల గురించి కూడా చక్కగా వివరించారు. ఇప్పుడు రేణుకకు చక్కగా పాలు వచ్చి బిడ్డకు పాలు ఇస్తుండటంతో తను ఎంతగానో సంతోషించి లాక్టేషన్ కౌన్సిలర్లకు మరియు మిల్క్ బ్యాంకు వారికి ధన్యవాదాలు తెలియజేసింది.