23/05/2026
*వేసవి సృజనోత్సవం కార్యక్రమాలు విజ్ఞాన భాండాగారాలు.. జన విజ్ఞాన వేదిక(JVV)*
జన విజ్ఞాన వేదిక జూబ్లీహిల్స్ జోన్ కమిటీ (Hyderabad) ఆధ్వర్యంలో బ్రహ్మం టాలెంట్ స్కూల్ వెంగళరావు నగర్ లో నిర్వహించిన సమ్మర్ సైన్స్ క్యాంపు ఆరు రోజుల పాటు ఉత్సాహభరితంగా కొనసాగి విజయవంతంగా ఈరోజు ముగిసింది.
స్టోరీ టెల్లింగ్ ,సరదా సైన్స్, ఫన్ మాథ్స్ ,మూఢనమ్మకాలు - సైన్స్ ,పాడుతాం పాటలు, ఖగోళం కనుక్కుందాం, ఓరుగామి లాంటి అంశాలపై విద్యార్థులకు ఆయా రంగాల్లో నిపుణులు అవగాహన కల్పించారు.జరిగింది.ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొన్న విద్యార్థులు తము నేర్చుకున్న నైపుణ్యాలను ఆనందంగా ప్రదర్శించారు.
రిసోర్స్ పర్సన్లు చంద్రయ్య, వి.ఆర్ శర్మ, రమణ, దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ రుక్మిణి, నాగరాజు , విజయ్ కుమార్ తమ అనుభవాలను పంచుకుంటూ, విద్యార్థులలో వచ్చిన మార్పులను వివరించారు.
ఈ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించిన జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ నగర కమిటీ గౌరవ అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర రావు విద్యార్థులతో మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే ప్రశ్నించే స్వభావం పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, శాస్త్రీయ దృక్పథం పాఠశాల దశలోనే అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు.
ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం .శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా విద్యార్థులకు అనుభవాధారిత విద్య ( అందించబడింది. శాస్త్రీయ ప్రయోగాలు, సమకాలీన అంశాలపై చర్చలు, ఇండోర్ గేమ్స్, హాబీల అభివృద్ధి వంటి విభిన్న కార్యకలాపాలు విద్యార్థులలో సృజనాత్మకతను, ఆలోచనా శక్తిని పెంపొందించాయి.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.
జన విజ్ఞాన వేదిక సమతా విభాగ రాష్ట్ర ఉప కన్వీనర్ డాక్టర్ పి.రజిని మాట్లాడుతూ సమ్మర్ క్యాంపు ల ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని ,సమాజంపై అవగాహనను పెంచుతున్నామని చెప్పారు. సమాజముతోనే సైన్సు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సైన్స్ రంగాన్ని పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సైన్స్ పరిశోధనలకు నిధులు కేటాయించకపోవడాన్ని ఆక్షేపించారు. సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థులకు వివిధ అంశాల పైన సంపూర్ణ అవగాహన కల్పించామని చెప్పారు. విద్యార్థుల సృజనాత్మకతకు పదును పెట్టడానికి సైన్స్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
వేసవికాలంలో విద్యార్థులకు నిర్వహించే సమ్మర్ క్యాంపులు వారిలో విజ్ఞానాన్ని పెంచడానికి ఎంతో దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ట్రెజరర్ నాగరాజు అన్నారు.
జె వి వి సీనియర్ నాయకులు మరియు ఉపాధ్యాయులు విజయ్ కుమార్ మాట్లాడుతూ సమ్మర్ సైన్స్ క్యాంపు ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
జె వి వి సీనియర్ నాయకులు ఎస్ జితిన్ ప్రసాద్ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని.. వారికి సమాజం పట్ల సైన్స్ పట్ల అవగాహన కల్పించడం ఎంతో అవసరం అన్నారు.
ఈ సందర్భంగా క్యాంప్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్లు మరియు బహుమతులు బ్రహ్మం టాలెంట్ స్కూల్ డైరెక్టర్ కె హరీష్ చేతుల మీదుగా అందజేశారు.
ఆరు రోజులు పాటు పిల్లలకు అల్పాహారం ఏర్పాట్లు చేసిన జెవివి జోన్ కార్యదర్శి వై.యాదగిరికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన బ్రహ్మం టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నగర ప్రధాన కార్యదర్శి ఎం రవీంద్రబాబు, జూబ్లీహిల్స్ జోన్ ప్రధాన కార్యదర్శి వై యాదగిరి, సహాయ కార్యదర్శి జి .రాజశేఖర్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఎస్ జితిన్ ప్రసాద్, ఎన్.పాపారావు, ఆర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.