20/02/2026
గుమ్మడిదల ZPHS పాఠశాలలో నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవం
గుమ్మడిదల, 20/02/2026:
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో *నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం* అత్యంత ఉత్సాహంగా జరిగింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 350 మంది విద్యార్థులు ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సుబ్బలక్ష్మి గారి సమక్షంలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. *నిర్మాణ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఏలే వెంకట నారాయణ* విద్యార్థులకు విద్య యొక్క ఆవశ్యకతను మరియు పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో కూడిన చదువే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని ఆయన పేర్కొన్నారు. అనంతరం పదో తరగతి చదువుతున్న *75 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను* అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు *రమేష్, రామచంద్రారెడ్డి*, నిర్మాణ్ ఫౌండేషన్ *గుమ్మడిదల యాక్టివిటీ కోఆర్డినేటర్ శేఖర్*, ఇతర స్వచ్ఛంద సేవకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాఠశాల సిబ్బంది నిర్మాణ్ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలే వెంకటనారాయణ
అధ్యక్షులు
నిర్మాణ్ ఫౌండేషన్
8008882256