06/10/2024
*"మహాభారతం చదివితే ఇంటికి అరిష్టమని కొందరు అంటున్నారు, ఏం చెయ్యమంటారు?"*
*ఈ అభిప్రాయం సరి కాదు. ప్రతి ఒక్కరూ భారతాన్ని చదవాలని పెద్దల నిర్ణయం.*
*మహాభారతం ఒక సమగ్ర ధర్మశాస్త్రం. ఈ గ్రంథంలో లేని విషయం ప్రపంచంలో ఎక్కడా లేదు. కలహాలు, కుట్రలు, కుయుక్తులు, కురు క్షేత్ర యుద్ధం ఉన్నా ఇది అంతిమంగా విజయం చేకూర్చేది కాబట్టి దీన్ని "జయసంహిత" అన్నారు.*
*"ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నేస్త్రీ ప్రసంగతః,"*
*"రాత్రౌచోర ప్రసంగేన కాలోగచ్ఛతి ధీమతామ్."*
*ధర్మశాస్త్రాల్ని విడమర్చి చెప్పేది కనుక ప్రొద్దున్నే ఇతర ఆలోచనలతో బుద్ధి వేడెక్కక మునుపు భారతం చదవాలి, లేదా వినాలి. వింటే భారతం వినాలి అని చెప్పారు గదా.*
*మధ్యాహ్నం సమాజంలో మనిషి ప్రవర్తించటానికి కావలసిన సద్గుణాలను ఆచరించి చూపిన విష్ణు స్వరూపమైన శ్రీరాముని చరితం రామాయణం చదివి ప్రవర్తనను సరిదిద్దుకోవాలి.*
*రాత్రి పూట శ్రీకృష్ణుని దివ్య లీలలను వర్ణించే ఆత్మోజ్జీవనానికి ఉపకరించే శ్రీమద్భాగవతాన్ని చదవాలి. చేయవలసిన పనులను ఎలా చేయాలో ఒక ప్రణాళిక చేసుకొని చేసినవన్నీ శ్రీకృష్ణార్పణమస్తు అని భగవంతునికి అర్పిస్తూ బుద్ధిమంతులుగా కాలం గడపాలని పై శ్లోకం తాత్పర్యం.*
=========================