Bharatiya Janata Mazdoor Sangh Telangana

Bharatiya Janata Mazdoor Sangh Telangana BJMS is working in various forms for the welfare of workers in organized and unorganised sectors.

05/11/2025

📢 భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ జాతీయ చొరవ —
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా కార్మికులను రక్షించడానికి ఒక చట్టం కోసం డిమాండ్ 🇮🇳

జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఎడిటర్లు మరియు ఇతర మీడియా కార్మికులు ప్రజాస్వామ్యం యొక్క నాల్గవ స్తంభానికి వెన్నెముక.

అయినప్పటికీ నేటికీ, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలోని లక్షలాది మంది కార్మికులకు చట్టపరమైన రక్షణ లేదు, ఉద్యోగ స్థిరత్వం, భీమా లేదా పెన్షన్ ప్రయోజనాలకు ప్రాప్యత లేదు.

📜 సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) జారీ చేసిన “డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్, 2021” కంటెంట్ నియంత్రణ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మాత్రమే వర్తిస్తుంది, కానీ ఇందులో మీడియా కార్మికులకు ఉపాధి భద్రత లేదా వ్యక్తిగత రక్షణకు సంబంధించిన నిబంధనలు లేవు.

📘 అదే సమయంలో, గతంలో ప్రింట్ మీడియా కార్మికులకు వర్తించే వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టం, 1955, ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మీడియా జర్నలిస్టులను దాని పరిధిలోకి చేర్చడానికి ఇంకా సవరించబడలేదు.

⚙️ ఈ తీవ్రమైన లోపాన్ని దృష్టిలో ఉంచుకుని—
భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ (BJMS) భారత ప్రభుత్వానికి ఈ కీలక డిమాండ్లను చేసింది:

1️⃣ ప్రింట్, టీవీ, డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్ వంటి అన్ని మీడియా రంగాలలోని కార్మికులకు సమాన హక్కులు మరియు రక్షణ కల్పించే కొత్త "మీడియా సిబ్బంది (రక్షణ మరియు సంక్షేమం) చట్టాన్ని" అమలు చేయండి.

2️⃣ సమానమైన వేతనం మరియు సేవా పరిస్థితులను నిర్ధారించడానికి మీడియా వేజ్ బోర్డును ఏర్పాటు చేయండి.

3️⃣ జర్నలిస్టులపై దాడి, బెదిరింపు లేదా వేధింపుల కేసులలో సత్వర చర్య తీసుకోవడానికి మీడియా భద్రత & ఫిర్యాదుల పరిష్కార కమిషన్‌ను ఏర్పాటు చేయండి.

4️⃣ మీడియా కార్మికులకు భీమా, పెన్షన్, వైద్య మరియు ఉపాధి భద్రత కోసం చట్టబద్ధమైన నిబంధనలను ఏర్పాటు చేయండి.

🟠 ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా మీడియా కార్మికులకు గౌరవం, స్థిరత్వం మరియు భద్రతను అందిస్తాయి—
మరియు స్వతంత్ర, నిష్పాక్షిక మరియు నిర్భయ జర్నలిజాన్ని బలోపేతం చేస్తాయి.

✍️
శాంత్ ప్రకాష్ జాటవ్
జాతీయ అధ్యక్షుడు
భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ (BJMS)

News Article
02/10/2025

News Article

News Article
01/10/2025

News Article

భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ (BJMS) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోతుల హరిబాబు రెడ్డి నియామకం.భారతీయ జనతా మజ్దూర్ సంఘ...
22/09/2025

భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ (BJMS) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోతుల హరిబాబు రెడ్డి నియామకం.

భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ జాతీయ అధ్యక్షులు శాంత్ ప్రకాష్ జాటవ్ గారు పోతుల హరిబాబు రెడ్డి ను బీజేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
జాతీయ అధ్యక్షులు వారి ఆదేశాల అనుసారం భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యదర్శి వేలూరి సంతోష్ గుప్తా గారు పోతుల హరిబాబు రెడ్డి గారికి నియామక పత్రాన్నీ అందచేసారు.
ఈ సందర్భంగా పోతుల హరిబాబు రెడ్డి మాట్లాడుతూ వ్యవస్థీకృత మరియు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మరియు వారి కుటుంబాలకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు వారికి చేరేలా తన వంతు కృషి సహాయం ఎల్లపుడు చేస్తానని శపథం చేశారు. తన పైన విశ్వాసం ఉంచి తనకు బీజేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గౌరవనీయులైన బీజేఎంఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ శాంత్ ప్రకాష్ జాటవ్ గారు నియమించినందుకు, నాకు ఈ అవకాశం కల్పించిన జాతీయ కార్యదర్శి వేలూరి సంతోష్ గుప్తా గారికి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పల్లగని శ్రీనివాస్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు.
మేము దేశం కోసం పని చేస్తాము కానీ రహదారీలను దిగ్బంధించము.
Congratulations Haribabu Reddy Garu

భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక కార్మికుల ఫోరం అధ్యక్షులుగా పోసానిపల్లి సుధాకర్ రెడ్డి నియామకం.భారత...
17/09/2025

భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక కార్మికుల ఫోరం అధ్యక్షులుగా పోసానిపల్లి సుధాకర్ రెడ్డి నియామకం.

భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ జాతీయ అధ్యక్షులు శాంత్ ప్రకాష్ జాటవ్ గారు పోసానిపల్లి సుధాకర్ రెడ్డి ను బీజేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక కార్మికుల ఫోరం అధ్యక్షునిగా నియమించారు.
జాతీయ అధ్యక్షులు వారి ఆదేశాల అనుసారం భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యదర్శి వేలూరి సంతోష్ గారు పోసానిపల్లి సుధాకర్ రెడ్డి గారికి నియామక పత్రాన్నీ అంద చేసారు.
ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామిక కార్మికులకు మరియు వారి కుటుంబాలకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ వారికి తన వంతు కృషి సహాయం ఎల్లపుడు చేస్తానని శపథం చేశారు. తన పైన విశ్వాసం ఉంచి తనకు బీజేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక కార్మికుల ఫోరం కు అధ్యక్షునిగా బీజేఎంఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ శాంత్ ప్రకాష్ జాటవ్ గారు నియమించినందుకు మరియు బీజేఎంఎస్ జాతీయ కార్యదర్శి వేలూరి సంతోష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి కృష్ణ మరియు వేలూరి ప్రశాంత్ పాల్గొన్నారు.

Today's News Article
05/09/2025

Today's News Article

05/09/2025
05/09/2025

Address

Hyderabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+917995265765

Alerts

Be the first to know and let us send you an email when Bharatiya Janata Mazdoor Sangh Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharatiya Janata Mazdoor Sangh Telangana:

Share

Category