22/10/2022
*విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం...*
*కొలిపాక వంశీ*
*ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.*
ఈరోజు వంటా వార్పు కార్యక్రమం సందర్భంగా విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకతీయ విశ్వవిద్యాలయ శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలిపాక. వంశీ మాట్లాడుతూ" అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకతీయ విశ్వవిద్యాలయం శాఖ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు అందరికీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ తేడా లేకుండా హాస్టల్ వసతి కల్పించాలని, కోర్సులకు పెంచిన ఫీజులను తగ్గించాలని, యూనివర్సిటీలో అక్రమంగా వసూలు చేస్తున్న అడ్మిషన్ రెన్యువల్ ఫీజులను, స్పెషల్ ఫీజులను రద్దు చేయాలని అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్న యూనివర్సిటీ VC, రిజిస్ట్రార్ స్పందించకుండా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను రోడ్డుపాలు చేసి నరకయాత కు గురిచేస్తున్నారన్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు విద్యార్థులు అందరూ కూడా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించని చేతకాని VC తన వైశాచికత్వాన్ని పోలీసుల సహాయంతో విద్యార్థులపై చూపించడం దారుణం అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులను కలవడానికి ,వినతి పత్రం స్వీకరించడానికి ఇష్టపడని VC, కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ను కూడా కాలరాస్తున్నారన్నారు. వంటావార్పు కు ఏర్పాటుచేసిన చేసిన విద్యార్థులు చేస్తున్నారు ఏర్పాట్లు చేస్తున్న విద్యార్థులను పోలీసులు విచక్షణ రహితంగా నెట్టుకుంటూ లాక్ కెళ్ళ అరెస్టు చేయడం మూలంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల.రాంబాబు, నిమ్మల. రాజేష్ ,గట్టు ప్రశాంత్, భార్గవ్ మొదలగు విద్యార్థులు కాళ్లు చేతుల కు తీవ్రమైన గాయాలయ్యాయి అన్నారు. ఈ క్రూర చర్యలకు విద్యార్థుల ఆగ్రహానికి VC మూల్యం చెల్లించక తప్పదన్నారు. VC గారు మీకు చేతనైతే సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలే కానీ, విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసుల సహాయంతో చేస్తున్న ఈ క్రూర చర్యలు సరికావన్నారు. మీరు ఎన్ని గిమ్మిక్కులు పన్నిన, ఎన్ని అక్రమ కేసులు బనాయించిన సమస్యల పరిష్కారం చూపేవరకు ఉద్యమాన్ని ఆపబోమని తెలియజేస్తూ ,తర్వాత జరిగే పరిణామాలకు మీరు, మీ యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి, సురేష్ వినయ్ ,అఖిల్ ,సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు
*సదా భరతమాత సేవలో.*
*ABVP,KU UNIT*