Viswasayatra

Viswasayatra telugu christian messages

20/04/26శ్రమలో సంఘం ప్రార్థనఅపోస్తుల కార్యములు గ్రంథంలో ఉజ్జీవం ప్రార్థనతో ప్రారంభమైంది.ఈ గ్రంథంలో ప్రార్థన ప్రాధాన్యత మ...
20/04/2026

20/04/26శ్రమలో సంఘం ప్రార్థన

అపోస్తుల కార్యములు గ్రంథంలో ఉజ్జీవం ప్రార్థనతో ప్రారంభమైంది.ఈ గ్రంథంలో ప్రార్థన ప్రాధాన్యత మరియు గొప్ప ప్రార్థన ఫలితాలు రాయబడ్డాయి. సంఘంలో అతి ముఖ్యమైనది ప్రార్థన. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నది కూడా ఇదే ప్రార్థన. ఆది సంఘ ప్రార్థనతో ప్రారంభించబడింది.నేటికీ ఉజ్జీవింపబడిన ప్రతి సంఘ యొక్క రహస్యం ప్రార్థన. ఒక గొప్ప దైవజనుడు తన ఉజ్జివ పరిచర్యకు గల మూడు ముఖ్యమైన కారణాలు చెప్పాడు. అందులో మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్ధన మూడవది కూడా ప్రార్థన మాత్రమే అని చెప్పాడు. కాబట్టి సంఘం విజ్ఞాపనను ఎప్పుడూ కూడా తక్కువగా చూడకూడదు. పాటలు అవసరమే వాక్యము, పరిచర్య అవసరమే. అయితే ప్రార్థన అత్యవసరం.ప్రతి సేవకుడు వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి
సంఘ ప్రార్థనలు చేయాలి.ప్రతి విశ్వాసి వాక్యం చదవడంతో పాటుగా ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తిగతంగా ప్రార్థించాలి. సంఘ అవసరతల కొరకు ప్రార్థించాలి. మన మిత్రుల కొరకు ప్రార్థించటమే గొప్ప ఆశీర్వాదం. అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ మనం ఎవరెవరి కొరకు ప్రార్థించాలో స్పష్టంగా చెప్పాడు.1 Timothy(మొదటి తిమోతికి) 2:1,2

1.మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును
2.రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.
మరి మన సంఘంలో చేసే ప్రార్థనలో ఇవి ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించండి. వారి కొరకు ప్రార్ధించు. బంధుమిత్రుల కొరకు ప్రార్ధించు. స్థానిక మరియు దేశ ప్రపంచ నాయకులు కొరకు ప్రార్ధించు. ఇది క్రైస్తవుల బాధ్యత. ఆది సంఘంలో సువార్తను ప్రకటించడానికి సేవకుల వెళుతున్నప్పుడు సంఘం వారికి ప్రార్ధనలో అండగా నిలబడింది. సేవా ముందుకు సాగాలంటే ప్రార్ధించేవారు కావాలి. ఈరోజు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా ఇతరమైనవి చేసే వాళ్ళు ఉన్నారు గానే ప్రార్థించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.ప్రార్థించే వారు సంఘమునకు కావాలి. అప్పుడే దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. అపోస్తలులు ఎరుషలేము విధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆనాటి పరిసయ్యులు ప్రధాన యాజకులు వారిని బంధించి కోరడాలతో కొట్టి చిత్రహింసలు పెట్టారు. విషయాన్ని తెలుసుకున్న ఆది సంఘం ఎక్కడ భయపడి కూర్చోలేదు. శ్రమల్లో చాలామంది విశ్వాసులు తొలగిపోతారని ఏసుక్రీస్తు చెప్పాడు. అయితే నిజమైన క్రైస్తవుడు శ్రమల్లోనే బంగారం లాగా మెరుస్తాడు. శ్రమలను సహిస్తాడు. ప్రార్థనతో ఎదుర్కొంటాడు. సంఘం ప్రార్థనతో శ్రమలను ఎదుర్కొన్నది. వారు ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు ప్రభువా ఈ శోధనలు తీసివేయి అని ప్రార్థించలేదు. ప్రభువా నీ వాక్యానికి విరోధంగా అధికారులు లేచారు అయినప్పటికీ మీరు జరిగించాలి అనుకున్న కార్యాలను జరిగించండి అని ధైర్యంగా ప్రార్ధించారు.
Acts(అపొస్తలుల కార్యములు) 4:24,25,26,27,28,29,30,31

24.వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
25.అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?
26.ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను(అనగా అభిషిక్తునిమీదను) భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
27.ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,
28.వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
29.ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి
30.రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.
31.వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
సమాజంలో క్రైస్తవులు పట్ల పెరుగుతున్న హింస కుట్రలు ఇతర ఇబ్బందికరమైన వాటిని చూసి విశ్వాసము లేని వారు భయపడతారు. గానీ దేవుని యందు విశ్వాసం కలిగిన క్రైస్తవులు నిజమైన విశ్వాసులు ఎన్నటికీ భయపడరు. ఎందుకంటే లోకమును జయించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ప్రార్ధించేది నిజమైన సంఘం. ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో వ్యక్తిగత జీవితంలో పరిచర్యలో సంఘంలో శోధనలు వస్తున్నాయి అంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావో అని అర్థం కాబట్టి ఆది సంగం వలే ధైర్యంగా ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పేతురు యోహానులు ధైర్యంగా ప్రార్ధించారు సంఘం ప్రార్థించింది ఫలితంగా ఆ తర్వాత పుట్టుకతో కుంటివాడు లేచి నిలిచి నడిచాడు అది గొప్ప ఉజ్జీవ ఉద్యమానికి కారణం అయ్యింది. నువ్వు దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎన్నటికీ వృధా కాదు మనకు ఈరోజు ప్రార్థించే సేవకులు ప్రార్థించే విశ్వాసులు కావాలి. నీ ప్రయాస అంతా పక్కన పెట్టి ప్రభువు సన్నిధిలో ప్రార్థనలో ప్రయాస పడండి పరిశుద్ధాత్ముడు సులభంగా తన కార్యాలను జరిగిస్తాడు ఇప్పటికైనా ప్రార్థన యొక్క గొప్ప శక్తిని గుర్తెరిగి సంఘంలోనూ ప్రార్ధించుదాం. దేవుడు గొప్ప కార్యములను జరిగించును గాక ఆమెన్.

19/04/2026
19/04/26ఆదివారం ఏమి జరిగింది?విశ్రాంతి దినము అంటే శనివారం.మత్తయి సువార్త 28వ అధ్యాయం... విశ్రాంతి దినము గడిచిపోయిన తరువా...
19/04/2026

19/04/26ఆదివారం ఏమి జరిగింది?

విశ్రాంతి దినము అంటే శనివారం.

మత్తయి సువార్త 28వ అధ్యాయం...
విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత తెల్లవారుజామున అంటే ఆదివారం తెల్లవారుజామున...
ఏసుక్రీస్తు సమాధి దగ్గర సుగంధ ద్రవ్యాలు పూయాలి అన్న ఉద్దేశంతో కొందరు స్త్రీలు బయలుదేరారు. అంటే ఆయన ఇంకా చనిపోయి సమాధిలో ఉన్నాడు అనుకున్నారు. కానీ ఆయన తిరిగి లేచాడు అన్న ఆలోచన శిష్యులలో ఎవ్వరికీ లేదు.

ఉదయాన్నే యేసు సమాధి దగ్గరికి వెళ్లి ఆయన అక్కడ లేనందున అనవసరంగా కూర్చుని ఏడవటం ప్రారంభించారు. అయితే దేవుడు తన దూత ద్వారా వారికి తాను తిరిగి లేచిన సువార్తను అందించి, మిగతా శిష్యులకు కూడా ఆ వార్త చెప్పమని ప్రకటించాడు. యేసు మొదటిగా మగ్ధలేనే మరియకు కనిపించాడు. కావలి వారు జరిగిన విషయాలు ప్రధాన యాజకులకు చెప్పినప్పుడు ఆ సైనికులకు వాళ్ళు చాలా ద్రవ్యమిచ్చి శిష్యులు వచ్చి యేసుని ఎత్తుకొని పోయారు అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. 11 మంది శిష్యులకు యేసు తన్నుతాను ప్రత్యక్ష పరచుకున్నాడు.
మార్కు సువార్త 16వ అధ్యాయం .
ఏసు తాను సజీవుడగా లేచాడు అన్న విషయం మరియకు చెప్పిన తర్వాత ఆమె వెళ్లి శిష్యులకు చెప్పింది.కానీ శిష్యులు నమ్మలేదు. శిష్యులు ఒక గ్రామానికి వెళ్ళుచుండగా యేసు వారికే కనపడి వారి అపనమ్మిక నిమిత్తం వారిని గద్దించాడు.

లూకా: 24వ అధ్యాయం...
యేసు ఎమ్మాయి అనే గ్రామం వెళ్ళుచున్న శిష్యులకు తన్నుతాను ప్రత్యక్ష పరచుకొనుట.
పైనుండి శక్తి పొందు వరకు యేరుషలేములో నిలిచి ఉండుడని వారికి చెప్పి పరలోకానికి ఆరోహణమవుట.

యోహాను సువార్త 20వ అధ్యాయం

యేసు దేహము గురించి యూదులకు భయపడిన శిష్యులు ఒక ఇంటిలో తలుపు వేసుకుని ఉండగా యేసు వారికి ప్రత్యక్షమవుట.
ఎనిమిది రోజుల తర్వాత ఏసు మరలా ప్రత్యక్షమై అపోస్తలుడైన తోమా అవిశ్వాసము సరిచేయబడుట.

ఏసు పునరుద్దానుడై లేచిన తరువాత పేతురు వెనుతిరిగి మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళుట .
మరికొందరు శిష్యులు పేతురు మార్గంలో నడుచుట.
ప్రభువు పేతురును మిగతా వారిని బలపరచుట ..
మూడవ సారి యేసు వారికి ప్రత్యక్షమాయెను. 21: 14
పేతురును దేవుడు సంఘ కాపరిగా సంఘ నాయకుడిగా నియమించుట.

Address

Gorantla
Guntur

Telephone

9848343195

Website

Alerts

Be the first to know and let us send you an email when Viswasayatra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Viswasayatra:

Share