03/05/2023
#ఆగస్ట్ 7న ఛలో ఢిల్లీ
#సేలం ర్యాలీలో వెంకన్న నేత పిలుపు
#జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పద్మశాలి సంఘం తీర్మానం
#పద్మశాలి మహసంగమ సభలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు
#మహా ప్రదర్శనకు వివిధ పార్టీల జాతీయ నాయకులు - కందగట్ల స్వామి
#జీరో జీఎస్టీ సాధనకై ఆగస్టు 7వ తేదీన ఢిల్లీలో జరిగే మహా ప్రదర్శనకి దేశవ్యాప్తంగా పద్మశాలి మరియు చేనేత అనుబంధ కులాలు వేలాదిగా తరలిరావాలని ఈరోజు తమిళనాడు, సేలంలో జరిగిన పద్మశాలి మహా సంగమ ర్యాలీలో జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ అధ్యక్షులు *యర్రమాద వెంకన్న నేత* పిలుపునిచ్చారు. చేనేత పై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పన్నులు వేయడం దారుణమన్నారు. గత 17 నెలల ఉద్యమాన్ని ఆయన వివరించారు. ఢిల్లీలో జరిగే మహా ప్రదర్శనకు వివిధ పార్టీల జాతీయ నాయకులు హాజరవుతున్నారని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి తెలిపారు. ఈ సందర్భంగా జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పద్మశాలి సంఘం తీర్మానం చేసింది. తమిళనాడు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు రవీంద్రన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సభలోని వేలాది మంది పద్మశాలీలు ఎకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కొక్కుల దేవేందర్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఇంజనీర్స్ విభాగం అధ్యక్షుడు పుట్టా పాండు రంగయ్య, కార్యదర్శి నక్క వేణుమాధవ్, కర్నాటక అధ్యక్షుడు జగదీష్, కేరళ కార్యదర్శి సుధాకరన్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్ రావు, కోస్తాంధ్ర అధ్యక్షుడు జీ.వి. నాగేశ్వర రావు, తమిళనాడు నాయకులు తంగరాజన్, వేంకటాచలపతి. వరల్డ్ వీవర్స్ ఆర్గనైజషన్ సౌత్ ఇండియా ఇంఛార్జి సేతుపతి, రమేష్, గోవిందరాజన్, మహారాష్ట్ర నాయకులు సంకు సుధాకర్, చిలువేరు పురుషోత్తం, ఉమా, హేమలత తదితరులు పాల్గొన్నారు.