15/03/2025
*పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు బహుకరణ*
*మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సేవలు అభినందన, హర్షదాయకం*
*మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు జడ్పీ బాయ్స్ హైస్కూల్ నందు శనివారం పదవ తరగతి పరీక్షలు రాయనున్న 67 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ మరియు స్టేషనరీని కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచేసినటువంటి మైనారిటీ నాయకులు రహీమ్ గారు మాట్లాడుతూ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, చిన్న వయసులోనే రాహూల్ ఒక సంస్థ ను స్థాపించి ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి గూడూరు ప్రజల ఆశీర్వాదాలు పొందారని కొనియాడారు, టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య గారు మాట్లాడుతూ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు హుదుద్ తూఫాను మరియు కరోనా కష్ట కాలంలో సైతం గూడూరు ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు, ఎంఇఓ రౌఫ్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని, విద్యార్థి దశలో ప్రతిఒక్కరూ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ను ఆదర్శంగా తీసుకుని సేవ కార్య్రమాలు చేయాలని తెలియజేశారు, అధ్యక్షులు మన్నూరు రాహూల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు వచ్చేలా మంచి మార్కులు సాధించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు, మరియు విద్యార్థుల పై చదువులకు ఎటువంటి అవసరం వచ్చిన తమ సంస్థ తరపున సహాయం చేయుటకు ముందుంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాలా ప్రధాన ఉపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయులు మరియు సంస్థ సభ్యులు కలీం, శివ, మీర్జా, రమేష్, గణేష్, హరి, హర్ష తదితరులు పాల్గొన్నారు.*