INTUC SCMLU

INTUC SCMLU Singareni Coal Mines Labour Union . Affiliated to INTUC

INDIAN NATION TRADE UNION CONGRESS

14/04/2025
07/02/2025
07/02/2025

యూనియన్ చందా పంచుకొని జైలు కెల్లిన చరిత్ర రాజిరెడ్డిది .
అధికారం కోల్పోయిన 24 గంటలలో యూనియన్ కి రాజీనామా చేసి చేతులు ఎత్తేసిన ఘనుడు
కార్మిక పక్షపాతి అయిన జనక్ ప్రసాద్ గారి గురించి మాట్లాడటం సిగ్గు చేటు.

- INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ S. నర్ససింహ రెడ్డి.

10 ఏళ్ళు పదేళ్లు అధికారంలో ఉండి సింగరేణిలో అన్ని పదవులు అనుభవించి ప్రభుత్వం పోయిన 24 గంటల్లోనే
రాజీనామా చేసిన నాయకులు కార్మిక పక్షపాతి కార్మికుల పక్షాన నిరంతరం కొట్లాడే వ్యక్తి 40 ఏళ్లు కార్మిక రంగంలో పనిచేస్తున్న
జనక్ ప్రసాద్ గారి గురించి మాట్లాడటం సిగ్గుచేటని ,
రాబోయే యూనియన్ ఎలక్షన్ లో గెలుపు తథ్యం అన్న రాజిరెడ్డి గత ఎన్నికల్లో మీకు ఎన్ని ఓట్లు పోల్ అయ్యయో కార్మికులు ఎలా బొంద పెట్టారు , మీ యూనియన్ నాయకుల వల్ల కోల్ బెల్ట్ లో టిఆర్ఎస్ ఒక్క సీటైన గెలిచిందా చెప్పాలని అన్నారు. కార్మికుల హక్కుల కోసం వేజ్ బోర్డు పెంపు కోసం జైలుకెళ్ళిన ఘనత జనక్ ప్రసాద్ గారిది అయితే , కార్మికుల కష్టా జీతం తోటి సభ్యత్వం వసూలు చేసి పంచుకునే క్రమంలో గొడవలై జైలుకెళ్ళిన ఘనత రాజిరెడ్డిదని. శ్రీరాంపూర్ బహిరంగ సభలో పదివేల కోటర్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ ఎన్ని కోటర్లు కట్టించారో చెప్పాలనీ అన్నాను. మొన్నటిదాకా టిఆర్ఎస్ ,(TBGKS) లో అనేక పదవులు అనుభవించిన మీరు పార్టీ ఓడిపోగానే 24 గంటలు తిరగకుండా యూనియన్ ని కష్టకాలంలో వదిలేసి చేతులు దులుపుకున్న నాయకులు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేసిన మాట నిజం కాదా అని ?? అధికారంలో లేకున్నా కార్మికుల పక్షాన కొట్లాడిన ఘనత ఐఎన్టీయూ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారిదని వారి పోరాట పటిమ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన మండలి చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించిందని, మీకు మీ ప్రభుత్వం ఏమి చేయకపోగా సొంత పార్టీ నేతలే రాజిరెడ్డికి యూనియన్కి ఎలాంటి సంబంధం లేదని పత్రికా ముఖంగా చెప్పారని గుర్తు చేశారు .పదేళ్లు అధికారంలో ఉండి కార్మికుల రక్తాన్ని తాగి ఇప్పుడు కార్మికుల పోరాడే నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం, సెంట్రల్ జనరల్ సెక్రెటరీలు లక్ష్మీపతి గౌడ్ , అక్రమ్ మహిళా అధ్యక్షురాలు శేషా రత్నం, రీజినల్ జనరల్ సెక్రెటరీ టైసన్ శ్రీనివాస్, జాయింట్ జనరల్ సెక్రెటరీ గడ్డం కృష్ణ , , సెంట్రల్ సెక్రటరీ నవీన్ , సాయి , నాయకులు తాటి రాజయ్య , బర్ల మనోహర్ , బ్రాంచ్ సెక్రటరీ తాటికొండ అంజయ్య , పూసల శ్రీనివాస్ , లెగిసెట్ ఆంజనేయులు , రవి , బాపు , రమేష్, రాజమౌళి , కుమార్ , తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

సింగరేణి ప్రవేటికరణ కి వ్యతిరేకంగా INTUC ఆధ్వర్యంలో మహా ధర్నా ,  RG-1 GM ఆఫీస్ ముట్టడి . తేదీ 04-07-2024 గురువారం INTUC ...
04/07/2024

సింగరేణి ప్రవేటికరణ కి వ్యతిరేకంగా INTUC ఆధ్వర్యంలో మహా ధర్నా , RG-1 GM ఆఫీస్ ముట్టడి .

తేదీ 04-07-2024 గురువారం INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారి ఆదేశానుసారం సింగరేణి ప్రవేటికరణ కి వ్యతిరేకంగా మొదటి విడుత గా సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలలో GM ఆఫీస్ల యందు మహా ధర్నా కార్యక్రమంలో భాగంగా INTUC RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం గారి అధ్యక్షత RG-1 GM ఆఫీస్ యందు మహా ధర్నా GM ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి గారు హాజరై ప్రసంగిస్తూ ..

100 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి ను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఇక్కడ వేలాది కార్మికుల నోట్ళో మట్టి కొట్టాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక మరియు సింగరేణి ప్రాంత అభివృద్ధి వ్యతిరేక చర్యల వల్ల తెలంగాణా బిడ్డలు గడిచిన పది సంవత్సరాలలో ఎటువంటి అబివృద్ధి లేకుండా అప్పుల తెలంగాణ గా గత BRS పాలకులు చేసి నిరుద్యోగుల జీవితాల తో ఆడుకున్నారని .
అధికారం లో ఉన్న 10 ఏళ్లు కేంద్రం లో ఉన్న బి. జే. పి తో అంటకాగి, MMDR-2015 చట్టానికి తెలంగాణ ప్రాంత BRS 13 మంది ఎం.పీ లు మద్దతు తెలియజేసి ప్రయివేటీకరణ ను ప్రోత్సహించారని .

పేదలను కొట్టి పెద్దలకు సంపద ను దోచి పెట్టాలన్న సిద్ధాంతం తో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని. ఇదేనా వికసిత్ భారత్ ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని
100 ఏళ్లు చరిత్ర 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం గల సింగరేణి ఉనికే లేకుండా చేస్తాము అని ఆలోచిస్తే మరో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని . MMDR ఆక్ట్ లో 17(A) క్లాస్ ప్రకారం బొగ్గు బ్లాకుల ను ప్రభుత్వ రంగ సంస్థలకు అలాట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిసి కూడా వేలం వేయడం దేనికి సంకేతమని అంతే కాకుండా సింగరేణి సంస్థ కు బొగ్గు ఉత్పత్తి లో అపార అనుభవం ఉందని కోల్ ఇండియాకి దీటుగా ఉత్పతి సాధిస్తుందని వరుస లాభాలు గడిస్తూ, కార్మికులు కష్టపడేతత్వం గల వాళ్ళు ఉండి మంచి అధికారులు కూడా ఉన్నపుడు ఇవ్వన్నిటినీ పరిగణ లోనికి తీసుకోకుండా పెట్టుబడి దారుల జేబులు నింపడమేనా బి.జే.పి అంత్యోదయ నినాదమని.
గతం లో కాంగ్రెస్ నాయకురాలు దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారు ఈ బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇప్పుడున్న బి.జే పీ మోడీ గారి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ను వారి స్నేహితులైన పెద్ద పెద్ద పెట్టుబడి దారులకు అప్పజెప్పుతున్నారని .
అందుకే INTUC తరుపున ఈ బొగ్గు బ్లాకుల విషయమై తెలంగాణ ముఖ్య మంత్రి గారిని ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క గార్ని,IT శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గార్ని మరియు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని అలాగే ప్రభుత్వ పెద్దలను ఈ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల ను కలిసి బొగ్గు బ్లా సింగరేణి సంస్థ కే ఇవ్వాలని కోరుతామని .
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ కు ఇట్టి బొగ్గు బ్లాకుల ఇవ్వని ఎడల మా INTUC జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి గారి నాయత్వములో సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో విడుదల వారీగా పోరాటాలు చేయటం కోసం కార్యాచరణ చేశామని అందులో బాగంగా మొదటి విదుత లో బాగంగా ఈ రోజు GM ఆఫీస్ యందు మహా ధర్నా GM ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించామని తదుపరి కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్ , సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రెటరీ అరేపల్లి శ్రీనివాస్ , సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రెటరీ దేవులపల్లి రాజేందర్ , సెంట్రల్ సెక్రెటరీలు బత్తుల పోచయ్య , మల్లికార్జున్ , గడ్డం కృష్ణ , బ్రాంచ్ సెక్రెటరీలు నాగరాజు , బుర్ర జగన్మోహన్ , నీరాటి సాగర్ , గుందేటి శ్రీనివాస్ , ఎడులాపురం శ్రీనివాస్ , బ్రాంచ్ నాయకులు లగిషెట్టి ఆంజనేయులు, సమ్మయ్య యాదవ్ , చంద్ర రెడ్డి , తాటి ఆంజనేయులు, మండ రమేష్ , పుట్ట రమేష్ , తాళ్ళ కుమార్ , నయీం పాషా , గంగాధర్ , దాసరి నర్సయ్య ,
పిట్ సెక్రెటరీలు జనగామ రాజేశం , సిరిపురం నర్సయ్య , సదానందం , దేవేంద్ర చారి , గాదె సంపత్ , అశోక్ చక్రవర్తి , శ్రీనివాస్ , పర్వేశ్ , గణపతి దామోదర్ , కొండ శ్రీనివాస్ , ఇతర నాయకులు కట్రోజు మోహన్ , పాకాల సాయి , హరీష్ , మంత్రి మల్లయ్య , కుమార స్వామి ,తాటి రాజయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Singareni Information And Entertainment(SIAE) INTUC Bhupalapally Janak Prasad Bajpai Rahul Gandhi SCCL GROUP : Singareni INTUC Telangana CIF mahesh babu TG Singarenian Son's Association - SSA Janak Prasad Vikas Kumar Yadav ప్రశ్నిద్దాం పోరాడుదాం INTUC SCMLU Duddilla Sridhar Babu Bhatti Vikramarka Mallu Makkan Singh Raj Thakur

విజయవంతమైన INTUC మహా సభ . హాజరైన అతిరథ మహారథులు . కార్మికుల సొంతింటి కళ  నెరవేరుస్తాం కార్మికుల కోసం పోరాడే యూనియన్ INTU...
21/04/2024

విజయవంతమైన INTUC మహా సభ .
హాజరైన అతిరథ మహారథులు .
కార్మికుల సొంతింటి కళ నెరవేరుస్తాం
కార్మికుల కోసం పోరాడే యూనియన్ INTUC మాత్రమే .

ఈ రోజు INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన INTUC మహా సభ మరియు పెద్దపల్లి పార్లిమెంట్ సన్నాహక సభ సింగరేణి వ్యాప్తంగా వచ్చిన కార్మికులతో కికిరిసి పోయింది .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన INTUC జాతీయ అధ్యక్షులు డా జి సంజీవ రెడ్డి గారు మరియు IT పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు , రామగుండం నియోజక MLA రాజ్ ఠాకూర్ , చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ , మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ , నగర మేయర్ భంగి అనిల్ కుమార్ గార్లు మాట్లాడుతూ ..

కోల్ బెల్ట్ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో కార్మిక లోకం BRS కి బుద్ది చెప్పి కాంగ్రెస్ పార్టీ కి భారీ మెజారిటీ తో గెలిపించారని అదే విధంగా రాబోయే పార్లిమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని అదే విధంగా స్థానికంగా ఉన్న పెద్దపల్లి పార్లిమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ కాక గారి ఆశయాలతో వస్తున్నారని వారిని ఆదరించాలని కోరారు .
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్మిక వ్యతిరేకత చట్టాలను రద్దు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే సింగరేణి కి కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కృషి చేశామని .
అనేక రోజులుగా పెండింగ్ లో ఉన్న 35 -40 వయోపరిమితి సమస్య పరిష్కరించామని ,
రామగుండం లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం కృషి చేశామని , అదే విధంగా కార్మికులు చెల్లించే PERKS మీద ఐటీ యాజమాన్యమే భరించెల కృషి చేస్తామని. కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ వేతనాల అమలు , రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపుదల కోసం కృషి వంటి అనేక కార్యక్రమాలు చేస్తామని.
కార్మికుల కోసం నిరంతరం పోరాడే యూనియన్ కేవలం INTUC అని ఘంటాపథంగా చెప్పారు.
ఈ కార్యక్రమానికి సెంట్రల్ నాయకులు , బ్రాంచ్ నాయకులు , అన్ని ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

INTUC Telangana Singareni Information And Entertainment(SIAE) Janak Prasad Rahul Gandhi SCCL GROUP : Singareni యండి పాషా ఏఐటీయూసీ ప్రశ్నిద్దాం పోరాడుదాం INTUC Bhupalapally INTUC SCMLU Singarenian Son's Association - SSA Vikas Kumar Yadav

RG-2 ఏరియా  ప్రెస్స్ మీట్ - గత పాలకుల ఏలుబడి లో సింగరేణి అనేక రకాల దోపిడీకి గురైంది. - INTUC కృషి మరియు కాంగ్రెస్ ప్రభుత...
10/03/2024

RG-2 ఏరియా ప్రెస్స్ మీట్

- గత పాలకుల ఏలుబడి లో సింగరేణి అనేక రకాల దోపిడీకి గురైంది.
- INTUC కృషి మరియు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం తో సింగరేణి కి తాడిచేర్ల -2 కేటాయింపు .
- తాడిచేర్ల -2 ఒక మణిహారం దాని ద్వారా ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం , మొత్తం 180 మిలియన్ టన్నుల బొగ్గు 30 ఎండ్ల పాటుఉత్పత్తి చేసే అవకాశం .
- RG-1 లో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం .
- ప్రెస్స్ మీట్ లో INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు

తేదీ 10-03-2024 స్థానిక 8 ఇంక్లైన్ కాలనీ లో ఉన్న
ప్రెస్స్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ..
గత పాలకుల ఏలుబడి లో సింగరేణి అనేక రకాల దోపిడీకి గురైందని సంస్థ నిధులు విచ్చలవిడిగా వాడుకున్నారు అని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్య మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గార్ల సారధ్యంలో సింగరేణి పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సింగరేణి లో ఖాళీలను భర్తీ చేస్తున్నారని , దాని కోసం ఎక్స్టార్నల్ ఇంటర్నల్ నోటిఫికేషన్ ఇచ్చిందని అంతే కాకుండా కారుణ్య నియామకాల ద్వారా ఏడాదికి 1000 కి పైగా ఉద్ధ్యోగాల భర్తీ కి అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యం కృషి చేస్తుందని . అంతే కాకుండా
కొత్త బొగ్గు గనుల కోసం INTUC నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం తో ఇటీవల కాలంలో కేంద్ర కోల్ సెక్రెటరీ అమృత్ లాల్ మీనా ను కలిసి కోరిన ఫలితంగా తాడిచేర్ల -2 సింగరేణి కి కేటాయించటం కోసం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని .
తాడిచేర్ల -2 సింగరేణి కి ఒక మణిహారం అని దాని ద్వారా ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని , మొత్తం 180 మిలియన్ టన్నుల బొగ్గు 30 ఎండ్ల పాటుఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఇక్కడ లభించే బొగ్గు G-10 కి సంబంధించిన బొగ్గు అని దాని ద్వారా సంస్థ కి 400 కోట్ల రూపాయల లాభాలు వస్తాయని . అంతే కాకుండా షెడ్యుల్ ఏరియా లో ఉన్న కోయా గూడెం -3 చట్ట విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు గత ప్రభుత్వం అంటగట్టిందని దానిని ఆడుకోవడం తో పాటు రాబోయే 4 ఎండ్లలలో వెంకటాపురం , KK6 శ్రవనపల్లి లాంటి అనేక కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కృషి చేసి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసేలా చూస్తాం అని అంతే కాకుండా ఒడిశా లోని నైని క్యాప్టివ్ మైనింగ్ అని దాని ద్వారా బొగ్గు తీసి డైరెక్ట్ గా అమ్ముకొలేమని దాని ద్వారా వచ్చిన బొగ్గు తో విద్యుత్ ఉత్పత్తి చేసి 3*800 =2400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ అమ్ముకోవడం వల్ల సంస్థ కి దాదాపు 1000 కోట్ల రూపాయలలాభాలు వస్తాయని అన్నారు అంతే కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన ఆర్గారంటీలో తప్పకుండా అమలు చేస్తామని అందులో భాగంగానే RG-1 లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం త్వరలోనే జరుగుతుందని రామగుండం మరియు శ్రీరాం పూర్ ఏరియా లో రాపిడ్ గ్రావిటీ ప్లాట్ ల ద్వారా సురక్షిత మంచి నీటి కోసం INTUC చేసిన కృషి పలిచిందని రాబోయే రెండు మూడు రోజుల్లో దానికి సంబందంచిన పనులు ప్రారంభం కాబోతున్నాయి అని అన్నారు.

RG-2 వైస్ ప్రెసిడెంట్ కొత్త స్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మపురి , దాస్ , వికాస్ కుమార్ యాదవ్ , శంకర్ నాయక్ , ఎత్తమ్ కృష్ణ, మార్కండేయ , కొంగర రవి , సత్తయ్య , గుండేటి శ్రీనివాస్ , సాగర్ ,ఉమేష్ , జాన్ , సాగర్ , అల్లావుద్దీన్ , శ్రీనివాస్ , మల్లికార్జున్ , ఆకుల రాజయ్య, రాజేందర్ , విజయ్ , సైదులు , రవీందర్ , అవినాష్ , వెంకటేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సింగరేణి లో ఇటీవలి కాలంలో ఇచ్చిన Extarnal నోటిఫికేషన్ లో వేసిన 139 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను సెకండ్ క్లాస్ సర్టిఫికెట...
04/03/2024

సింగరేణి లో ఇటీవలి కాలంలో ఇచ్చిన Extarnal నోటిఫికేషన్ లో వేసిన 139 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను సెకండ్ క్లాస్ సర్టిఫికెట్ హోల్డర్ ఉన్న ఇంటర్నల్ అభ్యర్థుల కు రాయడానికి అనుమతించాలని INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారిని కలిసి మెమొరాండం ఇచ్చిన డిప్లొమా హోల్డర్స్.

నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి అభివృద్ధి , ఉద్యోగాల కల్పన లో చూపిస్తున్న చొరవ చాలా హర్షించదగ్గ విషయంమని దానికి ప్రత్యేక శ్రద్ద చూపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సభండిత మంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ. INTUC పలు మార్లు చేసిన విజ్ఞప్తిల మేరకు సింగరేణి లో ఉన్న అన్నిఖాళీలను భర్తీ చేయాలని యాజమాన్యం ఒక నోటిఫికేషన్ ఇచ్చినందుకు గాను ఇటీవలి కాలం లో వెలువడిన extarnal నోటిఫికేషన్ లో 139 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులలో (గతంలో ఉన్న బ్యాక్ లాగ్ కలిపి ) వీటిలో గతంలో భర్తీ కానీ ఖాళీల దృష్ట్యా మరియు 2021 నుండి వీటిని పెండింగ్ లో పెడుతున్నారు.
సింగరేణి లో ఇప్పటికే చాలా మంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తున్నవారు అంతే కాకుండా దాదాపు 928 మంది డిప్లొమా చేసి సెకండ్ క్లాస్ హోల్డర్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఉన్నారని వారికి కూడా ఒక అవకాశం కల్పించాలని ఈ రోజు 200 మంది డిప్లొమా హోల్డర్స్ స్థానిక గోదావరిఖని లోని జనక్ భవన్ యందు INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారిని కలిసి కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన త్వరలోనే సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు , ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి , ధర్మపురి , సిడ్డంశెట్టి రాజమౌళి , కాంపెల్లి సమ్మయ్య , వికాస్ కుమార్ యాదవ్ , మరియు 200 మంది మైనింగ్ స్టాఫ్ సోదరులు పాల్గొన్నారు .

29/02/2024

RG-3 ఏరియా!

OCP-2 లో రెండు సైజ్లార్లు మెషీన్లు , మరియు ALP లో 3 సీమ్ ప్రారంభోత్సవంలో సింగరేణి C&MD శ్రీ బలరాం నాయక్ తో కలిసి పాల్గొన్న INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు.

ఈరోజు తేదీ 29- 2-24 గురువారం RG-3 ఏరియా లో ఉన్న OCP-2 కి సంబంధించిన రెండు సైజ్లార్లు మెషీన్లలను మరియు అదే ఏరియా కి సంబంధించిన ALP లో 3 సీమ్ ప్రారంభోత్సవంలో విశిష్ట అతిథులుగా హాజరైన INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు మాట్లాడుతూ .. సింగరేణి లో జనవరి 3 న C& MD గా బాధ్యతలు చేపట్టిన శ్రీ బలరాం నాయక్ గారు గడిచిన 2 నెలలలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చెప్పటారని దాని వల్ల సింగరేణి కార్మికులకు వారి పై ఒక నమ్మకం ఏర్పడిందని వారు కొత్త బొగ్గు గనుల ప్రారంభం కోసం కృషి చేస్తున్నారని 40 వేల మంది ఉన్న కార్మికులను కొత్త బొగ్గు గనుల ఏర్పాటు చేయటం ద్వారా 60 వేలకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని . మనం ఉత్పత్తి చేసే బొగ్గు NTPC కే కాకుండా అనేక రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుందని అంతే కాకుండా పక్క రాష్ట్రం లో ఉన్న నైని బొగ్గు బ్లాక్ క్యాప్టీవ్ మైన్ కింద కి వస్తుందని అక్కడ మనం బొగ్గు ఉత్పత్తి చేసి అమ్మలేమని కేవలం కరెంట్ ఉత్పత్తి కోసం ఉపయోగించవచ్చు అని బలరాం గారి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం తో 12000 వేల కోట్ల పెట్టుబడి తో అక్కడ 2400 మెగా వాట్స్ కరెంట్ ఉత్పత్తి చేస్తే 1000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అన్నారు అనంతరం ఇటీవల కాలంలో వెలువడిన ఎక్స్తార్ణల్ నోటిఫికేషన్ లో మైనింగ్ స్టాఫ్ , క్లరికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లో ఇంటర్నల్ అభర్తులకి అవకాశం కల్పించాలని మెమొరాండం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు P.ధర్మపురి , కాంపేళ్ళి సమ్మయ్య , వంగ లక్ష్మీపతి గౌడ్ , వికాస్ కుమార్ యాదవ్ , కోట రవీందర్ రెడ్డి , సదానందం , యట్టం కృష్ణ , పోచయ్య , అంజేనేయులు , కుమారస్వామి , కొమురయ్య , మహేష్ బాబు , శ్రీనివాస్ , స్థానిక INTUC నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

Address

Godavarikhani
505209

Alerts

Be the first to know and let us send you an email when INTUC SCMLU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category