06/04/2026
నిస్వార్ధ సేవకులైన శ్రీ గోరు సూర్య చంద్ర శేఖర్ గారు ఈ రోజు తనువు చాలించారు.ఆయనకు దీర్ఘకాలంగా ఉన్న Pancreatitis వ్యాధితో హాస్పిటల్ ICU లో చికిత్స పొందుతూ, మృత్యువుతో 20 రోజులు పోరాడి శివైక్యం అయ్యారు.
నిస్వార్ధ ఫౌండేషన్ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలలో శేఖర్ గారు చురుగ్గా పాల్గొనేవారు. మరీ ముఖ్యంగా, కరోనా కష్ట కాలంలో మరియు విజయవాడ వరదల సమయములో నిస్వార్ధ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్నో సేవాకార్యక్రమాలలో ఎంతగానో శ్రమించి, విశేష సేవలు అందించారు.
శేఖర్ గారి ప్రాణాలు ఎలా అయినా నిలబెట్టడానికి శత విధాలుగా ప్రయత్నించిన వైద్య బృందం అందరికీ కృతజ్ఞతలు 🙏🏻
అదే విధంగా, తక్కువ సమయంలోనే స్పందించి , శేఖర్ వైద్యానికి అవసరమయ్యే ఆర్ధిక అవసరతలకు సహకరించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు 🙏🏻🙏🏻
నిస్వార్ధ ఫౌండేషన్ ఒక గొప్ప సేవకుడిని కోల్పోవడమే కాక,
నేను కూడా ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయాను
ఈ లోటు ఎవరూ తీర్చలేనిది
పవిత్రమైన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ,
ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను 🙏🏻