16/05/2026
అమరావతి: "తమిళనాడు ఎన్నికలొచ్చి ఆయ న ముఖ్యమంత్రి కావడం ఏమోగానీ అందరూ నన్ను చంపేస్తున్నారు.. ఊళ్లో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్టు ఉంది. చాలా మంది ఏపీలో అలా చేసి ఉం డాలని నాకు మెసేజ్ పంపిస్తున్నారు. నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు. సమాజం లో మార్పు కోసం పెట్టాను' అంటూ జనసేన అధ్య క్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యా నించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యక ర్తలు, నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగిం చారు. తమిళనాడు పరిస్థితులు వేరని కార్యకర్తలకు వివరించారు. 2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఏమైంది? రెండు చోట్ల ఓడించారు కదా అని పేర్కొ న్నారు. "తమిళనాడుతో మనకు పోలికేంటి? నిజం గా నాకు పదవే ప్రాధాన్యం అనుకుంటే, 2008లో,
2014లోనే ఎంపీగా పోటీ చేసేవాడిని. ఒక పార్టీని నడ పాలంటే ఎంత సత్తా ఉం డాలి? అన్నీ నిర్ణయించుకుని ఒక దశాబ్దం నలుగుతానని నిలబడ్డా' అంటూ పేర్కొ న్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉన్నా..
"పొత్తులో సమస్యలు ఉన్నాయి. ఆయన (చంద్రబా బు)తో చాలా అంశాల్లో విభేదించొచ్చు. ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉంది. కానీ ఆయనను జైల్లో పెట్టి నప్పుడు ఒక కీలక పరిస్థితి. చాలా ఆలోచించే పొత్తు నిర్ణయం తీసుకున్నా. పదవులు, వీటన్నింటి కంటే ప్రజల సుస్థిరతే ముఖ్యమనుకున్నా. పొత్తులో మీకు ఉన్న ఇబ్బందులను నేను అర్థం చేసుకోగలను. వాటిని పార్టీ సరిదిద్దుతుంది. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని చేయను. మీ గౌరవానికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది, ఇబ్బందులున్నా. మనమంతా బలమైన కూటమి వెంట వెళ్లాల్సిందే.
స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. కూటమి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి.' అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
నా కోసం ఎదురు దాడి చేయండి
'నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తే ఎదురు దాడి చేయండి. నేను ఒక కులం కోసం పని చేయడానికి రాలేదు. సమసమాజం కోసమే రాజకీ యాల్లోకి వచ్చా. మాట్లాడితే వంగవీటి రంగా గురిం చి మాట్లాడతారు. ఆ రోజు ఆయనకు ఇబ్బంది. ప్రాణహాని ఉందని అంటే ఆయన చుట్టూ దడికట్టలే కపోయారు. మనిషి బతికి ఉన్నప్పుడు రక్షించుకోలే కపోయారు. నేను ఒక కులం కోసమే పని చేసి, ఆ కులం అంతా ఓట్లు వేస్తే రెండు చోట్ల నేను ఓడిపో కూడదు కదా? పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి. ప్రతీ నియోజకవర్గంలో ఐదుగురు సభ్యు లతో పార్టీ పాలక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ సమావేశాల్లో నేను స్వయంగా పాల్గొంటా, తొలుత 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ శ్రే ణులతో మాట్లాడతా' అంటూ పవన్ వివరించారు.
Credit:sakshi