22/12/2025
*Ⓜ️🚩గంజాయి బారి నుండి విద్యార్థులను - యువతను కాపాడుదాం*
...*యుటి ఎఫ్ కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా గౌరవ ఎస్ పి శ్రీ సతీష్ కుమార్ గారు*
*బావి భారత పౌరులైన విద్యార్థులను, యువకులను గంజాయి మహమ్మారి నుండి కాపాడి దేశ భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని గౌరవ ఎస్ పి శ్రీ సతీష్ కుమార్ గారు గారు పిలుపునిచ్చారు.*
*ఈ సందర్భంగా SP శ్రీ సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ గంజాయి మహమ్మారిని తరిమికొడదాం అనే కరపత్రాన్ని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శులు నారాయణస్వామి , తాహిర్ వలి ,లక్ష్మీనారాయణ, నాయకులు బాబు ఆత్మీయ ట్రస్టు సభ్యులు, హర్జిత్ ప్రణవ్ , తో కలిసి ఆవిష్కరించడం జరిగింది.*
*ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ ఒకప్పుడు కొన్ని వయసుల వారికి, కొన్ని వ్యవస్థలకే పరిమితమైన మత్తు పదార్థాలుయువతను విద్యార్థులను సైతం బానిసలు చేస్తున్నది. అందులో ముఖ్యంగా గంజాయి ప్రధాన పాత్ర పోషిస్తున్నదని, అభం - శుభం తెలియని చిన్న పిల్లలు సైతం గంజాయికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.*
*రాష్ట్ర కార్యదర్శి జయ చంద్రా రెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడంతోపాటు, దేశ భవిష్యత్తును కాపాడాల్సిన యువత ఈరోజు గంజాయి మత్తుకు బానిసై వినాశకర దోరణల వైపు పయనిస్తోందని, దీనిని ప్రజలందరూ ముక్తకంఠంతో ఎదుర్కోవాలని తెలిపారు.*
*సామాజిక స్పృహ కలిగిన సంఘమైన యుటిఎఫ్ భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుంచి కాపాడడం కోసం రెండు లక్షల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయడం అభినందనీయమని ఎస్పీ గారు తెలిపారు*
*ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్ర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ జిల్లా కోశాధికారి డి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు తాహిర్ వలి, నారాయణస్వామి, లక్ష్మీనారాయణ, బాబు మరియు ఆత్మీయ ట్రస్ట్ సభ్యులుహరిజీత్ ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు*