13/06/2026
స్వామివారి ఆదేశాలు
పరమాచార్య స్వామివారిని 1934-39లో కుంభకోణంలో నేను పాఠశాలలో ఉన్నప్పుడు మూడు మార్లు దర్శనం చేసుకున్నాను. 1939-1944 మధ్యలో వైద్యకళాశాల విద్యార్థి దశలో మరో రెండు సార్లు దర్శనం చేసుకున్నాను మావూరు పిల్లూర్ నుండి వెళ్తున్నప్పుడు పెరళంలో. స్వామివారు ఒకసారి మా మామగారిని అడిగారు అంట ఎందుకు నీ పిల్లూర్ అల్లుడు దర్శనానికి రావడంలేదని. బహుశా అప్పుడే అంటే 1950ల నుండి అనుకుంటా దాదాపు ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకుంటున్నాను. గత ముప్పైఅయిదు సంవత్సరాలుగా స్వామివారు ఎక్కడున్నా వారి దర్శనం కోసం వస్తుంటానని పలుమార్లు వేరేవారితో చెప్పేవారు స్వామివారు. మఠానికి వెళ్ళి వచ్చావా అని ఒక్కోసారి అడిగేవారు స్వామివారు. దాంతో, ఎప్పుడు బయట ఊరు వెళ్ళినా ముందు మఠానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. స్వామివారి దర్శనం కోసం రెండుసార్లు పండరీపురం, ఒకసారి కర్నూలుకు వెళ్ళాను.
కీళంబి పునర్నిర్మాణ సంఘం (శివాలయం, విష్ణు ఆలయం, అధిష్టానం) అధ్యక్షుడుగా దాదాపు ప్రతీరోజూ స్వామివారిని దర్శించుకునేవాణ్ణి. అంబాపతీశ్వర దేవాలయం పొలాల మధ్యలో ఉంది. వెంగల పిళ్ళయార్ గురించి స్వామివారు అడిగినప్పుడు, దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఆ మూర్తిని తీసివేయడంతో ఆ పరిసరాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలం మఠం ఖరీదు చేయడానికి అవకాశం ఉందేమో కనుక్కోమన్నారు కానీ ఆ యజమాని అందుకు ఒప్పుకోలేదు.
తేనాంబాక్కం వెళ్ళే దారిలో పొలాలలో ఎక్కడైనా శివలింగాలు చూశానేమో అని ఒకసారి స్వామివారు అడిగారు. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే కాంచీపురం చుట్టుపక్కల ప్రాంతాలలో నిరాదరణకు గురైన శివలింగాలను తరలించడానికి స్వామివారు ప్రణాళికలు సిద్ధం చేశారు అని. ఒకసారి మా అమ్మాయి తంగిలోని కామకోటీశ్వర మందిరం బలాలయానికి 1500 రూపాయలు విరాళం ఇచ్చింది. దాంతో స్వామివారు తనని తంగి ఆలయం కట్టించినది అని పిలిచేవారు.
చెయ్యర్ లో ఉన్న వేదపురీశ్వర దేవాలయంలో అక్కడి వేదపాఠశాల విద్యార్థుల సహాయంతో, ప్రదోషం నాడు అభిషేకం నిర్వహించాలని స్వామివారు సూచించారు. అలాగే దేవాలయంలో ఉన్న అన్నీ విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు జరిపి ప్రాకారోత్సవం జరిపించాలని ఆదేశించారు. మరుసటిరోజు ఉదయం స్వామివారు నన్ను, “ఏ వేదపాఠశాల నుండి విద్యార్థులు వచ్చారు? గ్రామస్తులు ఎవరెవరు వచ్చారు? ఇంటికి తెరిగివెళ్ళేటప్పటికి ఎంత సమయం అయ్యింది?” వంటి వివరాలన్నీ అడిగేవారు. ఇలా కొన్ని సార్లు జరిగిన తరువాత ఒకరోజు ఉదయం నన్ను ఇక అక్కడకు వెళ్లనవసరం లేదని చెప్పారు స్వామివారు. మరలా నాకు తెలిసింది ఆ దేవాలయం పునర్నిర్మాణం పనులు మొదలయ్యాయి అని.
శివరాత్రిరోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో ‘రామ జపం’, శివాలయంలో ‘శివ నామ జపం’ యువత చేత అహోరాత్రం ఏర్పాటు చేయించమని ఆదేశించారు స్వామివారు. ఆంగ్లంలో స్వామివారికి వచ్చే ఉత్తరాలని స్వామివారికి చదివి వినిపించేవాణ్ణి. మూడు దేవాలయాల్లో వారానికి మూడు సార్లు జరిగే పిడికెడు బియ్యం కార్యక్రమంలో ఉండేవాణ్ణి.
--- డా. వి. రాజగోపాలన్. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#కంచిపరమాచార్యవైభవం