12/12/2025
పంచాయితీ కార్మికులకు ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాలి- సిఐటియు,డిమాండ్
31,మంది నూతన కమిటీ ఎన్నిక,
గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, జిల్లా 3వ మహాసభ,నేడు గణేనాయక్ భవన్, సిఐటియు జిల్లా కార్యాలయం నందు జరిగింది. ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుంచి పంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి. వెంకట్రామయ్య, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ. నల్లప్ప, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్వి.నాయుడు, జిల్లా కోశాధికారి నాగమణి, జిల్లా ఉపాధ్యక్షులు మన్నిల రామాంజనేయులు,పాల్గొని వారు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు పరిశుభ్రoగా ఉన్నాయంటే గ్రామపంచాయతీ కార్మికుల శ్రమ వల్లేనని, పంచాయతీలు నమ్ముకుని అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న నేటికీ కనీస వేతనాలు కానీ, పీఎఫ్,ఈఎస్ఐ, లేవని, కార్మికులు చనిపోతే అంతక్రియలకు డబ్బులు ఇచ్చే వారు కూడా లేరని, ఇచ్చే అరకొర వేతనాలు నెలలు తరబడి బకాయిపెట్టారని, అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు పెరిగాయని, వీటిని సంఘం ఆధ్వర్యంలో కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తుందని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రాష్ట్రంలో శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నారని, ఎనిమిది గంటల పని రద్దుచేసి,10 గంటలు పని పెంచి అసెంబ్లీలో జీవోలు పాస్ చేశారని, కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని,మండిపడ్డారు. కేరళ ప్రభుత్వం తరహాలో అసెంబ్లీలో లేబర్ కోడ్లు రద్దు చేయాలని, తీర్మానం చేయాలని, డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీకార్మికుల సమస్యలు చర్చించడానికి తీరిక లేదని,ఎద్దేవ చేశారు. రానున్న రోజుల్లో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మహాసభ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.. యూనియన్ గౌరవాధ్యక్షులుగా గోపాల్,
నూతన అధ్యక్షులుగా మధు, ప్రధాన కార్యదర్శిగా శివప్రసాద్. కోశాధికారిగా నూర్ బాషా, ఉపాధ్యక్షులుగా వీరాంజి, ఎర్రి నాగప్ప, స్వామి, నాగభూషణ, ఆది, కుల్లాయమ్మ, సహాయ కార్యదర్శులుగా బాలాజీ నాయక్, రామకృష్ణ, పెద్దన్న, నల్లప్ప, సంధ్య భాయ్, కమిటీ సభ్యులుగా మూర్తి ,నాగేంద్ర, సుబ్రహ్మణ్యం ,పవిత్ర, పవన్ కళ్యాణ్, ఆదినారాయణ, నారాయణస్వామి, నాగరాజు, నారాయణ స్వామి, ఆదేప్ప,వీరాంజి, కదిరయ్య ,సుధాకర్ ,నాగమణి ,శంకర్ నాయక్, నల్లప్ప, తదితరులు ఎన్నుకున్నారు..
నమస్కారములతో, గ్రామపంచాయతీ యూనియన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు.
హెచ్.మధు
కే.శివప్రసాద్.