RAAMA RAAJYAM FOUNDATION

RAAMA RAAJYAM FOUNDATION రామ రాజ్యం ఫౌండేషన్

16/06/2026

ఈ నృత్యాన్ని శ్రద్ధగా గమనించండి. షాంఘైలోని డిస్నీల్యాండ్‌లో ఈ నృత్య ప్రదర్శన జరుగుతోంది. వీరు మనుషులు కాదు, చైనాలో తయారైన రెండు రోబోలు. ఈ నృత్యం కేవలం ఐదు నిమిషాల పాటు సాగుతుంది, కానీ దీన్ని చూసేందుకు టికెట్ కొనడానికి మాత్రం 4 గంటల సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రదర్శన టికెట్ ధర 499 యువాన్లు (సుమారు 75 డాలర్లు). ఈ రోబోల ముఖ కవళికలు అద్భుతంగా ఉండి, నిజమైన మనుషులకూ వీటికీ మధ్య తేడాను గుర్తించడం కష్టంగా ఉంటుంది.

15/06/2026
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ॥శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే ।సర్వస్య...
14/06/2026

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ॥
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే ।
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే ॥
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే ।
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే ॥
రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టా ।
రుష్టా తు కామాన్ సకలాన్ అభీష్టాన్ ।
త్వామాశ్రితానాం న విపన్నరాణాం ।
త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ॥
ఫలశృతి: ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే దుర్గామాత అనుగ్రహం, ధైర్యం, శాంతి మరియు కష్టాల నుండి రక్షణ లభిస్తాయని నమ్మకం.
జై మాతా దుర్గా!

13/06/2026

ఫోన్ పేలిపోయింది

మనసును మించిన తీర్థం లేదు శరీరాన్ని మించిన క్షేత్రం లేదు అంతరాత్మను మించిన గురువు లేరు జీవితాన్ని మించిన గ్రంథము లేదు శి...
13/06/2026

మనసును మించిన తీర్థం లేదు శరీరాన్ని మించిన క్షేత్రం లేదు అంతరాత్మను మించిన గురువు లేరు జీవితాన్ని మించిన గ్రంథము లేదు శివోహం..!

ఈ చిన్న వాక్యాలలోనే సంపూర్ణ ఆధ్యాత్మిక జీవన సారం నిక్షిప్తమై ఉంది. బాహ్య ప్రపంచంలో వెతికే పవిత్రత, దైవత్వం, జ్ఞానం, మార్గదర్శనం—ఇవన్నీ చివరికి మనలోనే ఉన్నాయని గుర్తు చేసే మహోన్నత సందేశం ఇది.

✨ మనసును మించిన తీర్థం లేదు…

తీర్థయాత్రలు మనసుకు ప్రశాంతతను, భక్తిని కలిగిస్తాయి. పవిత్ర నదుల్లో స్నానం చేస్తాం, దేవాలయాలను దర్శిస్తాం. అయితే మనసులో ద్వేషం, అసూయ, అహంకారం, కోపం, స్వార్థం నిండి ఉంటే ఆ తీర్థయాత్రల ఫలితం అసంపూర్ణంగానే మిగులుతుంది.

మనసు పవిత్రమైతే ప్రతి ప్రదేశమూ తీర్థమే.
మనసు నిర్మలమైతే ప్రతి శ్వాసా ప్రార్థనే.
మనసు దైవస్మరణలో నిలిస్తే ప్రతి క్షణమూ యాత్రే.

అందుకే నిజమైన తీర్థస్నానం అంటే మనసులోని మలినాలను కడిగి, ప్రేమ, కరుణ, క్షమ, దయ వంటి సద్గుణాలను పెంపొందించుకోవడం.

🌺 శరీరాన్ని మించిన క్షేత్రం లేదు…

దేవాలయం పవిత్రమైన క్షేత్రమైతే, ఈ మానవ శరీరం దైవం నివసించే సజీవ ఆలయం. ఈ శరీర ద్వారానే ధ్యానం, జపం, సేవ, దానం, సాధన అన్నీ సాధ్యమవుతాయి. ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే దైవసాధనకు లభించిన అపూర్వ అవకాశాన్ని నిర్లక్ష్యం చేసినట్లే.

శరీరాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా, సాత్వికంగా ఉంచుకోవడం కూడా ఒక యోగమే.
ఎందుకంటే—

"దేహో దేవాలయః ప్రోక్తః"అంటే, ఈ దేహమే దేవాలయమని మహర్షులు ఉపదేశించారు.

🔥 అంతరాత్మను మించిన గురువు లేరు…

బాహ్య గురువు మార్గాన్ని చూపుతారు. సందేహాలను నివృత్తి చేస్తారు. కానీ ఆ ఉపదేశాన్ని సత్యంగా అనుభవించేది అంతరాత్మే.

మనలోని వివేకం, ధర్మబుద్ధి, సాక్షి భావం—ఇవే అంతర్గత గురువు యొక్క స్వరాలు.

నిశ్శబ్దంలో మనసు ప్రశాంతమైనప్పుడు, ఏది సత్యం? ఏది అసత్యం? ఏది ధర్మం? ఏది అధర్మం? అనే జవాబులు మన అంతరంగం నుంచే ఉద్భవిస్తాయి.

అందుకే నిజమైన గురుభక్తి అనేది బాహ్య గురువు చూపిన మార్గాన్ని అంతరాత్మలో జీవించడం.

📖 జీవితాన్ని మించిన గ్రంథము లేదు గ్రంథాలు జ్ఞానాన్ని ఇస్తాయి. కానీ జీవితం ఆ జ్ఞానాన్ని అనుభవంగా మారుస్తుంది.

విజయం #వినయాన్ని నేర్పుతుంది.వైఫల్యం సహనాన్ని నేర్పుతుంది.బాధ కరుణను పెంచుతుంది.సంబంధాలు ప్రేమ విలువను తెలియజేస్తాయి. కాలం #అనిత్యతను బోధిస్తుంది.

ప్రతి సంఘటన ఒక పాఠం. ప్రతి మనిషి ఒక గురువు.ప్రతి అనుభవం ఒక అధ్యాయం.

జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించినవారికి, అది తెరిచి ఉన్న మహాగ్రంథంగా కనిపిస్తుంది.

🕉️ శివోహం..!

" #శివోహం" అంటే — "నేనే శివస్వరూపుడను" అనే అహంకార ప్రకటన కాదు;
"నా నిజ స్వరూపం శుద్ధ చైతన్యం; నేను పరిమిత భయాలు, బాధలు, అహంకారానికి అతీతమైన ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను" అనే ఆత్మజ్ఞాన స్మరణ.

ఇది ఇతరుల కంటే గొప్పవాడిననే భావం కాదు; సమస్త జీవుల్లోనూ అదే దివ్య చైతన్యం ఉందనే అద్వైత దృష్టి.

మనసును పవిత్రం చేసుకో…శరీరాన్ని దేవాలయంలా సంరక్షించుకో…అంతరాత్మ స్వరాన్ని ఆలకించ జీవితం నేర్పే పాఠాలను వినమ్రంగా స్వీకరించూ అప్పుడు తెలుసుకుంటావు.

వెతుకుతున్న శివత్వం ఎక్కడో దూరంలో కాదు, నీలోనే ప్రకాశిస్తోంది.

శివోహం… శివోహం… శివోహం…! 🕉️

జై శ్రీ రామ్ 🚩సీతారామకళ్యాణ మహోత్సవ ఘట్టము:వశిష్ఠుడు మంత్రపూర్వ కముగ వేది యందు అగ్ని హోమము చేసిన తర్వాత జనకుడు సర్వాభరణ ...
05/06/2026

జై శ్రీ రామ్ 🚩

సీతారామకళ్యాణ మహోత్సవ ఘట్టము:

వశిష్ఠుడు మంత్రపూర్వ కముగ వేది యందు అగ్ని హోమము చేసిన తర్వాత జనకుడు సర్వాభరణ భూషితు రాలైన సీతను అగ్నిసమక్షమున రామునికి ఎదురుగ నిలబెట్టుతాడు. "రామా!ఇదిగో నా కుమార్తె సీత. ఈమె నీ సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపుము.నీ హస్తముతో ఈమె హస్తమును పట్టు కొనుము.

మహాభాగ్యవంతు రాలగు ఈమె ప్రతివ్రతయై నీడ వలె సర్వదా నిన్ననుసరించి యుండగలదు"అని పలికి మంత్రపూతమైన జలము వదులుతాడు, జనకుడు. దేవతలు ఋషులు 'బాగు బాగు' అని పలుకుతారు. దేవ
దుందుభులు మ్రోగుతాయి. పుష్ప వర్షం కురుస్తుంది.
అటు పిమ్మట లక్ష్మణనితో ఊర్మిళ హస్తమును స్వీకరించమని, భరతునితో మాండవి చేయి అందుకోమని, శత్రుఘ్నునితో శృతకీర్తి చేయి పట్టుకోమని చెబుతాడు, జనకుడు.

"ఓ రామలక్ష్మణభరత శత్రుఘ్నులారా!మీరందరును సౌమ్యులు. మంచి నడవడిక, నియమాలు కలవారు. మీ భార్యలను స్వీకరింపుడు ఆలస్యం చేయ వలదు"అని అంటాడు ఆయన.

జనకుని మాటలు వినిన నల్గురు రాజకుమారులు వశిష్ఠుని అనుమతి పొంది నల్గురు కన్యలహస్తములు గ్రహించి, భార్య సమేతులై అగ్నికి వేదికిని, జనకకునికి, ఋషులకును,ప్రదక్షిణ చేసి వశిష్ఠాదులు చెప్పిన విధము గా వివాహం చేసికొనిరి.

ఆకాశము నుండి గొప్ప పుష్ప వృష్టి కురిసింది. స్వర్గమందు దుందుభులు మ్రోగుతాయి.
గీతమంగళవాద్యధ్వనులతో అప్సరసలు నాట్యము
చేస్తారు. గంధర్వులు మధుర గానము చేస్తారు.

ఈ విధంగా తూర్యాదిధ్వని ప్రవర్తిల్లుచూ ఉండగా రామ,లక్ష్మణ, భరత శత్రుఘ్నులు మూడు మార్లు అగ్ని ప్రదక్షిణములు చేసి భార్యలను వివాహము చేసి కొంటారు.


కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు. కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత...
05/06/2026

కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు.

కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి శ్రీ కృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత.

బేసిగ్గా ఒక సినిమా పాట మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ ఆర్నెల్లకు పాచిపోతుంది. ఒక నవల ఏడాది తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం, ఇగిరిపోని గంధం భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.

ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.

సపోజ్ వ్యాపారమే తీసుకుందాం. అందులో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? బిజినెస్ గురించి దిగ్గజాలంతా చెప్పిన సూత్రాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అర్జెంటుగా గూగుల్ లో వెతకుతాం. అంతేగానీ మనకు ఇన్ బిల్ట్ ఉన్న మేథోవారసత్వాన్ని పట్టించుకోం.

ఇక్కడ సమస్య అదే. ఒక మంచిమాట తెలుసుకోడానికి టెక్నాలజీ మీద ఆధారపడతాం కానీ వారసత్వ మూలల్లోకి ఎందుకు వెళ్లం?

సార్వజనీన సత్యాలను సెర్చింజన్ లో దేవులాడుతాం కానీ పుస్తకాల్లోంచి ఎందుకు కోట్ చేసుకోం?

మనకు ఎన్నో గొప్పగొప్ప గ్రంధాలున్నాయి. (మతపరమైనవి కావొచ్చు, కాకపోవచ్చు) వాటిద్వారా నాలెడ్జ్ ఎందుకు సమపార్జించుకోం?

ఇందాక, పైన పేర్కొన్నట్టు భగవద్గీత ఉంది. అది ఒక్క మనకే కాదు. యావత్ ప్రపంచానికీ ఆ బుక్ యాక్సెస్ అవుతుంది. ఎన్నటికీ తరగని మేథో నిధి ఆ గ్రంథం. వందల శ్లోకాలు ఔపోసన పట్టాల్సిన పనిలేదు. బట్టీ పట్టి కంఠశోష తెచ్చుకోమనడం లేదు. ఒక నాలుగైదు శ్లోకాలు చాలు. అవి డీకోడ్ చేసుకుంటే బస్. వ్యాపారం మూడు పువ్వులు - ముప్పై ఆరు కాయలవుతుంది. నమ్మబుద్ది కావడం లేదు కదా. అయితే ఒక్కసారి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి

అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.

ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది. ప్రతీ వ్యాపారి ఇదే సూత్రం మీద పనిచేయాలి. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప.. ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు. అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు. ఆశ పడటం తప్పు కూడా కాదు. కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం. చేయాల్సింది చేయాలి. ఫలితం సంగతి తర్వాత. ముందు ధైర్యంగా అడుగేయాలి. అంతేకానీ అమ్మో అని భయపడి మధ్యలోనే జారుకుంటే ఎన్నటికీ గమ్యం ముద్దాడలేం.

“వాసంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ”

అంటే,"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. వెర్సటాలిటీ చూపించాలి. దేన్నయినా స్వీకరించేలా ఉండాలి. అవే సక్సెస్ రుచి చూపిస్తాయి. ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడూ గమనించాలి. కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం- నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు. అలా కాకుండా కొత్తదాని కోసం అన్వేషించాలి. కొత్తదనాన్ని చదివేయాలి. కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలి. అదే నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం. బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం. వ్యాపారి నిరంతర పథికుడు. నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్ధం కాదు. మొండిగా ఉండొద్దు. ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. సంకుచిత భావాలు వదిలేయాలి. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి. అప్పుడే గమనం వేగం అందుకుంటుంది.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి

అంటే, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం.

ఇదొకయాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది. ఆంట్రప్రెన్యూర్లకు మస్టుగా ఉండాల్సిన లక్షణం. లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు. మైండ్ లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది. ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పుకుంటాం. అందరిముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. టెంపర్ ని అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు.

తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |
ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||

కాబట్టి, చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భ‌గ‌వానుడు

వ్యాపారమూ అంతే. ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అవసరమైతే జత కలవాలి. బలం పెంచుకోవాలి. అత్యాశకు పోవద్దు. వీలైనంత క్రియేటవివ్ గా ఉండాలి. ఇన్నవేటివ్ గా ఆలోచించాలి. మార్కెట్ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలి. అంతేగానీ బైనాక్యులర్ పట్టుకుని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు.

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||

అంటే- పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు వెతుక్కోవాలే గానీ ఇందులో బోలెడంత నిగూఢార్ధం దాగివుంది. కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒకచోట మంట అంటుకుంది అనుకుందాం. వెంటనే పొగ దాన్ని కప్పేస్తుంది. ఎదురుగా వుండే అద్దం మీద ధూళి- నిప్పును, పొగను రెండింటినీ దాచేస్తుంది. అంతులేని కోరికలు నాలెడ్జ్ ని కిల్ చేస్తాయి. అంతేకదా మరి.

ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. విచక్షణా జ్ఞాన‌మే వ్యాపారం.

#భగవద్గీత

శ్రీలలితా సహస్రనామంలోని తొలి ఐదు నామాల అర్థం తెలిస్తే అమ్మవారి మహిమపై మీ భక్తి మరింత పెరుగుతుంది! ప్రతి నామంలో దాగి ఉన్న...
04/06/2026

శ్రీలలితా సహస్రనామంలోని తొలి ఐదు నామాల అర్థం తెలిస్తే అమ్మవారి మహిమపై మీ భక్తి మరింత పెరుగుతుంది! ప్రతి నామంలో దాగి ఉన్న శక్తి, జ్ఞానం, కరుణ గురించి తెలుసుకోండి...

శ్రీలలితా సహస్రనామ స్తోత్రం భాష్యము –

అమ్మవారి నామాలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
శ్రీలలితా సహస్రనామంలో ఉన్న ప్రతి నామం ఒక మంత్రం, ఒక శక్తి, ఒక జీవన మార్గదర్శకం. వాటిలోని కొన్ని విశిష్ట నామాల భావాన్ని తెలుసుకుందాం.

🌸 1. శ్రీమాతా సమస్త జగత్తుకు తల్లిగా నిలిచే పరాశక్తి. సృష్టి, స్థితి, లయలకు మూలకారణమైన జగన్మాతను "శ్రీమాతా" అని స్తుతిస్తారు. తల్లిని స్మరించినవారికి కరుణ, రక్షణ, ఆశీర్వాదం లభిస్తాయి.
🌸 2. శ్రీమహారాజ్ఞి సకల లోకాలపై పరిపాలన చేసే దివ్య చక్రవర్తిని. జగత్తును ధర్మమార్గంలో నడిపించే పరమాధికార స్వరూపిణి అమ్మవారు. ఈ నామం నాయకత్వం, విజయం, గౌరవాన్ని ప్రసాదిస్తుంది.
🌸 3. శ్రీమత్సింహాసనేశ్వరీ సింహాసనంపై ఆసీనురాలై సర్వలోకాలను పాలించే మహాదేవి. సింహం ధైర్యానికి, సింహాసనం పరమాధికారానికి ప్రతీకలు. ఈ నామాన్ని స్మరించడం ద్వారా ఆత్మవిశ్వాసం, స్థిరత్వం పెరుగుతాయి.
🌸 4. చిదగ్నికుండసంభూతా చైతన్యాగ్నిరూపమైన పరబ్రహ్మ తత్త్వం నుండి అవతరించిన దివ్యశక్తి. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని ప్రసాదించే స్వరూపం.
🌸 5. దేవకార్యసముద్యతా దేవతల కార్యసిద్ధి కోసం అవతరించిన అమ్మవారు. భక్తుల కష్టాలను తొలగించి ధర్మరక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ నామం కార్యసిద్ధి, విజయం, దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది.

ఈ ఐదు నామాలను ప్రతిరోజూ భక్తితో జపిస్తే మన జీవితంలో శాంతి, ధైర్యం, జ్ఞానం, విజయాలు ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ" 🌺
✨ అమ్మవారి కృప మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాము.
శ్రీ మాతా సింహాసనేశ్వరి 🙏🌸

#శ్రీలలితాసహస్రనామం #లలితాదేవి #శ్రీమాతా #శ్రీమహారాజ్ఞి #శ్రీమత్సింహాసనేశ్వరీ అమ్మవారికృప సనాతనధర్మం bhakthi changeyourthoughts powerofprayer mindset selfimprovement

Adresse

Ameerpet, Hyderabad
Democratic Republic Of The
5000075

Téléphone

+918143588886

Site Web

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque RAAMA RAAJYAM FOUNDATION publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L’organisation

Envoyer un message à RAAMA RAAJYAM FOUNDATION:

Partager