09/10/2024
*క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్య పై చర్చించాలి*
*ముఖ్యమంత్రి ఎన్నికల హామి నిలబెట్టుకోవాలి.*
*క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటన రాకుంటే*
*చలో సీఎం క్యాంప్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య,*
క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్య పై చర్చించాలని,ముఖ్యమంత్రి ఎన్నికల హామి నిలబెట్టుకోవాలని,క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటన రాకుంటే చలో సీఎం క్యాంప్ కార్యాలయం చేపడతాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగుజ్జుల ఈశ్వరయ్య,తెలిపారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల హామీల ప్రకారం 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని
రాజకీయ ఒత్తులకు రాజీనామా చేసిన వాలంటీర్లు కొనసాగించాలని,4 నెలల గౌరవ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని,గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటిర్స్ చేత అటెండెన్స్ అనేది క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్స్ ను రాజకీయ పార్టీల ముసుగులో కాకుండా ఎవరు అధికారంలో ఉన్న ప్రజలకు సేవ చేయడమే మా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామే తప్ప ఇంకోటి కాదు రాజకీయరంగు మా వాళ్లకు పుయ్యకండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే బకాయి గౌరవ వేతనాలు ఇవ్వాలి, పరిష్కరించకపోతే నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. 10 న జరుగనున్న క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్లకు న్యాయం చేయకపోతే అన్ని జిల్లాల వాలంటరీలను సంఘటితం చేసి చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని తెలియజేశారు..