Voice of bahujana telangana

Voice of bahujana telangana తెలంగాణ బహుజనుల గొంతును బలంగా వినిపించడం. అంతిమంగా బహుజనులకు రాజ్యాధికార సాధన మా ముఖ్య లక్ష్యం
Founder Shiva Shankar Yadav Myakala

01/07/2026
His lifelong commitment to social justice, empowerment of marginalized communities, and democratic values continues to i...
11/06/2026

His lifelong commitment to social justice, empowerment of marginalized communities, and democratic values continues to inspire millions across India.

On the occasion of his 79th birthday, we extend our heartfelt greetings to Shri Lalu Prasad Yadav Ji.

May he be blessed with good health, happiness, and a long life as he continues to serve the people and uphold the ideals of social justice, equality, and democracy.

Happy 79th Birthday, Shri Lalu Prasad Yadav Ji!

Your leadership, vision, and unwavering dedication to the welfare of the underprivileged remain a source of inspiration for generations.

తరతరాలుగా సామాజిక అన్యాయానికి గురవుతున్న SC, ST, BC వర్గాలకు ఆర్థిక సమానత్వం కలగాలంటే "భూమి" పంపిణీ ఒక్కటే మార్గం. కానీ ...
08/05/2026

తరతరాలుగా సామాజిక అన్యాయానికి గురవుతున్న SC, ST, BC వర్గాలకు ఆర్థిక సమానత్వం కలగాలంటే "భూమి" పంపిణీ ఒక్కటే మార్గం. కానీ నేడు లక్షలాది ఎకరాల భూములు పేదలకు దక్కకుండా వివిధ బోర్డుల గుత్తాధిపత్యంలో బందీ అయి ఉన్నాయి.
మండల్ ఆర్మీ డిమాండ్ చేస్తున్న "సమగ్ర భూ సంస్కరణల" జాబితా ఇదే:
📍 రద్దు కావాల్సిన బోర్డుల పరిధి & పంపిణీ కావాల్సిన భూములు:
1️⃣ అసైన్డ్ భూములు: నిరుపేదలకే పూర్తి హక్కులు కల్పించాలి.
2️⃣ మిగులు భూములు (Ceiling Surplus): గరిష్ట పరిమితికి మించి ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి.
3️⃣ ధార్మిక/మత సంస్థల భూములు: దేవదాయ (Endowment), వక్ఫ్ (Waqf), మరియు చర్చి (Church) భూములను, ఇతర మతపరమైన ట్రస్టుల ఆధీనంలో ఉన్న అదనపు భూములను సామాజిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.
4️⃣ కాందిశీకుల భూములు (Evacuee Property): ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఈ భూములను పేదలకు అప్పగించాలి.
5️⃣ భూదాన్ & బంజరు భూములు: సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి అంగుళం భూమిని నిరుపేదలకు పంపిణీ చేయాలి.
📢 మా స్పష్టమైన డిమాండ్:
భూమి మీద హక్కు కేవలం కొద్దిమంది ఆధీనంలోనో, బోర్డుల పరిధిలోనో ఉండకూడదు. భూమి పండించే వాడికే సొంతం కావాలి. అప్పుడే పేదల జీవనోపాధి మెరుగుపడుతుంది, సామాజిక గౌరవం దక్కుతుంది.
"వనరుల పంపిణీలో సమానత్వం - మండల్ ఆర్మీ నిరంతర పోరాటం"
జై మండల్! ✊

మండల్ ఆర్మీ

01/05/2026

కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసి
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే, నా విరుతించే
నా వినిపించే నవీనగీతికి
నా విరచించే నవీన రీతికి
భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం
- శ్రీ శ్రీ
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు Shiva Shankar Yadav Myakala

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన గాత్రంతో ప్రజలను చైతన్యపరిచిన అమర గాన కోకిల, భువనగిరి ముద్దుబిడ్డ బెల్లి లలితక్క జయంతి సందర్భం...
29/04/2026

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన గాత్రంతో ప్రజలను చైతన్యపరిచిన అమర గాన కోకిల, భువనగిరి ముద్దుబిడ్డ బెల్లి లలితక్క జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు.

తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి, పాటను ఆయుధంగా మార్చి పోరాడిన ఆ మహనీయురాలు నాటి పాలకుల కుట్రలకు బలై, అమానుషంగా 17 ముక్కలుగా నరకబడి హత్య చేయబడిన ఘటన మన చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేనిది. ఆమె త్యాగం, ఆమె గాత్రం, ఆమె ధైర్యం తెలంగాణ ఉద్యమానికి శాశ్వత ప్రేరణగా నిలిచాయి.

లలితక్క చూపిన దారిలో నడుస్తూ, ఆమె కలల తెలంగాణను మరింత బలంగా నిర్మించుకోవడం మనందరి బాధ్యత.

అమరజీవి బెల్లి లలితక్కకు జయంతి సందర్భంగా ఘన నివాళులు.
జై తెలంగాణ!

తెలంగాణ ప్రభుత్వం 2024 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కుల సర్వేలో అనేక ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్...
24/04/2026

తెలంగాణ ప్రభుత్వం 2024 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కుల సర్వేలో అనేక ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 97శాతం మంది వివరాలను సేకరించి, వారిలో...

సర్వేలో కానరాని ఈడబ్ల్యూఎస్‌!

తెలంగాణ ప్రభుత్వం 2024 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కుల సర్వేలో అనేక ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 97శాతం మంది వివరాలను సేకరించి, వారిలో 3.55 కోట్ల మంది ప్రజలు వెనుకబడి ఉన్నారని ఈ సర్వే (SEEEPC–2024) తేల్చింది. సర్వే ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 242 కులాలు ఉన్నాయి. అందులో 59 ఎస్సీ, 32 ఎస్టీ, 134 బీసీ, 18 ఓసీ కులాలు ఉన్నాయి. ఈ సర్వే షెడ్యూల్‌లో మొత్తం 57 ప్రశ్నలు, 75 ఉప అంశాలు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా కులాల్లోని వివక్ష, వెనుకబాటుతనం వంటి అనేక అంశాలను ఈ సర్వే పరిగణనలోకి తీసుకుంది. ఈ విస్తృత సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి నివేదిక సమర్పించడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ (IEWG)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో నేనూ ఓ సభ్యుడినే.
ఈ డేటా ప్రకారం, గుర్తించబడిన 32 షెడ్యూల్‌ తెగలలో.. 25 తెగలకు చెందిన 99శాతం మంది రాష్ట్ర సగటుతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నారు. అదే విధంగా, 59 ఎస్సీ వర్గాలలో 41 కులాలకు చెందిన 97శాతం మంది కూడా సగటు స్థాయి కంటే దిగువన ఉన్నారు. బీసీలలో 69 కులాలకు చెందిన 71శాతం మంది కూడా చాలా వెనుకబడి ఉన్నారు. కానీ, ఓసీ కులాలకు చెందిన 18 వర్గాల వారందరూ మాత్రం రాష్ట్ర సగటుతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారు!

ఈ డేటాను పరిశీలిస్తే.. రాష్ట్రంలోని అగ్ర కులాలలో ఆర్థిక వెనుకబాటుతనం కనిపించడం లేదు. ఈ పరిస్థితే దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటుందని భావించవచ్చు. సూటిగా చెప్పాలంటే, రాష్ట్రంలోని ఓసీల్లో ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) కనిపించడం లేదు. ఈ లెక్కలు ఒక ముఖ్యమైన ప్రశ్నను తెరపైకి తెస్తున్నాయి– తెలంగాణలో, ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఓసీ కులాల శాతం ఎంత? దీని ప్రకారం.. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఓసీ కులాలకు ఇచ్చే 10శాతం ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ అమలును ఎలా అర్థం చేసుకోవాలి? ఈడబ్ల్యుఎస్‌ కోటాను సమర్థించేవారు.. మనదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణం ఆర్థిక అసమానతలేనని చెబుతూ, కులంను పక్కన పెట్టారు. అయితే, అది నిజం కాదని, ప్రజలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉండడంలో కులం ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఈ తెలంగాణ కుల సర్వే చెబుతున్నది. జనాభా ప్రాతిపదికన చూసినా, ఎస్టీలలో 99శాతం, ఎస్సీలలో 97శాతం, బీసీలలో 71శాతం మంది రాష్ట్ర సగటుతో పోలిస్తే ఎక్కువగా వెనుకబడి ఉన్నారు! దీనికి విరుద్ధంగా, ఓసీ కులాలకు చెందిన వారందరూ రాష్ట్ర సగటుతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నారు.

తెలంగాణలోని మొత్తం 242 కులాలలో కేవలం నాలుగు కులాల వారు (మాదిగ, లంబాడీ, ముదిరాజ్, యాదవులు) తీవ్రమైన పేదరికం (ఏడాదికి రూ.లక్ష కంటే తక్కువ ఆదాయం కలిగిన స్థితి)లో జీవిస్తున్నారు. రాష్ట్రంలోని 1.1 కోట్ల మందిలో దాదాపు 40శాతం ఈ పేద వర్గాలు ఉన్నాయి. ఈ నాలుగు కులాలు రాష్ట్ర జనాభాలో 33శాతమే ఉన్నప్పటికీ, అత్యంత పేదలలో వీరి వాటా ఎక్కువగా ఉంది. దీన్నిబట్టి చూస్తే.. కుల వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉన్నాయని ఈ తీవ్రమైన అసమానతలు స్పష్టం చేస్తున్నాయి.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, రాష్ట్రంలో ఓసీ (ఓసీ ముస్లింలు సహా)ల జనాభా కేవలం 11.9శాతం మాత్రమే. అయినప్పటికీ, వారికి ఈడబ్ల్యుఎస్‌ కోటా కింద 10శాతం రిజర్వేషన్ లభిస్తోంది. ఇది వారి జనాభా వాటాతో పోలిస్తే దాదాపు సమానం! దీనికి విరుద్ధంగా, బీసీ/ఓబీసీ వర్గాలు రాష్ట్ర మొత్తం జనాభాలో 56.4శాతం ఉన్నా, వారికిచ్చే రిజర్వేషన్‌ కేవలం 27శాతం మాత్రమే. కాబట్టి.. ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉన్న సామాజిక న్యాయం భావనకు వ్యతిరేకం కాకపోయినా, రిజర్వేషన్ వ్యవస్థ అసలు ఉద్దేశాన్ని కొంతవరకు బలహీనపరుస్తోందని భావించాలి.

ఈ సర్వేలో కనిపించిన ఆశ్చర్యకర అంశాలలో ఒకటి ‘నో క్యాస్ట్‌’ అనే వర్గం. ఇది రాష్ట్ర మొత్తం జనాభాలో 3.4శాతం (దాదాపు 12 లక్షలు)గా ఉంది. ‘Other’ వర్గంతో కలిపితే ఇది 3.9శాతానికి చేరుతుంది. ఈ సర్వేలో No-Caste, No-Category, No-Religion అనే విభాగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే– ఈ ‘నో క్యాస్ట్‌’ వ్యక్తులు ఎవరు? అంటే.. వీరు ప్రధానంగా పట్టణ ప్రాంతాలకు చెందిన చదువుకున్న ఉద్యోగులు, నిపుణులు. వీరిలో అధికశాతం జీహెచ్‌ఎంసీ పరిసర ప్రాంతాల నుంచే నమోదయ్యారు. ఇక ‘Other’ వర్గం అనేది రాష్ట్ర అధికారిక జాబితాలో లేని చిన్న చిన్న కులాలను సూచిస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ‘నో క్యాస్ట్‌’ అని గుర్తింపు పొందిన వారిలో 43శాతం మంది వద్ద కుల ధ్రువీకరణ పత్రం ఉంది! వీరిలో 13.5శాతం మంది రిజర్వేషన్ ప్రయోజనాలు పొందారు. అంటే, వారిలో దాదాపు సగం మంది వాస్తవానికి రిజర్వేషన్ వర్గాలకు చెందినవారే! ‘నో క్యాస్ట్‌’ వర్గానికి చెందినవారు ప్రభుత్వ ఉద్యోగాలలో 7.7శాతం, ప్రైవేట్ ఉద్యోగాలలో 13.3శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇది రాష్ట్ర సగటు (ప్రభుత్వంలో 2.8శాతం, ప్రైవేట్‌లో 7.4శాతం)తో పోలిస్తే ఎక్కువ. వీరిలో వెనుకబాటుతనం కూడా తక్కువగా ఉంది. కాబట్టి వీరు రాష్ట్రంలోని అత్యంత ధనిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని భావించాలి.

ఇప్పటి అస్తిత్వ రాజకీయాల (identity politics) కాలంలో కులంను పట్టించుకోకుండా ఉండే ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ధోరణి విద్యా, ఆర్థిక పురోగతితో పాటు, వ్యక్తులు తమ కుల గుర్తింపు నుంచి బయటపడాలనే ఆకాంక్ష వల్ల ఏర్పడుతోంది. సర్వే నివేదికలో పేర్కొన్నట్లుగా, ఈ వర్గానికి చెందినవారు అగ్రకుల ప్రయోజనాలతో ఎదిగిన ఉన్నత విద్యావంతుల కుటుంబాల నుంచి వచ్చి ఉండవచ్చు. లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పైకి ఎదిగిన కొత్త తరాల వారైనా కావచ్చు. ‘నో క్యాస్ట్‌, అదర్స్‌’ అంటూ కుల తటస్థతను స్వీకరించడం అనేది; ఒకవైపు కుల ఆధారిత ప్రతికూలతల నుంచి దూరంగా ఉండాలనే కోరికను, మరోవైపు ఉన్నత స్థాయి ప్రభుత్వ సంస్థలు ప్రోత్సహించే ప్రతిభ ఆధారిత వ్యవస్థను అంగీకరించే వ్యూహాత్మక నిర్ణయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ధోరణి, రిజర్వేషన్లు కులం ఆధారంగా కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఇవ్వాలని భావించే మెరిటోక్రసీ సిద్ధాంతంతో సరిపోతుంది. ఇదే.. ఈడబ్ల్యుఎస్‌ కోటాను భారతీయులు ఎందుకు విస్తృతంగా అంగీకరించారో (రిజర్వేషన్ పొందే వర్గాలవారు కూడా పెద్దగా వ్యతిరేకించకుండా) వివరిస్తుంది. అయితే, ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది– ‘అగ్ర కుల ధనికవర్గాలు తమ జనాభా వాటాకు సమానంగా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుండగా, జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీ వర్గాలు ఎందుకు కేవలం 27శాతం రిజర్వేషన్‌కే పరిమితమవుతున్నాయి?’

ప్రొఫెసర్ భంగ్యా భూక్యా

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్

Address

Datharam Village Lingal Mandal Nagarkurnool Telangana
Telangana
509401

Telephone

+919652537452

Website

Alerts

Be the first to know and let us send you an email when Voice of bahujana telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Voice of bahujana telangana:

Shortcuts

Share