23/12/2022
"చదివిద్దాం" https://www.schoolascholar.org/ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం
సందర్భంగా నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్ నందు గణిత టాలెంట్ క్విజ్ పోటీ పరీక్ష నిర్వహించబడింది. అన్ని యాజమాన్యాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వేరువేరుగా పరీక్ష నిర్వహించాము. ప్రధమ , ద్వితీయ, తృతీయ బహుమతుల ప్రధానం జరిగింది (దాదాపు 30 వేల రూపాయాలు ఇందుకు గాను వెచ్చించడం జరిగింది). ఈ సందర్భంగా పేద విద్యార్థులకు రూ. 5. 50 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది. అంతే కాకుండా 12 మంది విద్యార్థుల చదువుల బాధ్యతలను "చదివిద్దాం" ట్రస్ట్ తీసుకున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో విద్యాభివృద్ధిలో భాగంగా.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి అభ్యున్నతికి మా "చదివిద్దాం" ట్రస్ట్ ద్వారా సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని హామీ ఇస్తున్నాము..!!