21/04/2025
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సికింద్రాబాద్ భాగ్*🚩🚩🚩🚩🚩🚩🚩🚩
శాఖ సంగమం
(ఏప్రిల్ 20,2025, ఆదివారం)
సంఘ శతాబ్ది (2025 - 26)*
పూర్వతయారీలో భాగంగా సికింద్రాబాద్ భాగ్ లోని 78 బస్తీల నుండి 98 శాఖల నుండి 943 మంది స్వయంసేవకులు శాఖ సంగమంలో పాల్గొన్నారు...
కార్యక్రమంలో వక్తగా *శ్రీ లింగం శ్రీధర్ జి (ఆర్ఎస్ఎస్ - తెలంగాణ ప్రాంత ప్రచారక్) మాట్లాడుతూ......,
సంపూర్ణ హిందూ సమాజ సంఘటనే లక్ష్యంగా,సమాజ పరివర్తన కై భారత్ ను సశక్త సమర్థభారత్ గా తీర్చిదిద్ది విశ్వగురువుగా భారత్ ను తీర్చిదిద్దుటకై శాఖ మాధ్యమంగా సంఘ్ గడిచిన వంద సంవత్సరాలుగా ముందుకు సాగుతుంది.
ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో హిందూ సంఘటిత సమాజమే దేశానికి శ్రీరామరక్షయనీ, దేశ విచ్చిన్నకర శక్తులు ఎన్ని సమస్యలు సృష్టించిన సమాజసేవే లక్ష్యంగా సకారాత్మక దృక్పథంతో సమాజంలో అన్ని రంగాల వారిని కలుపుకుని స్వయంసేవకులు ముందుకు సాగుతున్నారని ఈ ఫలితం గానే దేశం అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రస్తుతం పరిష్కారం లభిస్తుందని తెలిపారు..
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రతిరోజు శాఖలో పాల్గొంటూ స్వయంసేవకులు తమను తాము తీర్చిదిద్దుకుంటూ సమాజ పరివర్తనకై పనిచేస్తున్నారని* కావున *నిత్య శాఖలో ఉపస్థితి ఉండడం స్వయంసేవకుల ప్రథమ కర్తవ్యం* అని తెలిపారు.
ఈ సంగమంలో....,
బాల, తరుణ, ప్రౌడ స్వయంసేవకులు పాల్గొన్నారు...
భారత్ మాతాకీ జై*🚩
సంఘ కార్యమే ఈశ్వరీయ కార్యం*🙏