30/07/2026
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కేవలం ఒక సంస్థ కాదు.. ఇది అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు ప్రతిబింబం. "సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు" అని నమ్మిన ఆ మహనీయుని ఆశయాలకు అక్షరరూపం ఇవ్వడమే ఈ ట్రస్ట్ లక్ష్యం.
ఆ లక్ష్య సాధన కోసం మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1997లో ఈ ట్రస్ట్ను స్థాపించారు. 1997 నుంచి 2026 వరకు సాగిన ఈ 29 ఏళ్ల ప్రస్థానం.. సేవ, సంకల్పం, సమాజాభివృద్ధికి అంకితమైన ప్రయాణం.
_ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్ర కుమార్ ఐపీఎస్ ( రిటైర్డ్) గారు.