01/09/2024
SC వర్గీకరణ మాదిగ మరియు ఉపకులాల #మానవ_హక్కులకు సంబంధించిన అంశం.
🏛️ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు గడిచినా, ఇంకా రిజర్వేషన్ల గురించి స్పష్టమైన అవగాహన లేని ఎస్సీ కులాలు వేలల్లో ఉన్నాయి. కేవలం కొన్ని ఎస్సీ కులాలు మాత్రమే తిరిగి తిరిగి రిజర్వేషన్ల లాభాలు పొందుతుండటంతో, అందరికీ సమానంగా రిజర్వేషన్ ప్రయోజనాలు అందించాలని ఈ తీర్పు ఇచ్చింది.
🎉 ఈ తీర్పు మాదిగ ఉపకులాల హక్కుల కోసం 30 సంవత్సరాలుగా పోరాడిన #మందకృష్ణ_మాదిగ గారి సుదీర్ఘ కృషి ఫలితం #మేమెంతో_మాకంత అనే నినాదంతో ప్రారంభమైన #మాదిగ_దండోరా ఉద్యమ విజయం.
🐘 ఈ తీర్పును నార్త్ లో వ్యతిరేకిస్తుంది మాదిగ సమాంతర కులం అయిన చమార్లు అయితే సౌత్ లో వ్యతిరేకిస్తుంది కొందరు మాలలు. ఇద్దరూ వ్యతిరేకిస్తుంది ఒకటే కారణం - ఇప్పటి వరకు తమ జనాభా కన్నా వారు ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందడమే.
🪜 నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో దళితులు అడుగున ఉంటే వారిలో కొన్ని ఉప కులాలు ఈ సమాజానికి అందనంత దిగువున ఉన్నాయి, దళితుల్లో కుడా పైకులానికి ఊడిగం చేస్తూ కింద కులాన్ని నిర్దయగా తొక్కేసే మనువాద భావజాలం బలంగా వుంది. ఇక్కడ ఒకటి స్పష్టం ఏ రెండు కులాలు ఒకటి కాదు, కొన్ని అంశాల్లో కలసి పని చేసినా మెజారిటీ అంశాల్లో అనేక అంతరాలు వున్నాయి. ముందుగా దళితుల్లో ఈ కుల భావన పోకుండా కలసి పోరాటం చేయడం రాజ్యాదికారం వైపు ప్రయాణం చేయడం అసాద్యం, ఈ భావన వదలకపోతే కుల వివిక్షలో భాగంగా మిగిలిపోవడం ఖాయం.
✨ ఈ సందర్భంగా అన్ని వర్గాలు సమన్వయం పాటిస్తూనే, రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా దక్కేలా ఆయా కులాల నాయకులు ప్రణాళికలు వేయాల్సిన సమయమిది.
✅ రిజర్వేషన్స్ వున్నాయి కానీ వాటిని పొందే విద్యావంతులు ఆయా కులాల్ల్లో వున్నారా?
ఆయా సమూహాల్ల్లో రిజర్వేషన్ ఫలాలు పొందటానికి ఆవసరమైన నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ సహకారంతో మారుమూల గ్రామాల్లో కుడా ఆధునిక లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటుకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ( - Human Rights Initiative ద్వారా ప్రతి వెనకబడిన గ్రామాల్లో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటుకి కృషి చేస్తున్నాం )
✅ #కుల_గణన: ఈ దేశంలో ప్రతి విషయంలో కుల అడ్డొస్తుంది, మన సమాజంలో బలంగా పాతుకుపోయింది అనే విషయాన్ని గుర్తించాలి. "మేమెంతో మాకంత" లెక్క తేలాలి అంటే దేశంలో కుల గణన జరగాలి. ప్రతి పది సంవత్సరాలకు జన గణన జరుగుతుంది కానీ కుల గణన జరగడం లేదు. వాటి ఆధారంగా రిజర్వేషన్స్ అమలు కావాలి. కుల గణన జరిగేలా ప్రభుత్వం పైన వత్తిడి తేవాలి.
✅ #ప్రైవేటు_రిజర్వేషన్స్ : ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అనేక సంస్థలు క్రమంగా ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నాయి. ఈ సందర్భంలో, ప్రైవేటీకరణకు గురవుతున్న ప్రభుత్వ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయడం చాలా కీలకం. రిజర్వేషన్లు సామాజిక న్యాయం, సమాన అవకాశాలను అందించేందుకు సహాయపడే ముఖ్యమైన సాధనాలు. ఇవి వివిధ సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా, వారి ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడానికే ఉద్దేశించబడ్డాయి. కనుక, ప్రైవేటీకరణ జరుగుతున్నా కూడా, ఈ రిజర్వేషన్ల ప్రాధాన్యతను కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు అందించేందుకు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి. ఈ విధంగా, సమాజంలోని ప్రతి వర్గం ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రైవేటు రిజర్వేషన్స్ కొరకు ప్రభుత్వాల మీద వత్తిడి తేవాలి.
✅ #కుల_నిర్మూలన: సమాజంలో ఉన్న కులపరమైన వివక్షలను, అసమానతలను పూర్తిగా తొలగించాలంటే కుల నిర్మూలన అత్యవసరం. కులవ్యవస్థ కారణంగా ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి, అవి సామాజిక అభివృద్ధికి పెద్ద అడ్డుకట్ట అవుతున్నాయి. కాబట్టి, కుల నిర్మూలనతో పాటు భూమిని జాతీయం చేసి భూసమానత్వాన్ని తీసుకురావడం ద్వారా కులపరమైన, ఆర్థికపరమైన వివక్షలను తొలగించవచ్చు.
✅ #రిజర్వేషన్స్_అంతం_కావాలి: కుల నిర్మూలన జరిగింది, భూమి జాతీయం అయింది, అందరికి సమాన హోదా వుంది, ఇక రిజర్వేషన్స్ తో పనేముంది? ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను పునరాలోచించి, నిజమైన సమాన సమాజం కోసం వాటి రద్దును కూడా పరిగణించాలి. ఈ చర్యలన్నీ కలిపి ఒక సమానత్వ సమాజం నిర్మాణానికి దారితీస్తాయి.
🤝 గమనిక: ఈ తీర్పు పై నా అభిప్రాయాలను మరియు భవిష్యత్ కోసం నా అభిప్రాయాలను ఇక్కడ పంచుకున్నాను. భారతదేశంలో కుల వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి, సమాన హక్కులు మరియు అవకాశాలు ప్రతి వర్గానికి అందేలా చేయడానికి సామాజిక ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలు, మరియు న్యాయవ్యవస్థలు సమన్వయంతో ముందుకు సాగాలని నేను భావిస్తున్నాను. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు, కుల గణన, మరియు సమాన విద్యా అవకాశాలు అందించడం వంటి అంశాలు ఎంతో కీలకం. కుల నిర్మూలన సాధించడంలో ప్రతి ఒక్కరికి కీలక పాత్ర ఉంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, మన సమాజంలో సమానత్వం సాధించడానికి మనందరం కలసి కృషి చేయాలి.
సామాజిక ఉద్యమాభివందనాలు
విజయ్ వంగలపూడి - మానవ హక్కుల కార్యకర్త
- Director - ProjectNAVAYAN
పిక్ సందర్భం: వర్గీకరణ తీర్పు అనంతరం హైదరాబాద్ విజయోత్సవ ర్యాలి తర్వాత ప్రొఫెసర్ కాశిం అన్నగారితో కలసి మందకృష్ణ మాదిగ గారి నివాసంలో కలిసి అభినందించిన సందర్భంగా...