01/10/2025
*ఆహ్వానం 02-10-2025*
𝐕𝐈𝐉𝐀𝐘𝐀𝐖𝐀𝐃𝐀 𝐔𝐓𝐒𝐀𝐕 - 𝟐𝟎𝟐𝟓
𝐎𝐍𝐄 𝐂𝐈𝐓𝐘.... 𝐎𝐍𝐄 𝐂𝐄𝐋𝐄𝐁𝐑𝐀𝐓𝐈𝐎𝐍
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో "సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ" ఆధ్వర్యంలో జరుగుతున్న "విజయవాడ ఉత్సవ్" లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.. విజయదశమి పండుగ శోభను దేశ, విదేశాల్లో చాటి చెప్పేలా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలన్న మహోన్నత లక్ష్యంతో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు, మంత్రులు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు, నగర ప్రముఖులు మరియు అధికారులతో కలిసి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివల్ వాక్ కు శ్రీకారం చుట్టారు...
ఈ కార్యక్రమం రేపు(02-10-2025) సాయంత్రం 4:00 గంటలకు విజయవాడ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు అంగరంగ వైభవంగా సాగనుంది....
ఈ కార్నివాల్ వాక్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు* విచ్చేయనున్నారు...
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గాల డివిజన్, మండల, గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నారు...
ఈ కార్నివల్ లో ప్రధాన ఆకర్షణగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై అమ్మవారి ఊరేగింపు, నాసిక్ డోలు, కాళిక వేషాలు, పోతురాజులు, లంబాడి సంప్రదాయ నృత్యం, గుస్సాడీ, కేరళ డ్రమ్స్, కర్ర సాము, తీన్మార్, సన్నాయి మేళం, కథాకళి, స్టిక్ వాకర్స్, పగటి వేషాలు, వీరాగాసలు, బేబీ నాట్యం, చెక్కభజనలు, , కోలాటం, గారడి, యక్ష కళలు, బేతాళ సెట్టు, అఘోరాలు, గొరిల్లా డాన్స్ లు, డప్పు వాయిద్యాలు, మరియు మంగళవాయిద్యాలు, బృందాల నృత్యాలు, సంప్రదాయ వేషధారణలో 3000 మంది కళాకారులు పాల్గొని, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజలను మంత్రముగ్ధులను చెయ్యనున్నారు...
కావున కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు, నగర ప్రజలు, నియోజకవర్గాల ప్రజలు తప్పక హాజరు కాగలరు...
*ఇట్లు*
*సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ*.